Publish Date:Feb 19, 2025
కొడాలి నాని పరిస్థితి చూస్తుంటే ఆయనపై పగవారికి కూడా జాలి వేసేలా ఉంది. లోపల అరెస్టు భయంతో వణికిపోతూ కూడా పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. రెడ్ బుక్ భయం లోపలలోపల తొలిచేస్తుంటే.. పైకి మాత్రం తాను రెడ్డ బుక్ ను చూడలేదనీ, అసలెవరైనా చూశారా అని ప్రశ్నలు వేస్తున్నారు. అసలు గత ఏడాది జరిగిన ఎన్నికలలో వైసీపీ పరాజయం పాలైన తరువాత నుంచీ కొడాలి నాని పెద్దగా బయట కనిపించింది లేదు. వినిపించింది లేదు.
వైసీపీ అధికారంలో ఉండగా నోటికి హద్దూ పద్దూ లేదన్నట్లుగా బూతులతో చెలరేగిపోయిన కొడాలి నాని.. వైసీపీ ఓటమి తరువాత బయట కనబడటం తగ్గింది. అంతే కాదు, భాష మారింది. పొల్లు మాట మాట్లాడడానికే జంకుతున్నారు. ఇక వల్లభనేని వంశీ అరెస్టు తరువాత కొడాలి నాని పూర్తిగా అజ్ణాతంలోకి వెళ్లిపోయారన్న ప్రచారం జరిగింది. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసి మరీ ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. అయితే జగన్ విజయవాడ సబ్ జైలులో వల్లభనేని వంశీ తో ములాఖత్ సందర్భంగా అనివార్యంగా బయటకు వచ్చారు. జగన్ తో పాటు జైలు వద్ద మీడియాకు కనిపించారు. గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉండగా మీడియా ముందుకు వచ్చిన ప్రతి సారీ చంద్రబాబుపైనా, నారా లోకేష్పైనా అనుచిత భాషాప్రయోగంతో ఇష్టారీతిగా మాట్లాడే వంశీ ఇప్పుడు మాత్రం అచితీచి మాట్లాడుతున్నారు.
వంశీ అరెస్టును అరెస్టుగానే చూస్తున్నాన్నారు. తాన మౌనానికి కారణం జనం తన ఉద్యోగం ఊడగొట్టడమే అని చెప్పుకున్నారు. అరెస్టులకు భయపడేది లేదు, రెడ్ బుక్ చూడలేదు అంటూ ఒకింత గంభీరంగా మాట్లాడినా, ఆయన భాష, బాడీ లాంగ్వేజ్ మాత్రం కొడాలి నాని అరెస్టు భయంతో వణికిపోతున్నారన్న సంగతిని తేటతెల్లం చేసింది. మూడు కాదు ముఫ్పై కేసులు పెట్టుకున్న పట్టించుకోనంటూ చేసిన వ్యాఖ్యల్లో కనిపిస్తున్నది తెచ్చిపెట్టుకున్న ధైర్యం మాత్రమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nodalinanishiwer-with-fear-39-193092.html
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.