ఏపీలో మినీ ఎమర్జెన్సీ ?

Publish Date:Sep 26, 2023

Advertisement

ఆంధ్ర ప్రదేశ్ లో ఏం జరుగుతోంది ? తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్  వెనక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏమిటి? ఎన్నికలకు ఇక ఏడెనిమిది నెలలు మాత్రమే ఉన్న సమయంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి  ‘నిప్పు’తో చెలగాట మాడే భయంకర నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అందుకు ఆయనలో ప్రవహించే ఫ్యాక్యనిస్ట్  బ్లడ్ మాత్రమే కారణమా? కేవలం కక్ష సాధింపు లక్ష్యంతోనే జగన్ రెడ్డి ఈ వినాశకర నిర్ణయం తీసుకున్నారా? అంటే,  అందులో కొంత నిజం ఉన్నప్పటికీ అదే పూర్తి సత్యం కాదంటున్నారు. 

ఒక్క మాటలో చెప్పాలంటే, 1975 జూన్ 26 ఉదయం సూర్యోదయం వేళ,  తనను అరెస్ట్ చేసేందుకు తలుపు తట్టిన, పోలీసులతో  జేపీ (సర్వోదయ ఉద్యమ నేత) అన్న మూడే మూడు ముక్కల మాట ... గుర్తుకు తెచ్చుకుంటే చంద్రాబాబును జగన్ రెడ్డి ఎందుకు, అరెస్ట్ చేశారు అనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఆరోజు జేపీ... అన్నఆ మూడు ముక్కలూ  ‘వినాశకాలే విపరీత బుద్ధి’ అన్న మాటలు. ఇంచుమించుగా 48 ఏళ్ల  క్రితం.. అలహాబాద్ హై కోర్ట్  తన ఎన్నికల చెల్లదని తీర్పు ఇచ్చిన నేపధ్యంలో  అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ  1977 జూన్  25 అర్థరాత్రి దేశంలో    ఇంటర్నల్ ఎమర్జెన్సీ విధించారు. జూన్ 26 తెల్లవారే సరికి  ఇందిరమ్మ పోలీసులు అప్పటికే ఇందిరా గాంధీ అవినీతి పాలనకు వ్యతిరేకంగా, సంపూర్ణ క్రాంతి ఉద్యమం పేరిట దేశవ్యాప్త ఆందోళనకు  పిలుపు ఇచ్చిన సోషలిస్ట్ నేత  జయప్రకాశ్ నారాయణ సహా వందల సఖ్యలో  ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేశారు. 

అలాగే  ఇప్పడు వైసీపీ అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా  తెలుగు దేశం, జనసేన పార్టీలు సాగిస్తున్న పోరాటం ప్రమాద ఘంటికలు మోగిస్తున్న నేపథ్యంలో జగన్ రెడ్డి  ఓటమి భయంతో, రాష్ట్రంలో అప్రకటిత  మినీ ఎమర్జెన్సీని అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే, జగన్ రెడ్డి పోలీసులు   2023 సెప్టెంబర్ 9వ తేదీ, ఉదయం 6 గంటలకు నద్యాలలో చంద్రబాబునాయుడిని అక్రమంగా అరెస్ట్  చేశారు. ఇందిరమ్మ పోలీసులు చేసిన జేపీ, అరెస్ట్’,జగన్ రెడ్డి పోలీసులు చేసిన చంద్రబాబు అరెస్ట్ కు మధ్య కొన్ని సిమిలారిటీస్  ఉన్నాయి. అప్పుడు ఇందిరమ్మ పోలీసులు తెల్లవారుజామునే వచ్చి తపులులు తట్టారు, ఇప్పడు జగన్ రెడ్డి పోలీసులుఇంచుమించుగా అదే చేశారు. అయితే అర్ధరాత్రి చంద్రబాబు బస చేసిన బస్సు తలుపు తట్టారు.  అప్పుడు ఇందిరమ్మ పోలీసులు జేపీని ఎందుకు,ఏ నేరానికి, ఏ చట్టం, ఏ సెక్షన్  పరిధిలో  అరెస్ట్ చేశారో చెప్పలేదు.

ఇప్పడు జగన్ రెడ్డి పోలీసులూ అంతే  నేరం ఏమిటో, విచారణ ఏమిటో  చెప్పకుండానే చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారు. నంద్యాల పర్యటనలో ఉన్న తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబును, బస్సులోంచి దించి  ఎలాంటి కారణాలు చూపకుండానే అరెస్ట్ చేశారు. అలా అరెస్టు చేసిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో జరిగినట్లు చెపుతున్న అవకతవకలు,అవినీతికి చంద్రబాబుకు సంబంధం ఏమిటో చెప్ప కుండానే, కేవలం సాంకేతిక అంశాల ఆధారంగ , విచారణ పేరుతొ వేధింపులకు గురి చేస్తోంది. అందుకే  చంద్రబాబు అరెస్ట్ విషయంలో  ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు  ఎమర్జెన్సీ రోజులను గుర్తుకు తెస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

