Publish Date:May 12, 2023
కర్నాటక ఎన్నికల ఫలితాలు వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ఒక లిట్మస్ టెస్టుగా దాదాపు అన్ని రాజకీయ పార్టీలూ భావిస్తున్నాయి. ఇందుకు కేంద్రంలో ఉన్న బీజేపీ భావనలో కూడా మినహాయింపు లేదు. అందుకే కర్నాటకలో బీజేపీ సర్కార్ పట్ల ఉన్న తీవ్ర వ్యతిరేకతను గుర్తించిన కమలం పార్టీ సున్నత అంశాలను హైలైట్ చేస్తూ ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో విజయం కోసం సర్వ శక్తులనూ ఓడ్డింది. పోలింగ్ పూర్తై ప్రజా తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. శనివారం (మే13) ఫలితాలు వెలువడుతాయి.
ఈ నేపథ్యంలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలతో ఏ మాత్రం సంబంధం లేని బీఆర్ఎస్ ఈ రాష్ట్ర ఫలితాలపై ఎనలేని ఆసక్తి చూపుతోంది. జాతీయ రాజకీయాలలో తన ప్రస్థానం ఎలా సాగించాలన్న దానికి ఈ ఫలితాలను గీటురాయిగా బీఆర్ఎస్ తీసుకుంటోంది. కర్నాటకలో బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య హోరాహోరీగా పోరు జరిగిందన్న అంచనాల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకున్న పార్టీ కొద్ది నెలలో ఎన్నికలు జరగనున్న తెలంగాణలో మరింత ఉత్సాహంతో దూసుకు వెళుతుంది. అప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ గట్టిగా ఎదుర్కొనవలసిన పార్టీ కూడా అదే అవుతుంది.
ఆ ఉద్దేశంతోనే కర్నాటక ఫలితాలపై బీఆర్ఎస్ అధినేత అమిత ఆసక్తి చూపుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంతే కాకుండా ఒక వేళ కర్నాటకలో హంగ్ అంటూ ఏర్పడితే.. అప్పుడు ఆ రాష్ట్రంలో ఎన్నికలలో పాల్గొనకపోయినా చక్రం తిప్పే అవకాశం దొరుకుతుందని కేసీఆర్ భావిస్తున్నారనీ, జేడీఎస్ ద్వారా కర్నాటక రాజకీయాలలో తానే కింగ్ మేకర్ గా అవతరించే అవకాశం లభిస్తుందన్నది కేసీఆర్ భావన.
అదే జరిగితే బీఆర్ఎస్ జాతీయ రాజకీయాలలో మరింత ప్రభావమంతంగా వ్యవహరించేందుకు గట్టి పునాది ఏర్పడినట్లేనని కేసీఆర్ అంచనాగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ జాతీయ రాజకీయాలు సహా తెలంగాణలో మరో మారు అధికారాన్ని చేజిక్కించుకునేలా భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడానికి కూడా కర్నాటక ఫలితాలు ఒక గ్రౌండ్ ను ప్రిపేర్ చేస్తాయని కేసీఆర్ భావిస్తున్నారని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-future-activity-on-karnataka-results-25-155201.html
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.