క్రికెట్లో రికార్డుల కింగ్ విరాట్ కోహ్లీకి నెంబర్ 18 చాలా.. చాలా స్పెషల్. 18వ నెంబరుతో విరాట్కి ఉన్న అనుబంధం అపురూపమైంది. తాజాగా 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ 18వ సీజన్లో ఆర్సీబీ ఐపీఎల్ కప్ను ముద్దాడింది. కోహ్లీ పేరు చెప్పగానే క్రికెట్ అభిమానులకు జెర్సీ నెంబరు 18 కళ్ల ముందు కదలాడుతుంది. అది ఐపీఎల్ అయినా ఇంటర్నేషనల్ క్రికెట్ అయినా కోహ్లీ ఆ జెర్సీ నెంబరుతోనే కనిపిస్తాడు. వాస్తవానికి అండర్ 19 క్రికెట్ ఆడేటప్పుడే కోహ్లీకి ఆ నెంబరుతో జెర్సీ ఇచ్చారు. ఆ తర్వత అది తన జీవితంతో ప్రత్యేకంగా మారిందని, రెండు ముఖ్యమైన క్షణాలు ఆ రోజునే జరిగాయని గతంలో కోహ్లీ భావోద్వేగానికి గురయ్యారు.
కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో అరంగ్రేటం చేసింది 18వ తేదీనే. 18 ఆగస్టు 2008లో తొలి వన్డే ఆడాడు. అతడి తండ్రి ప్రేమ్ కోహ్లీ 2006 డిసెంబరు 18న గుండెపోటుతో మరణించారు. కోహ్లీ తండ్రి కూడా క్రికెట్ ఆడే రోజుల్లో జెర్సీ నెంబరు 18నే వేసుకున్నారంట. ఆయన గుర్తుగా కింగ్ కూడా అదే నెంబరుతో కనిపిస్తున్నారు. ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై కోహ్లీ సెంచరీ నమోదు చేసింది 18వ తేదీనే. 2012 మార్చి 18న ఢాకాలో పాకిస్థాన్ పై జరిగిన వన్డేలో కోహ్లీ 183 పరుగులు చేశాడు. ఇప్పుడు 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ కప్పు కల నెరవేరింది. 18వ సీజన్లో కప్పు దక్కించుకోవడంతో ఆ నెంబరు కోహ్లీకి మరింత ప్రత్యేకంగా మారింది. ఐపీఎల్లో ఆర్సీబీ చాంపియన్గా నిలిచిన రోజు కూడా ఆ నెంబర్ మ్యాజిక్ కొనసాగడం విశేషం. 3-6-2025 కప్ గెలిచిన రోజు. అది టోటల్ చేస్తే వచ్చేది కూడా 18 కావడం మరింత ప్రత్యేకంగా నిలిచింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/number-18-very-special-to-kohli-39-199288.html
శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం మండలం, టి.బరంపురం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి తిప్పన. పురుషోత్తం రెడ్డి గ్రామానికి విచ్చేసిన సందర్బంగా గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.
టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ పేరును దుర్వినియోగం చేస్తూ, కళాకారుల నుంచి లక్షల రూపాయలు తీసుకొని మోసగించిన కేసులో కేటుగాడిని తిరుమల వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు.
రంగారెడ్డి జిల్లా నార్సింగిలో రూ.1.5 కోట్ల విలువైన 650 గ్రాముల హెరాయిన్ను శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ టీడీపీ రంగంలోకి దిగనుందని సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో నందమూరి సుహాసినిని అభ్యర్థిగా బరిలోకి దించాలని పార్టీ ఆలోచిస్తున్నట్టు సమాచారం.
ఏపీ మద్యం కేసులో కీలక పరిమాణామం చోటుచేసుకుంది.నిందితుల బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. సీఎంవో మాజీ కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి చుక్కెదురైంది.
చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్ అజ్ఞాతంలోకి వెళ్ళారా? లేక అనారోగ్యంతో విధులకి దూరంగా ఉంటున్నారా? తెలియరావడం లేదు. మే 21 నుంచి జూన్ 5 వరకూ జింగ్ పింగ్ కనపడలేదు.
ఎట్టకేలకు వల్లభనేని వంశీకి బెయిల్ దొరికింది ...140 రోజుల జైలు జీవితానికి మోక్షం లభించింది ...అయితే ఇప్పుడే వంశీని జైలు జీవితం విడిపోతుందా! లేక ఇంకేమైనా ఈ కథలో టెస్టులు ఉంటాయా? అన్న ప్రశ్నలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి
శాంతిభద్రతల సమస్య సృష్టించడానికే వైసీపీ అధినేత జగన్ రెడ్డి జైలు యాత్ర చేపట్టనున్నారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాక్షన్ పాలిటిక్స్ చేస్తామంటే కుదరదని ఆయన అన్నారు.
కర్నూల్ -విజయవాడ మధ్య ఇండిగో విమాన సర్వీసులను కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు ఢిల్లీ నుంచి వర్చువల్గా దీన్ని ప్రారంభించారు
పేరుకే పరామర్శ యాత్ర.. కానీ వాస్తవంగా ఆ పేరుమీద మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ చేసేది బలప్రదర్శన. ఇప్పటి వరకూ జగన్ చేసిన పరామర్శ యాత్రలన్నీ ఈ విషయాన్ని నిర్ద్వంద్వంగా రుజువు చేశాయి.
CM Chandrababu, Kuppam, Handreeniva, Srisailam, Kuppam Airport, YCP, CM Chandrababu, Naralokesh, TDP, Srisailam,
ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ స్వచ్ఛందంగా తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో, కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని, దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఆదేశించింది. అరవింద్కు నోటీసులివ్వడం ఇది నాలుగోసారి.