వ్యాక్సిన్పై ఇప్పటికీ అనేక మందిలో అపోహలు ఉన్నాయి. అందుకే, చాలామంది టీకా తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు. అధికారులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా.. కొందరు వ్యాక్సిన్ వేసుకోడానికి ముందుకు రావడం లేదు. సెకండ్ వేవ్లో భారీగా కేసులు వస్తుండటం.. త్వరలో మూడో ముప్పు పొంచి ఉందనే వార్తలతో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. త్వరగా దేశ ప్రజలందరికీ వ్యాక్సినేషన్ కార్యక్రమం కంప్లీట్ చేసేందుకు సన్నాహాలు ముమ్మరం చేసింది. టీకా కొరతను తీర్చడానికి ఇప్పటికే విదేశీ వ్యాక్సిన్లకు అనుమతులు సరళం చేశారు. ఈ ఏడాది చివరికల్లా అందరికీ టీకా లక్ష్యం నెరవేరేలా కార్యచరణ రూపొందిస్తున్నారు. కరోనాపై పోరాటానికి టీకానే ప్రధాన ఆయుధం.
ప్రముఖులు వేసుకుంటేనే ప్రజలకు స్పూర్తి. అధికారులు ముందుగా టీకా తీసుకుంటేనే సామాన్యులకు ధైర్యం. అందుకే, టీకా కార్యక్రమాన్ని ప్రోత్సహించేందుకు ఉత్తర్ ప్రదేశ్లోని ఫిరోజాబాద్ జిల్లా యంత్రాంగం వినూత్న నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. టీకాలు తీసుకోకపోతే జీతాలు పొందలేరని జిల్లా ఉన్నతాధికారి హెచ్చరించారు. ‘నో వ్యాక్సినేషన్.. నో సాలరీ’ అంటూ ఫిరోజాబాద్ జిల్లా కలెక్టర్ చంద్ర విజయ్ సింగ్ మౌఖిక ఆదేశాలు జారీ చేశారని జిల్లా చీఫ్ డెవలప్మెంట్ అధికారి చర్చిత్ గౌర్ చెప్పారు.
‘ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా కొవిడ్ టీకా తీసుకోకపోతే.. సదరు ఉద్యోగిపై సంబంధిత శాఖ చర్యలు తీసుకుంటుంది. మే నెల జీతాన్ని నిలిపివేస్తుంది’ అని వెల్లడించారు. జిల్లా ట్రెజరీ అధికారులకు, ఆయా విభాగాధిపతులకు దీనికి సంబంధించి మార్గదర్శకాలు పంపినట్లు ఆయన తెలిపారు. టీకాలు తీసుకున్న ఉద్యోగుల జాబితా సిద్ధం చేయాలని.. అందరూ వ్యాక్సిన్ వేయించుకునేలా చూడాలని ఆదేశించారు.
నిబంధన కాస్త కఠినంగా అనిపించినా.. టీకాలు తీసుకుంటేనే జీతాలు.. అనే కాన్సెప్ట్ బాగుందంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులే వ్యాక్సిన్ నుంచి తప్పించుకోవాలని చూస్తే ఎలా అని.. అందుకే కలెక్టర్ పెట్టిన అనధికార రూల్ అదిరిపోయిందంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/no-vaccination-no-salary-rule-by-collector-25-116787.html
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.