నాగబాబుపై పవన్ కల్యాణ్ ఫైర్.. ఎందుకంటే?

Publish Date:Feb 3, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో  తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం చుట్టూ రాజకీయం వేడెక్కుతోంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ సుప్రీంలో చార్జిషీట్ దాఖలు చేసిన క్షణం నుంచీ ఏపీ రాజకీయం రగులుతోంది. చార్జిషీట్ లో నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సిట్ నిర్ధారించిందని వైసీపీ అంటుంటే.. తెలుగుదేశం సిట్ చార్జిషీట్ అసలది నెయ్యే కాదని తేల్చిందని చెబుతోంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ తన విమర్శల దాడి పెంచి.. అధికార కూటమిని రెచ్చగొట్టి లబ్థి పొందాలని చూస్తోంది. అందులో భాగంగానే.. నెయ్యి కల్తీ వ్యవహారంలో  దూకుడుగా విమర్శలు చేసిన పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసుకుని వైసీపీ విరుచుకుపడుతోంది. పాప ప్రక్షాలన, పరిహారం అంటూ ఆలయాల శుద్ధి కార్యక్రమం చేపట్టింది. 

ఈ నేపథ్యంలోనే జనసేనాని సోమవారం (ఫిబ్రవరి 1) పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పవన్ కల్యాణ్ ఒకింత అసహనం, మరింత ఆవేశం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మూడు పార్టీల కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందంటూ.. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో ప్రభుత్వ గళాన్ని వినిపిం చడంలో జనసేన నేతలు ఉదాశీనంగా వ్యవహరించడంపై మండి పడ్డారు. ఎవరి పేరూ ఎత్తకపోయినా, ఆయన మాట్లాడిన మాటలను బట్టి ఆయన తన సోదరుడు నాగబాబుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారని అర్ధమౌతోంని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి దగ్గర దగ్గర రెండేళ్లు కావస్తున్నది. ఈ రెండేళ్ల కాలంలోనూ ప్రభుత్వ పరంగా ఎలాంటి అరమరికలూ లేకుండా మూడు పార్టీల నేతల మధ్యా సమన్వయం ఉందన్న విషయం అవగతమౌతున్నది. అయితే క్షేత్ర స్థాయిలో మాత్రం మూడు పార్టీలూ కూడా ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నాయి.  రాష్ట్రంలోపెద్దగా సొంత బలం లేని బీజేపీని పక్కన పెడితే.. ప్రధానంగా తెలుగుదేశం, జనసేనల మధ్య క్షేత్రస్థాయిలో అంతగా సమన్వయం కనిపించడం లేదు. ఆ విషయం తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ కేసుకు సంబంధించి వైసీపీ విమర్శలకు దీటుగా బదులిచ్చే విషయంలో ప్రస్ఫుటంగా బహిర్గతమైంది. అంతకు ముందు కూడా పిఠాపురం వర్మ వ్యవహారంలోనూ తెలుగుదేశం, జనసేనల మధ్య విభేదాలు, సమన్వయ లేమి బయటపడింది. అప్పట్లో అంటే వర్మ వ్యవహారంలో ఇరు పార్టీల మధ్యా పొరపొచ్చాలకు పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు తీరు కారణమన్న విమర్శలు వినవచ్చాయి.

ఇక ప్రస్తుతానికి వస్తే.. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి వైసీపీ వ్యాఖ్యలు, విమర్శలకు సమాధానం చెప్పుకోవలసింది తెలుగుదేశం పార్టీయే అన్నట్లుగా జనసేన నేతలు వ్యవహరిస్తూ వచ్చారు. ఒక్క పవన్ కల్యాణ్ వినా మరెవరూ ఈ విషయంలో మాట్లాడకపోవడంతో పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మూడు పార్టీల కూటమి ప్రభుత్వం నడుస్తోంది. ఏ విషయంలోనైనా సరే మూడు పార్టీల గొంతూ ఒక్కటిగానే ఉండాలని పార్టీ నేతలు, కార్యకర్తలు, మంత్రులు, ఎంపీలకు విస్పష్టంగా చెప్పారు. ఆ సమయంలోనే ఆయన ఆడవారి దుస్తుల వ్యవహారంలో మాట్లాడడానికి కావలసినంత సమయం ఉంటుంది కానీ, పార్టీ, ప్రభుత్వానికి సంబంధించిన విషయాలపై స్పందించడానికి తీరిక ఉండదా? అని ప్రశ్నించారు పవన్ కల్యాణ్. సరిగ్గా ఇదే ఆయన ఆగ్రహం నాగబాబుపైనా అన్నచర్చకు తెర లేచింది. 

తిరుమలలడ్డూ తయారీకి వినియోగించిన  నెయ్యిలో కల్తీ వివాదం ఇప్పుడు పీక్స్ కు చేరుకుంది. ఈ విషయంపై నడుస్తున్న రాజకీయ వివాదంపై ప్రభుత్వం వాయిస్ ను జనసేన నాయకులూ వినిపించి తీరాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు.  కూటమి పరంగా మూడు పార్టీలు అటాక్ చేయాల్సిందేనని కుండబద్దలు కొట్టారు. చూడాలి మరి జనసేనాని ఆదేశాలతోనైనా జనసేన నేతలు తమ వాణిని బలంగా వినిపిస్తారేమో.

By
en-us Political News

  
దేవ్ జీ అరెస్ట్ ఎలా జరిగింది? అరెస్టు తరువాత ఆయన లొంగుబాటు ప్రకటన చేసి జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? లొంగిపోలేదు అంటూనే.. ప్రస్తుత పరిస్థితుల్లో అజ్ణాతంగా ఉండి ఉద్యమాన్ని కొనసాగించడం కష్టసాధ్యమని ఎందుకు చెబుతున్నారు?
త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి రావడం కన్ఫర్మ్ అన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి త్రిష నుంచి ఎటువంటి క్లారిటీ అయితే ఇప్పటి వరకూ రాలేదు. ప్రస్తుతం త్రిష పలు సినిమాలలో నటిస్తున్నారు. వాటిలో మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా కూడా ఉంది.
మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా పవన్ కల్యాణ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనీ, షూటింగ్ లంటూ అధిక సమయం హైదరాబాద్ లోనే ఉంటున్నారని రోజా అన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి సినిమాలలో యాక్టింగ్ కి పరిమితమైనట్లుగా పవన్ కల్యాణ్ తీరు ఉందని రోజా అన్నారు. కీలకమైన మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టడం సరికాదన్న రోజా దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే.. పాతిక మంది ఎమ్మెల్యేలు ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ భేటీ జరగడం సంచలనం సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదిక 16వ సంచికలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
జనసేన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఈసారి దూరం జరిగింది.
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్‌ రెండుసార్లు, కాంగ్రెస్‌ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.