Publish Date:Jun 25, 2021
మన టైం బాగాలేకుంటే వాసుదేవుడు గాడిగా కాళ్ళు పట్టుకున్నట్లు ఉంటుంది మన పరిస్టితి. అలాగే జొన్న గింజతో కొడితే ప్రాణం పోయినంత సిల్లీగా గా ఉంటుంది. కొన్ని సార్లు చేసింది చిన్న తప్పే అయినా పెద్ద శిక్షలు పడుతుంటాయి. తప్పు చెయ్యడం శిక్షలు పాడడం ఒక ఎట్టు అయితే. కోడి కత్తికి మనిషి మృతి, కోడిని అరెస్ట్ చేసిన సిల్లీ కేసులు కూడా విన్నాం. కోడిని చంపినా వ్యక్తి అరెస్ట్ అనే సంఘటనలు కూడా విన్న చూశాం.. బట్ కోడి గుడ్డు ఒక వ్యక్తిని గాయాల పాలు చేసింది.. మరో వ్యక్తిని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పింది. భలే ఉంది కదా అయితే మొత్తం వార్త చదవండి ఇంకా కిక్కు ఉంటుంది.
టైం ఎంత చెత్తగా ఉంటుందంటే చెప్పలేం. చిన్న కారణం.. తెచ్చే చిక్కులు తరువాత తీరుబడిగా ఆలోచిస్తే తేలుతాయి తప్పులు. కొంతమంది వ్యక్తులు ఎలా ఉంటారంటే.. చిన్న విషయాన్ని ఒక్కోసారి చాలా ప్రేస్టేజియస్ గా తీసుకుంటారు. కోటి రూపాయలు పోయిన అంత పట్టించుకోరుగాని వారి అహం దెబ్బ తింటే తట్టుకోలేరు. విపరీతమైన ఫీల్ అవుతారు నానా హంగామా చేసేస్తారు. దీంతో వారు ఎదుటివారితో చాలా చికాకుగా ప్రవర్తించడమే కాకుండా వారిని ఇబ్బందుల్లోకి నెట్టేసి.. తామూ చిక్కుల్లో పడతారు. అటువంటిదే ఈ సంఘటన కూడా. ఒక్క కోడిగుడ్డు ఒక వ్యక్తిని గాయాల పాలు చేసింది. మరోవ్యక్తిని పోలీసు స్టేషన్ చుట్టూ తిప్పింది. బెంగళూరు లో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
ఒక యువకుడు చికెన్ కొనడానికి షాప్ కి వెళ్ళాడు. పాపం చికెన్ కొనడానికి వెళ్లిన వాడు ఈ మధ్య సోషల్ మీడియాలో వీడియోలు ఎక్కువగా చూసినట్లున్నాడు. అయితే చికెన్ అమ్మే వాడు చికెన్ కొడుతున్న సమయంలో అక్కడ ఒక గుడ్డు తీసుకుని సంచిలో వేశాడు. అది చూసిన దుకాణం యజమాని ఆ యువకుడిని కోపంతో దానా ధన్ లాగి కొట్టాడు. దీంతో ఆ యువకుడు గాయపడ్డాడు. అక్కడితో ఆగక ఈ విషయం పోలీసుల వద్దకు చేరింది. బెంగళూరు బేగూర్ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. 28 ఏళ్ల గోపి ఆర్ ఓ ప్రైవేట్ సంస్థ ఉద్యోగి. ఇతను వైట్ఫీల్డ్ సమీపంలోని చిక్కా బేగూర్ నివాసి. ఆదివారం మధ్యాహ్నం అక్కడికి దగ్గరలోని శాంత కుమార్ అనే వ్యక్తి నడుపుతున్న చికెన్ సెంటర్ కు చికెన్ కోసం వెళ్ళాడు. రెండు కేజీల చికెన్ ఆర్డర్ చేశాడు. చికెన్ సిద్ధం అవుతున్న సమయంలో గోపీ అక్కడ ఉన్న ఒక క్రేట్ నుంచి ఒక గుడ్డును తీసుకున్నాడు. అయితే, ఇది శాంతకుమార్ కు చెప్పకుండా చేశాడు. దీంతో శాంతకుమార్ గుడ్డు ఎందుకు తీశావంటూ గోపీ తో వాగ్వాదం పెట్టుకున్నాడు. నేను చికెన్ డబ్బులు ఇచ్చేటప్పుడు గుడ్డు డబ్బులు కూడా ఇస్తాను అని గోపీ చెప్పాడు. అయితే, శాంత కుమార్ వినిపించుకోకుండా గోపీని దొంగ అంటూ మాట్లాడాడు. దాంతో ఇద్దరి మధ్యా వాదోపవాదనలు గట్టిగా జరిగాయి. ఈ క్రమంలో శాంతకుమార్ కోపం పట్టలేక.. ఇనుప కడ్డీతో గోపీ పై దాడి చేశాడు. దీంతో గోపీ గాయాల పాలయ్యాడు. విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బెగూర్ పోలీసులు దుకాణ యజమాని శాంత కుమార్ పై క్రిమినల్, బెదిరింపు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/one-egg-big-problem-25-118321.html
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు.
ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్స్టార్ రజనీకాంత్తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.