Publish Date:May 12, 2023
రాముడిని, గోపాలుడిని కలిపి ఒకడిగా అవతరించిన రూపం రామగోపాలవర్మ. ఈయనను అందరూ అర్జీవీ అని పిలుచుకుంటారు. బహుశా ప్రపంచంలో యింత కన్ఫ్యూజన్ క్యారెక్టర్ మరోకటి ఉండదేమో అనినిస్తుంది అర్జీవీని చూస్తే. అసలే కన్ఫ్యూజన్ లో ఉండే ఈ పెద్ద మనిషి అందరినీ కన్ఫ్యూజన్ లో పెట్టడంలో బిజీగా ఉంటాడు.
అప్పుడెప్పుడో మూడున్నర దశాబ్దాల క్రితం ఒక సినిమా తీసి పాపులర్ అయిన రామ్ గోపాల్ వర్మ తన కెరీర్ ని కొంత కాలం కొనసాగించారు. టాలీవుడ్, బాలీవుడ్ లలో కొన్ని గొప్ప సినిమాలు తీసిన ఆర్జీవీ తరువాత తన విపరీత మనస్తత్వానికి పదును పెట్టాడు. సినిమాలు తప్ప అన్ని విషయాలపై తన మేధస్సును ప్రపంచానికి పంచే పని మొదలు పెట్టాడు. మొదట్లో జనాలకు ఆయన ధోరణి నచ్చింది కానీ క్రమంగా విద్యావంతులు, ఆలోచనాపరులు ఆర్జీవీ వాదలను వ్యతిరేకించడం మొదలైంది. తన సినిమాలను చూడండని తానెప్పుడూ ప్రేక్షకులను కోరలేదని బోల్డ్ స్టేట్ మెంట్స్ ఇచ్చే రామ్ గోపాల్ వర్మ, తన పట్ల పెరుగుతున్న వ్యతిరేకతను కూడా పాపులారిటీగా తీసుకున్నాడు. చిరంజీవి, శ్రీదేవి లాంటి పెద్ద స్టార్లతో సినిమా మొదలు పెట్టి ఆపేసిన ఆర్జీవీ తాను తీసిన సినిమాల కంటే ఆపేసినవే ఎక్కువ అని చెబుతుంటారు.
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఏ విషయాన్నీ ఆర్జీవీ వదిలి పెట్టడం జరగదు. అలాగే రాజకీయాలలో ఎవరు ఎలాంటి ప్రకటన చేసినా రామ్ గోపాల్ వర్మ నోరు విప్పక మానడు. రాంగోపాల్ వర్మ అంటే ఎందరికో వినోదం. కొందరికి అసహ్యం. కొద్ది మందికి అవసరం అనేది అందరికీ తెలిసిన అక్షర సత్యం. 2019 ఎన్నికల ముందు లక్ష్మీ పార్వతి కథతో సినిమా తీసి చంద్రబాబును ఇరుకున పట్టాలన్నా, పవన్ కల్యాణ్ ఏమి మాట్లాడినా దానిపై సెటైర్లు వేయాలన్నా అది రాంగోపాల్ వర్మకే సాధ్యం. ఆర్జీవీ చేసేప్రతి పనికీ ఒక ప్యాకేజీ ఉంటుందని సినీ పరిశ్రమలో చెప్పుకుంటారు.
అడవి దొంగ వీరప్పన్ తనకు ఆదర్శం అని బాహాటంగా చెప్పే అర్జీవీ నిజ జీవితంలో కూడా అలాంటి వ్యక్తులనే సమర్ధిస్తుంటాడు. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలు ఆయన మానసిక స్థితికి అద్దం పడుతున్నాయి.
సహజంగా పవన్ కల్యాణ్ పై వ్యాఖ్యలు చేసిన వారిని ఆయన అభిమానులు వదిలిపెట్టరు, కానీ తాజాగా పవన్ కల్యాణ్ పై ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలపై జనసైనికులు ఆగ్రహించినట్లుగా ఎక్కడా కనిపించలేదు. కారణం ఆర్జీవీని పట్టించుకోకపోవడమే సరైన జవాబు అని జనసేన భావించడమే ఆ పార్టీ శ్రేణులు చెప్పడం ఆర్జీవీ ప్రస్తుత స్థితిని అద్దం పడుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/parasite-rgv-25-155197.html
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.