పెళ్లి ఒక పవిత్రమైన బంధం, అమ్మాయికి ఎన్ని ఆశలు ఉంటాయి, మానెన్నో కోరికలు ఉంటాయి. ఎన్నో ఊహలతో అత్తవారింటికి అడుగుపెడతారు అమ్మాయిలు. అలాంటి అమ్మాయిలను ఎలా చూసుకోవాలి దిగులుగా ఉన్నపుడు చెల్లిలా, కష్టాల్లో స్నేహితురాలిలా, ఆప్యాయతతో అమ్మగా, దైర్యంలో నాన్న తోడు ఉండాలి ప్రతి భర్త. ఎందుకంటే.. పెళ్లి అంటే ఇంటి పేరుతో మార్చుకోవడం తో పాటు అమ్మానాన్నలకు దూరంగా ఉండాలి. అలవాట్లు మార్చుకోవాలి. ఎన్నో ఆశలతో అత్తవారింట్లో అడుగుపెడుతుంది. సర్వస్వం భర్త అని అనుకుంటుంది. తాజాగా ప్రతి అమ్మాయిలాగే కలలు కన్నది సారిక .. భర్త ప్రేమ, అత్తమామల ఆదరణ తో జీవితాంతం సంతోషంగా ఉండాలని కలలు కన్నది. కానీ ఆ కలలు కల్లలు గానే మిగిలిపోయాయి. పెళ్లై ముచ్చటగా మూడు నెలలు తిరగకముందే భర్త చేతిలో హతమైంది. వరకట్నం కోసం కట్టుకున్న భార్యను కాల్చి చంపాడో కసాయి భర్త.వివరాలలోకి వెళితే..
అది ముజఫర్ నగర్ జిల్లాలోని బుధానా తహసీల్ ఉపవాలి గ్రామానికి చెందిన సారికా (24)కు కుల్దీప్ తో గతేడాది ఫిబ్రవరిలో వివాహం జరిగింది. పెళ్లికి ముందే సారిక తల్లిదండ్రులు అనుకున్న కట్నం ముట్టచెప్పారు. అయితే వారిచ్చిన కట్నం కుల్దీప్ కి నచ్చలేదు. కుల్దీప్ పెళ్లి వద్దంటూ అయిష్టంగానే ఉన్నాడు. అయినా సరే తల్లిదండ్రుల బలవంతంపై సారిక మెడలో తాళికట్టాడు. వివాహం జరిగిన తర్వాత మూడు నెలల వరకు భార్యతో సక్యతగానే ఉన్నాడు కుల్దీప్. ఆ తర్వాత అతనిలో ఒక రాక్షసుడు నిద్రలేచాడు. ఆ తదుపరి సారికాను వరకట్నం కోసం వేధించడం మొదలు పెట్టాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకాంగాక పుట్టింటికి వెళ్లి రూ. 50 లక్షలు తీసుకురావాలని సారికను వేధిస్తుండేవాడు. ఈ విషయమై పలుమార్లు భార్యపై దాడి చేసేవాడు, విపరీతంగా కొట్టేవాడు, నిత్యం వేధించే వాడు. నిత్యం భార్య భర్తల మధ్య పొయ్యిలో మంట మండినట్లు ఎప్పుడు గొడవ జరిగేది.
ఇక ఈ నేపథ్యంలోనే మంగళవారం భార్యతో గొడవపడి తన లాకర్ లో ఉన్న తుపాకిని తీసుకొని భార్యపై కాల్పులు జరిపాడు. వరుసగా మూడు రౌండ్లు కాల్చడంతో ఆమె అక్కడిక్కడే మృతిచెందింది. అనంతరం కుల్దీప్, అతని తండ్రి అక్కడినుండి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగుచూసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/husband-killed-his-wife-shot-with-gun-25-116790.html
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్మెన్లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.