సొంత ఓటు ఒక్కటీ లేదు.. ఆయినా ఓట్లన్నీ ఆమెకే!

Publish Date:Jul 12, 2022

Advertisement

చిత్రం. నిజంగా ఇదొక విచిత్రం. ఆంధ్ర ప్రదేశ్’ అసెంబ్లీలో బీజేపీకి చోటు లేదు. ఒక్క ఎమ్మెల్యే అయినా లేరు, అసెంబ్లీలో ఆ పార్టీ  బలం సున్నా. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ, ఏపీ నుంచి బీజేపీకి ప్రాతినిధ్యం లేదు, నిన్నమొన్నటి వరకు ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన రాజ్యసభ సభ్యులు ఇద్దరు ముగ్గురున్నా, ఇప్పడు వారి పదవీ కాలం ముగిసిపోవడంతో, పార్లమెంట్ ఎగువ దిగువ సభల్లో, ఏ సభలోనూ  ఏపీ బీజేపీకి ఎంట్రీ లేదు. 
రాష్ట్రంలో ఎన్డీఎ భాగస్వామ్య పార్టీ ఏదీ లేదు. అధికార, ప్రతిపక్షాలలో  (వైసీపీ, టీడీపీ)ఏదీ బీజేపీ మిత్ర పక్షం కాదు, మిత్ర పక్షం జనసేన పార్టీది   కూడా బీజేపీ పరిస్థితే .. ఒక్క ఎంపీ లేరు. ఒక్క ఎమ్మెల్యే లేరు. రాష్ట్రపతి ఎన్నికల ఎలెక్టోరల్ కాలేజిలో బీజేపీ, జనసేన పార్టీలలో దేనికీ ఓటు లేదు.  
అయినా, రాష్ట్రపతి ఎన్నికల ఎలెక్టోరల్ కాలేజిలోని ఓట్లలో ఒక్క ఓటు బీరు పోకుండా, బీజేపీ సారధ్యంలోని ఎన్డీఎ కూటమి ఖాతాలో చేరుతున్నాయి. అధికారికంగానా, అనదికారకంగానా అనేది పక్కన పెడితే అధికార వైసీపీ, ఎన్డీఎ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపతి ముర్మకు అడగక ముందే మద్దతు తెలిపింది. ఇప్పుడు తాజాగా, ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ కూడా ఎన్డీఎ అభ్యర్ధికి మద్దతు ప్రకటించింది. సో ... రాష్ట్రం నుంచి పోలయ్యే ప్రతి ఓటు ముర్ము ఖాతాలో చేరుతుంది. భారత రాజకీయాల్లో ఇదొక విధంగా విచిత్ర పరిస్థితి.

గతంలోనూ, ఒక రాష్ట్రంలో ఉన్నమొత్తం ఓట్లు ఒకే అభ్యర్ధికి పోలైన సందర్భాలు ఉంటే ఉండవచ్చును, కానీ, రాష్ట్రంలో ఓటే లేని పార్టీ / కూటమి అభ్యర్ధికి గంప గుత్తగా ఓట్లన్నీ పోలుకావడం, బహుశా రాష్ట్రపతి ఎన్నికల చరిత్రలో ఇదే మొదటి సారి కావచ్చును.  అదొకటి అలాఉంటే, జూలై 18 జరిగే ప్రస్తుత రాష్ట్రపతి ఎన్నికలకు సమబందించి కొన్ని ఆసక్తి కర పరిణామాలు అయితే, చోటు చేస్కున్నాయి, రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి జూన్ 14 న, కేంద్ర ఎన్నికల సంఘం  షెడ్యూలు ప్రకటించింది. అయినా, ఎన్డీఅభ్యర్ధి ఎవరైనా గెలుపు ముందుగానే ఖరారై పోవడం వలన, గెలుపు ఓటముల గురించి, పెద్దగా చర్చ జరగలేదు.

