కొత్త పెట్టుబడులు రావు.. ఉన్నవి నిలవవు!

Publish Date:Sep 26, 2023

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ రుణచక్రబంధంలో ఇరుక్కుపోయిందన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇలా నిబంధనలకు విరుద్ధంగా పరిమితులకు మించి అప్పులు ఎలా పొందగలుగుతోందన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. పొరుగునే ఉన్న సంపన్న రాష్ట్రం తెలంగాణకు అడుగడుగునా ఆంక్షలు, అడ్డంకులు ఎదరౌతుంటే.. ఏపీకి మాత్రం ఎలాంటి పరిమితులూ లేకుండా అప్పులు ఎలా దక్కుతున్నాయి? ఈ ప్రశ్నలు సహజంగానే అన్నివర్గాలలోనూ వ్యక్తం అవుతున్నాయి. 

కేంద్రంలో అధికారంలో ఉన్నది మోడీ నాయకత్వంలోని ఇంకా చెప్పాలంటే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్. ఆ సర్కార్ రెండు తెలుగు రాష్ట్రాల విషయంలో రాష్ట్రానికి ఒక్క తీరుగా వ్యవహరించడం వెనుక రహస్యం ఏమిటి అన్న ప్రశ్నకు ఇందులో రహస్యం ఏముంది అంటూ పరిశీలకులు అంటున్నారు. తెలంగాణ సర్కార్ మోడీని చాలెంజ్ చేస్తున్నది. ఆ సర్కార్ విధానాలను తప్పుపడుతున్నది. అదే సమయంలో ఏపీలోని జగన్ సర్కార్ మోడీ అడుగులకు మడుగులొత్తుతోంది. మోడీ సర్కార్ విధానాలను ఎన్డీయే భాగస్వామ్య పక్షాలను మించి మరీ సమర్ధిస్తున్నది. రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తున్నది. ఈ కారణంగానే ఏపీ విషయంలో ఒకలా, తెలంగాణ విషయంలో మరోలా బీజేపీ సర్కార్ వ్యవహరిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

జగన్ సర్కార్ కేంద్రంలోని మోడీ సర్కార్ అండ చూసుకుని ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నది. అడ్డగోలు పన్నులు, ఇష్టారీతిన అప్పులు, పాలన అంటే పంచడం, వెనకేసుకోవడం అన్న చందంగా జగన్ తీరు మారిపోయింది. సర్కార్ తీరును ప్రశ్నించినా, విధానాలను వ్యతిరేకించినా జైళ్లు నోళ్లు తెరిచే సీమలా ఏపీ మారిపోయింది. 

కర్నాటకలో బీజేపీ సర్కార్ పరాజయానికి ఆ సర్కార్  కమిషన్ల సర్కార్ గా మారిపోయిందన్న ఆరోపణలను జనం నమ్మడం ఒక ముఖ్య కారణంగా చెబుతారు. అలాగే జగన్ సర్కార్ కూడా ఏపీ వైపు పారిశ్రామికవేత్తలు చూడాలంటేనే భయపడేలా వ్యవహరిస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తతున్న సంగతి తెలిసిందే.  తాజాగా చంద్రబాబు అరెస్టు కారణంగా ఏపీ సర్కార్ అంటేనే ఇన్వెస్టర్లు, ఇండస్ట్రియలిస్టులు పారిపోయే పరిస్థితి ఏర్పడిదనడంలో సందేహం లేదు. అయితే అంతకంటే ముందు నుంచీ కూడా జగన్ సర్కార్ పారిశ్రామిక విధానం కారణంగా రాష్ట్రంలోకి పెట్టుబడులు, పరిశ్రమల సంగతి అటుంచి.. ఉన్న పరిశ్రమలే తరలిపోతున్న పరిస్థితి. ఇక కొత్తగా వచ్చిన పెట్టుబడులు, పరిశ్రమల గురించి మాట్లాడకుండా ఉండడమే ఉత్తమం. అయినా కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం  2019 నుంచి 2022 వరకు రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు కేవలం రూ. 5751 కోట్లు ..  అంటే, దేశం మొత్తం పెట్టుబడులలో 0.4 శాతం. ఇంత తక్కువగా పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రం దేశంలో మరొకటి లేదని అంటున్నారు. పరిస్థితి ఇంత అధ్వానంగా ఉన్నా.. గత మార్చిలో జగన్ రెడ్డి ప్రభుత్వం ఘనంగా  విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్  నిర్వహించింది. ఆ విషయం జగన్ కు కానీ, జగన్ రెడ్డి ప్రభుత్వంలోని వారికి కానీ గుర్తుందో లేదో కానీ... అదే  గ్లోబల్ ఇన్ వెస్టర్ల సదస్సు వేదికగా  రాష్ట్రానికి పెట్టుబడుల వరద వస్తున్నదని గొప్పగా ప్రకటించారు.

