జనసేన పార్టీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓటమిపాలయ్యాక ఆ పార్టీపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీలో చేరబోతున్నారని, జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. కాగా ఈ వార్తలపై తాజాగా పవన్ కళ్యాణ్ స్పందించారు. జనసేన పార్టీని ఏ పార్టీలో విలీనం చేయబోమని, ఎంత కష్టమైనా సరే పార్టీని నడిపిస్తామని పవన్ స్పష్టం చేసారు.
నర్సాపురం లోక్సభ పరిధిలోని నాయకులు, కార్యకర్తలతో ఆదివారం రాత్రి ఉండి శివారు కోట్లా కల్యాణ మండపంలో సమావేశం నిర్వహించారు. హాజరైన కార్యకర్తలను ఉద్దేశించి పవన్ ప్రసంగించారు. ‘పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికీ హామీ ఇస్తున్నాను. పార్టీని బలంగా నడిపిస్తాను. ఏ పార్టీలోనూ విలీనం చేయను. రాష్ట్ర ప్రజలకు, ఓటేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెబుతూ భీమవరం నుంచి మాట ఇస్తున్నా. ఇక్కడ నుంచి ఓడిపోయినా.. ఓడించబడ్డ నేల నుంచి చెబుతున్నా.. జనసేన ఎప్పటి వరకూ ఉంటుందంటే మీలో నలుగురు నన్ను మోసే వరకు!’ అని పవన్ స్పష్టం చేశారు.
‘జగన్ ఏం మాట్లాడతారు. ఇది విమర్శ కాదు. ఈరోజుకూ చాలాచోట్ల పెన్షన్లు ఇవ్వలేదు. మూడు వేలు ఇస్తానని కేవలం రూ.250 పెంచారు. గత నెల 8న ఇచ్చారు. ఈ నెల ఇప్పటికీ కొన్నిచోట్ల అందలేదు. ఇసుక కొరత గురించి లేఖ రాశాను. దీనిపై వారు ఏదో పాలసీ తీసుకొస్తున్నామన్నారు. దాని గురించి ఎదురుచూద్దాం. ఇంకా కష్టాలు ఎదురైతే అప్పుడు ఆలోచిద్దాం. సమస్యలపై ఎమ్మెల్యేలను నిలదీయాలి. మన కార్యకర్తలను వైసీపీ ఇబ్బంది పెడుతుంటే ఊరుకోను. ముందు ఫిర్యాదులు చేయండి. అప్పటికీ మాట వినకపోతే నేను వస్తాను. చట్టపరంగా ఏం చేయాలో ఆలోచిద్దాం. ప్రస్తుతం బెదిరిస్తున్నారు. పరిస్థితులు ఇంకా దారుణంగా ఉండే రోజులు వస్తాయి. మీ మీద దెబ్బపడాలంటే ముందు నా ఒంటి మీద పడాలి. మీ ఒంటి మీద గాయం పడాలంటే నా తల తెగిపడాలి’ అని పవన్ వ్యాఖ్యానించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pawan-kalyan-reaction-on-janasena-merge-in-bjp-39-88498.html
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు