పవన్ కళ్యాణ్ విమర్శలతో ఓట్లు రాలుతాయా?

Publish Date:May 1, 2014

Advertisement

 

నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి చేస్తున్న ఎన్నికల ప్రచార సభలకు విశేషంగా జనాలు తరలి వస్తున్నారు. సభకు వచ్చిన వారి నుండి మంచి స్పందన కూడా కనిపిస్తోంది. ఇంతవరకు కేసీఆర్ ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పవన్ చూపుతున్న ఈ తెగువ ఆయన అభిమానులను విపరీతంగా ఆకట్టుకొంటున్న మాట వాస్తవం. దానివలన తెదేపా-బీజేపీ కూటమికి ఓటింగ్ శాతం ఎంతో కొంత పెరగడం కూడా తధ్యం. అయితే సరిగ్గా ఇదే కారణం చేత వారి కూటమికి ఎంతో కొంత నష్టం కూడా జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

 

ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ తెలంగాణాలో ప్రచారం చేసినప్పుడు కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసారు. అది ఆయన అభిమానులను, యువతను ముఖ్యంగా తెలంగాణాలో స్థిరపడిన ఆంద్ర ప్రజలను కూడా చాలా ఆకట్టుకొంది. కానీ కేసీఆర్ గత పదేళ్ళుగా నిరంతర ఉద్యమాలు చేసి, చివరికి తెలంగాణా సాధించిన వ్యక్తి అని తెలంగాణా ప్రజల దృడాభిప్రాయం. అది నిజం కూడా. తెలంగాణా ప్రజల దృష్టిలో హీరోగా ఉన్న వ్యక్తిని పట్టుకొని, ఏనాడు ఉద్యమాల గురించి కానీ, రాష్ట్ర విభజన వ్యవహారం గురించి కానీ నోరు విప్పని ఆంధ్రాకు చెందిన పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించడం వలన తెలంగాణా ప్రజలు ఆగ్రహించడం సహజం. “మోడీ, ఇద్దరు ఆంధ్రా వాళ్ళను వెంటేసుకొని నాపై దాడి చేస్తున్నారు. అది నాపై చేస్తున్న దాడి కాదు. అది తెలంగాణా ప్రజలపై చేస్తున్న దాడి. మోడీ కూడా తెలంగాణకు శత్రువు” అని కేసీఆర్ అనడం కూడా అందుకే. పవన్ కళ్యాణ్ విమర్శల వలన ఎన్డీయే కూటమికే కాకుండా తెరాసకు కూడా ఎంత కొంత లాభపడవచ్చును. ఇరువురికీ అంతే నష్టం కూడా జరగవచ్చును కూడా. ఈ సంగతి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతే తేలుతుంది.

 

ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డిపై చేస్తున్న విమర్శల వలన కూడా అటువంటి మిశ్రమ ఫలితాలే కలగవచ్చును. ఎందుకంటే స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పధకాల వలన సామాన్య ప్రజలు, ముఖ్యంగా నిరుపేదలు ఎంతో కొంత ప్రయోజనం పొందారు. వారందరూ ఆయన హయాంలో ఎంత అవినీతి జరిగింది? ఎవరు ఎంత దోచుకొన్నారు? వంటి విషయాల కంటే అంతవరకు తమకు ఏ ప్రభుత్వమూ, ముఖ్యమంత్రి అందించలేని ప్రయోజనాలను నేరుగా అందించిన విషయాన్నే బాగా గుర్తు పెట్టుకొన్నారు.

 

ఇది గ్రహించిన జగన్ గత ఐదేళ్ళుగా తన తండ్రి నామస్మరణం చేస్తూ ప్రజలలో ఆ సానుభూతిని, ఆ పధకాలను మరుపురానీకుండా జాగ్రత్త పడ్డారు. అందువల్లనే నేటికీ జగన్మోహన్ రెడ్డికి ప్రజలలో అంత విశేష ఆదరణ కనబడుతోంది. తెలంగాణాలో కేసీఆర్ లాగే ఆంధ్రాలో రాజశేఖర్ రెడ్డికి ప్రజలలో అంతే గౌరవం ఉంది. అందువలన పవన్ కళ్యాణ్ ఆయనపై, ఆయనకు అసలు సిసలయిన వారసుడునని చెప్పుకొంటున్న జగన్ పై ఎంత తీవ్రంగా విమర్శలు గుప్పిస్తే ఎన్డీయే కూటమిపట్ల ప్రజలలో విముఖత ఏర్పడి నష్టం జరిగే అవకాశం కూడా ఉంది.

 

అక్కడ కేసీఆర్ తను చేసిన ఉద్యమాలను పేర్కొంటూ , పవన్ కళ్యాణ్ విమర్శలకు ఏవిధంగా ధీటుగా బదులిచ్చారో, ఇక్కడ సీమంద్రాలో జగన్, షర్మిల కూడా తమ తండ్రి చేసిన సంక్షేమ కార్యక్రమాలను ఉటంకిస్తూ అంతే ధీటుగా బదులిస్తున్నారు. అందువల్ల పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శల వలన సీమాంద్రాలో కూడా లాభమూ, నష్టమూ కూడా ఉండవచ్చును. కానీ పవన్ కళ్యాణ్ వారి అవినీతిని, వారి నిబద్దతను చాలా దైర్యంగా ప్రశ్నిస్తున్న తీరు మాత్రం యువతను,ముఖ్యంగా ఆయన అభిమానులను చాలా ఆకట్టుకొంటోంది. అది ఎన్డీయే కూటమికి ఓట్లు కురిపించే అవకాశం ఉంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.