అలాగే ఉద్యోగాలు కూడా కుప్పతెప్పలుగా వస్తాయని సీఎం జగన్ అప్పట్లో సెలవిచ్చారు.  ఇక ఆ గ్లోబల్ సమ్మిట్ లో  20 రంగాలకు సంబంధించి  340 ఎంవోయూ(అవగాహన ఒప్పందాలు)లు  కుదుర్చుకున్నామని, వాటి ద్వారా రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్లు పెట్టుబడులు, ఓ ఆరు లక్షల ఉద్యోగాలు వచ్చేస్తున్నాయని, ముఖ్యమంత్రి  జగన్ రెడ్డి, తమ ట్రేడ్ మార్క్ అయిన షిక్కటి చిరునవ్వుతో సెలవిచ్చారు.  సరే అవి వచ్చాయా? వస్తే వాటి వివరాలేంటి? అన్న ప్రశ్నకు మాత్రం బదులుండదు. పైపెచ్చు ఆ ప్రశ్న అడిగితే అదేదో మహాపాపమన్నట్లు మాట్లాడే పరిస్థితి. ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారంటూ కేసులు, ఆరెస్టులతో చెలరేగుతున్నారు.   అయితే వాస్తవమేమిటంటే..  విశాఖ సమ్మిట్ తర్వత కాదు, జగన్ రెడ్డి నాలుగేళ్ళ పై చిలుకు పాలనలో రాష్టానికి కొత్తగా వచ్చిన పెట్టుబడుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని పరిశీలకులు అంటున్నారు.  జగన్ రెడ్డి పాలనలో పెట్టుబడుల విషయంలో ఆంధ్ర ప్రదేశ్ అధోగతికి చేరింది. అట్టడుగు నుంచి ప్రథమ స్థాయిలో ఉంది.  

అయితే ఈ మాటలు ఎవరో జగన్ రెడ్డి వ్యతిరేకులో, విపక్షాలో చెబుతున్నవి కాదు.. జగన్ రెడ్డి ప్రభుత్వానికి అన్ని విధాలుగా అండదండలు అందిస్తున్న కేంద్రం వెల్లడించిన వివరాలు.  సరే జగన్ రెడ్డి పెట్టుబడులను ఆకర్షించడంలో ఘోరంగా విఫలమయ్యారని సరిపెట్టుకుందాం? కానీ గత ప్రభుత్వ అంటే చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన పారిశ్రామిక వేత్తలు పలువురు జగన్ రెడ్డి అరాచక విధానాల కారణంగా రాష్ట్రం నుంచి తరలి వెళ్లిపోయారు. నిజానికి చంద్రబాబు హయాంలో రాష్ట్రంలోనికి పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు వెల్లువలా తరలి వచ్చారు. విభజిత ఏపీలో చంద్రబాబు హయంలో అంటే 2014 నుంచి 2019 వరకూ ఆరులక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చాయి. జగన్ పాలనలో వచ్చిన ఇన్వెస్ట్ మెంట్లు కేవలం 5751 కోట్ల రూపాయలు మాత్రమే.  

రాష్ట్ర విభజన తరువాత    చంద్రబాబు నాయుడు హయాంలో  ప్రపంచంలోనే గుర్తింపు ఉన్న అనేక కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కట్టాయి.  అందులో భాగంగానే కియా లాంటి అతి పెద్ద కంపెనీ అనంతపురంకు వచ్చింది.  చిత్తూరులో అనేక మొబైల్ తయారీ కంపెనీ వచ్చాయి, విశాఖపట్నంలో ఐటి కంపెనీలు వచ్చాయి, విజయవాడలో హెచ్సీఎల్ లాంటి పెద్ద కంపెనీ వచ్చింది. వీటితో పాటుగా, రిలయన్స్ జియో, ఆదానీ డేటా సెంటర్, ఏపీపీ పేపర్ మిల్, లూలు గ్రూప్ ఇవి కూడా ఒప్పందం కుదుర్చుకున్నాయి.  జగన్ రెడ్డి పాలనలో  సింగపూర్ ప్రభుత్వం అమరావతి స్టార్ట్ అప్ నుంచి వెళ్ళిపోయింది, లూలు గ్రూప్ లాంటి సంస్థకు ఇచ్చిన భూమిని జగన్ ప్రభుత్వం రద్దు చేయడంతో  ఆ గ్రూప్, రూ.2200 కోటల పెట్టుబడులను ఉపసంహరించుకోవడంతో పాటుగా ఇప్పుడున్న పరిస్థితిలో అంటే జగన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఏపీలో ఎలాంటి పెట్టుబడులు పెట్టేది లేదని కుండబద్దలు కొట్టేసింది.  

చిత్తూరు జిల్లాకు చెందిన అమర రాజా కంపెనీ జగన్ రెడ్డి ప్రభుత్వం వేధింపులను తట్టుకోలేక రూ,9500 కోట్ల పెట్టుబడులను తెలంగాణకు తరలించేసింది. ఇలా చెప్పాలంటే చాలా చాలా ఉంది అదే  ఒక్క మాటలో ముగించాలంటే ... జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో కొత్త పెట్టుబడులు రావు  ..ఉన్న పెట్టుబడులు నిలవవు అని చెప్పాలి.  పెట్టుబడులు రానిదే రాష్ట్రం ముందుకు సాగదు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉండవు ... అప్పులు మాత్రమే మిగులుతాయి.. వాటిని అంటే అప్పులను ఎలా పెంచాలో, ఎలా రాబట్టాలో జగన్ రెడ్డికి బాగా తెలుసు. మరి రాష్ట్ర భవిష్యత్ మాటేమిటి అంటారా?  ప్రజలే నిర్ణయించుకోవాలి.  ఓటు ఆయుధం ఉన్నది వారి చేతుల్లోనే మరి.   

By
en-us Political News

  
సోషల్ మీడియాలో జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి. అవన్నీ పక్కన పెడితే తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద వెలసిన ఓ భారీ కటౌట్ ఆసక్తి రేకెత్తిస్తోంది.
ప్రముఖ సినీ నటి ఆమని భారతీయ జనతా పార్టీలో చేరారు.
భారతదేశం మత సామరస్యానికి ప్రతీక అన్న విజయసాయి.. అటువంటి దేశంలో ఉంటూ.. బంగ్లాలో హిందువులు లక్ష్యంగా సాగుతున్న దాడులపై స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ దాడులకు ఖండించని వారు దేశ భక్తులే కాదని విజయసాయి తన ట్వీట్ లో పేర్కొన్నారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ కోర్టుకు వెడదామా? అంటే..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించలేదు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అంటూ జీవోలోనే స్పష్టంగా పేర్కొంది. దీంతో ఆ పాయింట్ మీద కోర్టుకు వెళ్లడం ఎలా అన్నది అర్ధం కాక వైసీపీ మల్లగుల్లాలు పడుతోందని పరిశీలకులు అంటున్నారు.
తాను ప్రత్యక్ష ఎన్నికలో పోటీ చేసిన తొలి సారే పరాజయం పాలైన సంగతిని గుర్తు చేసుకున్న ఆయన, ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని, ఓడిన చోటే గెలవాలన్న పట్లుదలతో పని చేసి ఫలితం సాధించానని లోకేష్ వివరించారు.
ఆ సందర్భంగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు.. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గాన్ని మంగళగిరికి దీటుగా అభివృద్ధి చేస్తానన్నారు.
పార్టీ అధినేత కేసీఆర్ త‌ర్వాత అంత‌టి వాడిగా.. ఆయన పొలిటిక్ వారసుడిగా కేటీఆర్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన ఏ ఎన్నికలోనూ పార్టీ విజయాన్ని నమోదు చేసింది లేదు.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో నంబర్ 1, 2, 3 అంటూ హైరాక్కీని బట్టి చూస్తే లోకేష్ మూడో స్థానంలో ఉన్నారు. జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తరువాత రెండో స్థానంలో ఉన్నారని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ హైరాక్కీని దాటి త్వ‌ర‌లో లోకేష్ కి ముఖ్య‌మంత్రి ప‌ద‌విని అప్ప‌గించేందుకు గ్రౌండ్ వర్క్ జరుగుతోందా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతున్నాయి.
లోక్ సభలో కాంగ్రెస్ సంఖ్యా బలం 400కు మించి ఉన్న సందర్భాలు ఉన్నాయి. కానీ అప్పుడెవ‌రూ కాంగెస్ ని ఓట్ చోరీ అంటూ ఎగ‌తాళి చేయ‌లేదు. ఎవ‌రి క‌ష్టం వారు ప‌డుతూ.. ప్ర‌జ‌ల్ని మెప్పించే ప‌ని మాత్ర‌మే చేస్తూ వ‌చ్చేవార‌మ‌ని తాజాగా మాజీ ప్ర‌ధాని దేవెగౌడ‌ వ్యాఖ్యానించారు.
అసలింతకీ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఒక్క చంద్రబాబు కాదు, కేంద్ర ప్రభుత్వం సహా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ అనుసరిస్తున్నాయి. ఈ పీపీపీ విధానం వల్ల ఎటువంటి నష్టం లేదని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. ఎవరెంతగా చెప్పినా జగన్ మాత్రం తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లు వ్యవహరిస్తున్నారు.
పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించిన అధికారులను అభినందించిన ఆయన ఈ ఎన్నికలలో పార్టీ విజయం కోసం కష్టపడిన కార్యకర్తలకు, అలాగే పార్టీని ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ణతలు తెలిపారు.
ఈ పథకంలో ఉన్న లోపాలన సవరించి రాష్ట్రాల బాధ్యతను మరింత పెంచి పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా చెబుతోంది. అయితే కాంగ్రెస్ మాత్రం మోడీ సర్కార్ ఉద్దేశాలను తప్పుపడుతోంది.
బీజేపీ ఉనికి రాష్ట్రంలో నామమాత్రంగానే మిగిలిందని ఈ ఎన్నికల ఫలితాలు తేల్చాయి. అవన్నీ పక్కన పెడితే ఈ పంచాయతీ ఎన్నికల మూడో విడతలో ఓ ఆసక్తికర విషయంపై తెలుగు రాష్ట్రాలలో చర్చ మొదలైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.