నిజానికి అక్రమ అరెస్ట్ విషయంలోనే కాదు, అరెస్ట్ తరువాత తెలుగు దేశం నేతలు, కార్యకర్తలను ఎక్కడి కక్కడ అరెస్టులు చేయడం, నిరసన తెలిపేందుకు లేకుండా ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు చేయడం.  అదే విధంగా  చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేకంగా వెల్లువెత్తుతున నిరసనలను ఉక్కుపాదంతో అణచివేయడం,  దీక్షలను భగ్నం చేయడం చూస్తుంటే, ఏపీలో మినీ ఎమర్జెన్సీ అమలులో వుందా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

By
en-us Political News

  
తెలంగాణలో గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
సోషల్ మీడియాలో జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి. అవన్నీ పక్కన పెడితే తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద వెలసిన ఓ భారీ కటౌట్ ఆసక్తి రేకెత్తిస్తోంది.
ప్రముఖ సినీ నటి ఆమని భారతీయ జనతా పార్టీలో చేరారు.
భారతదేశం మత సామరస్యానికి ప్రతీక అన్న విజయసాయి.. అటువంటి దేశంలో ఉంటూ.. బంగ్లాలో హిందువులు లక్ష్యంగా సాగుతున్న దాడులపై స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ దాడులకు ఖండించని వారు దేశ భక్తులే కాదని విజయసాయి తన ట్వీట్ లో పేర్కొన్నారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ కోర్టుకు వెడదామా? అంటే..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించలేదు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అంటూ జీవోలోనే స్పష్టంగా పేర్కొంది. దీంతో ఆ పాయింట్ మీద కోర్టుకు వెళ్లడం ఎలా అన్నది అర్ధం కాక వైసీపీ మల్లగుల్లాలు పడుతోందని పరిశీలకులు అంటున్నారు.
తాను ప్రత్యక్ష ఎన్నికలో పోటీ చేసిన తొలి సారే పరాజయం పాలైన సంగతిని గుర్తు చేసుకున్న ఆయన, ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని, ఓడిన చోటే గెలవాలన్న పట్లుదలతో పని చేసి ఫలితం సాధించానని లోకేష్ వివరించారు.
ఆ సందర్భంగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు.. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గాన్ని మంగళగిరికి దీటుగా అభివృద్ధి చేస్తానన్నారు.
పార్టీ అధినేత కేసీఆర్ త‌ర్వాత అంత‌టి వాడిగా.. ఆయన పొలిటిక్ వారసుడిగా కేటీఆర్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన ఏ ఎన్నికలోనూ పార్టీ విజయాన్ని నమోదు చేసింది లేదు.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో నంబర్ 1, 2, 3 అంటూ హైరాక్కీని బట్టి చూస్తే లోకేష్ మూడో స్థానంలో ఉన్నారు. జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తరువాత రెండో స్థానంలో ఉన్నారని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ హైరాక్కీని దాటి త్వ‌ర‌లో లోకేష్ కి ముఖ్య‌మంత్రి ప‌ద‌విని అప్ప‌గించేందుకు గ్రౌండ్ వర్క్ జరుగుతోందా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతున్నాయి.
లోక్ సభలో కాంగ్రెస్ సంఖ్యా బలం 400కు మించి ఉన్న సందర్భాలు ఉన్నాయి. కానీ అప్పుడెవ‌రూ కాంగెస్ ని ఓట్ చోరీ అంటూ ఎగ‌తాళి చేయ‌లేదు. ఎవ‌రి క‌ష్టం వారు ప‌డుతూ.. ప్ర‌జ‌ల్ని మెప్పించే ప‌ని మాత్ర‌మే చేస్తూ వ‌చ్చేవార‌మ‌ని తాజాగా మాజీ ప్ర‌ధాని దేవెగౌడ‌ వ్యాఖ్యానించారు.
అసలింతకీ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఒక్క చంద్రబాబు కాదు, కేంద్ర ప్రభుత్వం సహా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ అనుసరిస్తున్నాయి. ఈ పీపీపీ విధానం వల్ల ఎటువంటి నష్టం లేదని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. ఎవరెంతగా చెప్పినా జగన్ మాత్రం తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లు వ్యవహరిస్తున్నారు.
పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించిన అధికారులను అభినందించిన ఆయన ఈ ఎన్నికలలో పార్టీ విజయం కోసం కష్టపడిన కార్యకర్తలకు, అలాగే పార్టీని ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ణతలు తెలిపారు.
ఈ పథకంలో ఉన్న లోపాలన సవరించి రాష్ట్రాల బాధ్యతను మరింత పెంచి పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా చెబుతోంది. అయితే కాంగ్రెస్ మాత్రం మోడీ సర్కార్ ఉద్దేశాలను తప్పుపడుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.