ఇప్పుడిక వైసీపీలో కొత్త రచ్చ? జగన్ కు చుక్కలు కనిపించడం ఖాయం!

Publish Date:Feb 8, 2025

Advertisement

విజయసాయి రాజకీయ సన్యాసం ప్రకటించి రెండు వారాలు గడిచిపోయింది. విజయసాయి నిష్క్రమణపై వైసీపీ మౌనం వహించింది. ఆ మౌనంలో భయమే ఎక్కువ కనిపించింది. విజయసాయి రాజీనామాపై వైసీపీకి మాత్రమే చేతనైన తీరులో విమర్శలు రాకపోవడానికి కారణం కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందన్న భయమేనని పరిశీలకులు సైతం విశ్లేషించారు. అయితే విజయసాయి రాజకీయ సన్యాసం, వైసీపీకి రాజీనామాపై ఆ పార్టీ నేతల మౌనం.. రెండు రోజుల కిందట బద్దలైంది. విజయసాయి వ్యక్తత్వం, విశ్వసనీయత లేని వ్యక్తి అంటూ జగన్ మీడియా సమావేశంలో చెప్పిన తరువాత ఇక వైసీపీ నేతలు ఒక్కరొక్కరుగా విజయసాయిపై విమర్శలతో ముందుకు వస్తున్నారు. అంత కంటే ముందు షర్మిల విజయసాయికి మద్దతుగా జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారనుకోండి అది వేరే సంగతి. ప్రస్తుతానికి వస్తే షర్మిల విమర్శలపై నోరు విప్పే ధైర్యం వైసీపీలో జగన్ సహా ఎవరికీ లేదన్నది తెలిసిందే. 

ఇక మిగిలింది విజయసాయి. విజయసాయి జగన్ క్యారెక్టర్ కామెంట్స్ కు ఘాటుగా రిప్లై ఇచ్చిన తరువాత వైసీపీ నుంచి తొలి సారిగా కేతిరెడ్డి  వెంకటరామిరెడ్డి నోరు విప్పారు. ఒక సామాన్య ఆడిటర్.. ప్రముఖ రాజకీయ నాయకుడిగా ఎదగడానికి, పార్టీలో ఉన్నత పదవులు పొందడానికి అవకాశం ఇచ్చిన వ్యక్తికి క్యారెక్టర్ ఉన్నట్లా, లేక ఆ పదవులన్నీ అనుభవించి, పార్టీ కష్టంలో ఉన్నప్పుడు వదిలేసి తన దారి తాను చూసుకున్న వ్యక్తికి క్యారెక్టర్, విశ్వసనీయతా ఉన్నట్లా అని ప్రశ్నించారు. పార్టీ వీడిన తరువాత పార్టీ అధినేతపైనా, పార్టీపైనా చెడుగా మాట్లాడటమే అతని స్వభావాన్ని తెలియజేస్తున్నదని నేరుగా పేరు ప్రస్తావించకుండానే విజయసాయిరెడ్డిపై విమర్శలు గుప్పించారు కేతిరెడ్డి. వైఎస్ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేయాలన్న మీ ప్రయత్నం వెనుక ఎవరున్నారో తెలుసు అంటూ ఆయన చేసిన ట్వీట్ రానున్న రోజులలో మరింత మంది వైసీపీయులు విజయసాయిపై నోరు పారేసుకునేందుకు రూట్ క్లియర్ చేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

 అదే జరిగి వైసీపీ వర్సెస్ విజయసాయిరెడ్డిగా విమర్శల పర్వం కొనసాగితే.. జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2 అయిన విజయసాయిరెడ్డి వెల్లడించే విషయాలు వైసీపీ కొంప ముంచడమే కాకుండా, జగన్ కు కూడా కంటిమీద కునుకులేకుండా చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. వైసీపీలో ఈ కొత్త రచ్చ ఎంత తొందరగా మొదలైతే అంత తొందరగా జగన్ ఆస్తుల కేసు విచారణ జోరందుకుంటుందని పరిశీలకులు అంటున్నారు.   విజయసాయిరెడ్డిపై వైసీపీ నుంచి ఎంత తీవ్రంగా విమర్శలు వస్తే జగన్ రాజకీయ, న్యాయ వ్యవహారాలపై అంత తీవ్రంగా ప్రతికూల ప్రభావం ఉండటం ఖాయమంటున్నారు. ఈ పరిస్థితిని జగన్ ఎలా ఎదుర్కొంటారో చూడాల్సిందే.  

