భీమవరం నుంచే జనసేనాని పోటీ!

Publish Date:Jul 15, 2022

Advertisement

ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్నది సామెత. జనసేనాని పవన్ కల్యాణ్ కూడా అదే సామెతను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. గత ఎన్నికలలో ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం,  విశాఖ జిల్లా గాజువాకల నుంచి అసెంబ్లీ బరిలోకి దిగారు. అయితే రెండు చోట్లా ఆయన పరాజయం పాలయ్యారు. దీంతో ఈ సారి ఆయన తిరుపతి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారని వార్తలు వచ్చాయి. పలు సందర్భాలలో జనసేని వర్గాలు  ఆ విషయాన్ని దాదాపు ఖరారు చేసినట్లే మాట్లాడారు. కానీ తాజా సమాచారం మేరకు వచ్చే ఎన్నికలలో ఆయన మళ్లీ భీమవరం నియోజకవర్గం నుంచే బరిలోకి దిగనున్నారు. 2014 ఎన్నికలలో జనసేన బీజేపీ, టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చి ఎన్నికలలో పోటీకి దూరంగా ఉంది.

అయితే 2019 ఎన్నికలలో మాత్రం బీజేపీ, తెలుగుదేశం పార్టీలతో పొత్తును, మైత్రిని కటీఫ్ చేసుకుని ఒంటరిగా బరిలోకి దిగింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ భీమవరం, గాజువాక స్థానాల నుంచి పోటీలో నిలిచారు.  అయితే ఆ ఎన్నికలలో జనసేనకు ఘోర పరాజయం ఎదురైంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా పోటీ చేసిన రెండు స్థానాలలోనూ పరాజయం పాలయ్యారు. జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో మాత్రమే విజయం సాధించగా, పోటీ చేసిన మిగిలిన అన్ని స్థానాలలోనూ పరాజయం పాలైంది. వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీ ఏ పార్టతో పొత్తు పెట్టుకుంటుందన్నది ఖరారు కాలేదు.

అయితే జనసేన మాత్రం ఈ సారి ఎన్నికలలో విజయంపై సీరియస్ గా దృష్టి పెట్టినట్లు ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కచ్చితంగా విజయం సాధించాలన్న లక్ష్యంగా పవన్ కల్యాణ్ సురక్షిత స్థానం కోసం చేసిన అన్వేషణలో తిరుపతి నుంచి అయితే బెటర్ అన్న అభిప్రాయానికి వచ్చినట్లు ఇప్పటి వరకూ పార్టీ శ్రేణులు చెబుతూ వచ్చాయి.

అయితే అవన్నీ ఊహాగానాలేననీ, పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికలలో భీమవరం నుంచే పోటీ చేస్తారనీ జనసేన పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు గోవిందరావు శుక్రవారం ప్రకటించారు. ఈ నెల 17న పవన్ కల్యాణ్ భీమవరంలో పర్యటించనున్నారు. ఆ పర్యటనలోనే పవన్ కల్యాణ్ భీమవరం నుంచే తన పోటీ అని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని  జనసేన వర్గాలు చెబుతున్నాయి. 