By
en-us Political News

  
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేయెన్నం శ్రీనివాస్ రెడ్డి శాసనసభ విప్‌లుగా నియమితులయ్యారు. అలాగే శాసనమండలిలో అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌లను విప్‌లుగా నియమించింది.
మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరును ఖరారు చేశారు.
ప్రముఖ హీరోయిన్లను వివాదాల్లోకి లాగుతూ, వివాదాల్లోకి లాగుతూ వ్యక్తిగత విమర్శల దిగజారుతున్న తీరు తమిళనాట రాజకీయ ప్రతిష్ఠను దిగజారుస్తున్నది. సీనియర్ హీరోయిన్లు త్రిష, నయనతార లను ఉద్దేశించి తమిళ రాజకీయ నాయకులు కొందరు చేసిన వ్యాఖ్యల పట్ల తమిళనాటే కాకుండా దేశ వ్యప్తంగా నిరసన వ్యక్తం అవుతున్నది.
రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతిని నిర్మూలిస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని, అలాంటిది పార్టీకి చెందిన ప్రజాప్రతినిధే ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం క్షమించరాని నేరమన్నారు. యువ నాయకుడు, మంచి నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాడన్న ఉద్దేశంతో అవకాశం ఇస్తే, పార్టీకి చెడ్డపేరు తీసుకువచ్చారంటూ పుట్టా మహేష్ యాదవ్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఓ వైపు డీఎంకే కాంగ్రెస్ కూటమి, మరో వైపు అన్నాడీఎంకే, బీజేపీ కూటములు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తమదంటే తమదని ఉధృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఇప్పుడు ఆ రెండు కూటములతో పాటు టీవీకే అధినేత విజయ్ సీఎం సీటుపై కన్నేశారు.ఇప్పటికే విజయ్ తమిళనాడు వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలతో ఎలక్షన్ క్యాంపెయిన్ హోరెత్తిస్తున్నారు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో విజయ్‌ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య కోర్టు గడపతొక్కడంతో ఈ విషయం ఇటు తమిళనాడులోనే కాకుండా దక్షిణాది రాజకీయాల్లో సైతతం హాట్ టాపిక్‌గా నిలిచింది.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం మొయినాబాద్ లోని పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో ఆయన సమక్షంలో జరిగిన డగ్ర్స్ పార్టీ వ్యవహారంలో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈ ఘటనపై స్పష్టత కోరుతూ వారం రోజులలో వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు జారీ అయ్యింది.
ముఖ్యంగా ఢిల్లీ హైకోర్టులో ప్రస్తుతం తన కేసును విచారిస్తున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ నుండి విచారణను వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రస్తుత ధర్మాసనం వద్ద విచారణ జరుగుతుందన్న నమ్మకం లేదని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ రాజాసింగ్ పై సెటైర్లు వేశారు. రాజాసింగ్, కేటీఆర్ మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత స్థాయిలో ఇలాంటి స్నేహపూర్వక సంభాషణలు సాగడం మంచి వాతావరణానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తాజా ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వానికి, పార్టీ ఇమేజ్‌కు నష్టం కలిగించేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వందేమాతరం అంశం చర్చనీయాంశంగా మారింది.
2024 ఎన్నికల సమయానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న జనసేన పార్టీ తెలుగుదేశం, బీజేపీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల రంగంలోకి దిగింది. ఆ ఎన్నికలలో నాగబాబు అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి రంగంలోకి దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది. అయితే పొత్తు ధర్మంలో భాగంగా నాగబాబుకు ఆ ఎన్నికలలో పోటీ చేసే అవకాశమే దక్కలేదు.
తమిళనాడులో బీజేపీ, హీరో విజయ్ సారథ్యంలోని టీవీకేల పొత్తు విషయంలో మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
దేశంలోని నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.