By
en-us Political News

  
ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకుని దాదాపు మూడు వారాల పాటు విధులకు దూరంగా హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకున్న ఆయన బుధవారం ఉదయం అమరావతిలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకుని విధుల్లో నిమగ్నమయ్యారు.
ఈ బలపరీక్షలో విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా 144 మంది శాసనసభ్యులు మద్దతు పలకగా.. 22 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. మరో ఐదుగురు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
అయితే 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి అమరావతి నిర్మాణ వేగం పెరిగింది. అయినా వైసీపీ అధినేత మావిగన్ ప్రతిపాదన, అమరావతి పురోగతిని అడుగడుగునా అడ్డుకోవడమే లక్ష్యంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, వ్యవహరిస్తున్న తీరు మాత్రం అమరావతి అనిశ్చితి మేఘాలు పూర్తిగా తొలగిపోకుండా ఉండేందుకు కారణమయ్యాయి.
బండి బగీరథ ఈ కేసు నుంచి పులుకడిగిన ముత్యంలా బయటపడితేనే.. తిరిగి బండి సంజయ్ కు పార్టీలో ప్రాధాన్యత, గుర్తింపు ఉంటాయని అన్యాపదేశంగానే అయినా విస్పష్ట సందేశం ఇచ్చింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వమైతే.. చట్టం ముందు అంతా సమానమేనని స్పష్టం చేసింది.
ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో విజయ్ తన కారు డ్రైవర్‌ రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్‌కు విజయ్ టీవీకే తరఫున టికెట్ ఇచ్చారు. చెన్నైలోని విరుగంబాక్కం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శబరినాథన్ విజయం సాధించారు. తాజాగా ఆయన్ను ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు.
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో కీలక సమావేశం నిర్వహించారు.
కేవలం మర్యాదపూర్వక భేటీలుగా వీటిని చూడలేమని, దీని వెనుక తెలంగాణలో ఎన్డీయే కూటమిని బలోపేతం చేసే భారీ వ్యూహం దాగి ఉందనీ ప్రముఖ విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు అన్నారు. తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ప్రధాని మోదీ చంద్రబాబు నాయుడు నివాసంలో గంటకు పైగా గడపడం.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి పరామర్శించడం వెనుక లోతైన రాజకీయ అర్థాలు ఉన్నాయన్నారు.
తమిళనాడు ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా ఏటా సుమారు రూ.48వేల‌ కోట్ల ఆదాయం వస్తోంది. ప్రస్తుతం మూసివేసినవి కేవలం 717 దుకాణాలు మాత్రమే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దుకాణాల్లో ఇది కేవ‌లం 15శాతం మాత్ర‌మే. ఇందువల్ల ఆదాయంలో కొంత తగ్గుదల ఉన్నప్పటికీ, అది భారీ నష్టం కాకపోవచ్చు.
తమిళనాట కొత్త రాజకీయానికి తెర తీసిన నటుడు దళపతి విజయ్… ప్రత్యేకతను చాటుతున్నారు. తమిళ సంప్రదాయానికి భిన్నంగా పంచెకట్టును పక్కనపెట్టేసిన విజయ్, సూట్ వేసుకుని మరీ ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అది పక్కన పెడితే.. రాజకీయాలలో విలువలకు పెద్ద పీట వేస్తాననడానికి సంకేతంగా సీఎం హోదాలో విజయ్ తాజా మాజీ సీఎం ఎంకే స్టాలిన్ ఇంటికి వెళ్లి మరీ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
పార్టీలోని ఒక కీలక వర్గం దళపతి విజయ్ తమిళగ వెట్రి కళగం వైపు మొగ్గు చూపుతోంది. విలుప్పురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సి.వి. షణ్ముగం, ఆయన వర్గంలోని కీలక నేతలు విజయ్ పార్టీ వైపు చూస్తున్నారన్న చర్చ తమిళనాట జోరుగా సాగుతోంది.
అభిషేక్ బెనర్జీ గత దశాబ్దంగా అత్యున్నత స్థాయి భద్రతా వలయంలో ఉంటూ వచ్చారు. అయితే సోమవారం సాయంత్రం జారీ చేసిన పరిపాలనా ఉత్తర్వుల ప్రకారం, ఆయనకు కేటాయించిన అదనపు సెక్యూరిటీ సిబ్బందిని, ప్రత్యేక పైలట్ వాహనాలను ఉపసంహరించారు. ఇకపై ఆయనకు ఒక సాధారణ పార్లమెంటు సభ్యుడికి ఉండే భద్రత మాత్రమే ఉంటుంది.
కల్వకుంట్ల కవిత నేతృత్వంలోని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) కీలక నిర్ణయం తీసుకుంది.
మాములుగా మోడీ లోకేష్ తో క్లోజ్ గా ఉండే ఫోటోల‌కే లెక్క‌లేన‌న్ని కామెంట్లు వ‌స్తుంటాయి. అలాంటిది లోకేష్ త‌న‌యుడికి కూడా మోడీ ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేకంగా ముచ్చటించడం ప్రాథాన్యత సంతరించుకుంది. చంద్రబాబు, లోకేష్ తో పాటు నారా వారి ఇంట మూడో తరం పిల్లవాడు దేవాన్ష్ కు కూడా ప్రధాని మోడీ ఇంత ప్రాధాన్యత ఇవ్వడానికి కారణాలేంటంటూ.. నెటిజనులు పలు విధాలుగా స్పందిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.