అయితే, అధికార, విపక్షాల అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ మొదలైన తర్వాత చిత్ర విచిత్ర పరిణామాలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్ధి ఎంపిక ఒక ప్రహసంగా సాగింది. ఒకటో కృష్ణుడు, రెండవ కృష్ణుడు, మూడవ కృష్ణుడు ఇలా ఒక్కొక్క పేరు తెర మీదకు వచ్చి తప్పుకుంటూ పోయింది. చివరకు, యశ్వంత్ సిన్హా ఉమ్మడి అభ్యర్ధిగా తెర మెడకు వచ్చారు.  

అయితే, బీజేపీ/ఎన్డీఎ గిరిజ మహిళ, ద్రౌపతి ముర్ముపేరును ప్రకటించిన తర్వాత, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్ధి యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇస్తున్న పార్టీలు ఒకటికటిగా సారీ అంటూ చేయి వదిలేస్తున్నాయి. ముర్ముకు మద్దతు ప్రకటిస్తున్నాయి. ముందుగా అనుకున్న విధంగానే ఏ కూటమిలోనూ లేని వైసీపీ, బీజేడీ (కారాణాలు ఏవైనా) ద్రౌపతి ముర్ముకు మద్దతు ప్రకటించాయి. కానీ ప్రతిపక్ష కూటమిలోని పార్టీలో కూడా ఒకటొకటిగా జారిపోతున్నాయి,

చివరకు యశ్వంత్ సిన్హా స్వరాష్ట్రం ఝార్ఖండ్’ లో అధికారంలో ఉన్న యూపీఏ భాగస్వామ్య పార్టీ  జేఎంఎం ముర్ముకు మద్దతు ప్రకటించింది. యశ్వంత్ సిన్హా స్వరాష్ట్రమే కాదు, సొంత పార్టీ, టీఎంసి కుడా, ఆయనను దూరంగానే ఉంచుతోంది.  ఆయన పేరును వెనకుండి ముందుకు తెచ్చిన టీఎంసీ అధినాయకురాలు మమతా బెనర్జీ కూడా, యశ్వంత్ సిన్హాకు హ్యాండ్ ఇచ్చే సంకేతాలు ఇచ్చారు. ద్రౌపతి ముర్ము పేరు ముందే ప్రకటించి ఉంటే, అసలు యశ్వంత్ సిన్హాను బరిలో  దించక పోదుమని, పరోక్షంగా, ముర్ముకు మద్దతు ఇచ్చే సంకేతాలు ఇచ్చారు. అంతే కాకుండా గెలిచే అవకాశాలు ఎండీఎ అభ్యర్ధికే ఉన్నాయని, యశ్వత్ సిన్హాను పోటీ నుంచి గౌరవప్రదంగా తప్పుకుంటే ఉత్తమం అనే సలహా ఇచ్చారా అన్నట్లుగా, మరో విధంగా సిన్హాను అవమానించే విధంగా ఓ ప్రకటన చేశారు. ప్రచారం పేరున బెంగాలుకు రావద్దని అన్నారు. చివరకు శివసేన రెండు వర్గాలు, బీజేపీ హార్డ్కోర్ శత్రు పక్షం  ఎస్పీ, ఎస్పీ చీలిక వర్గం ఎస్బీఎస్పీ , బీఎస్పీ, గోవాలో కాంగ్రెస్ చీలిక వర్గం ఇలా ఒకటికటిగా పార్టీలు, ముర్ముకు మద్దతు తెలుపుతున్నాయి. చివరకు కాంగ్రెస్ పార్టీలోనూ యశ్వంత్ సిన్హా కు సంపూర్ణ మద్దతు లభించే పరిస్థతి లేదని అంటున్నారు.  తెలంగాణలో పర్యటనలో యశ్వంత్ సిన్హా  తెరాస, కాంగ్రెస్ రాజకీయ వైరుధ్యాల కారణంగా కాంగ్రెస్ పార్టీని కలవకుండానే వెనక్కు వెళ్ళిపోయారు. 

ఇలా ఓ వంక ప్రతిపక్ష కూటమిలోని పార్టీలు క్యూకట్టి ఎన్డీఎ అభ్యర్ధు ద్రౌపతి ముర్ముకు జై కొడుతున్నాయి. మరోవంక మద్దతు ఇస్తున్నపార్టీలు ఏవీ కూడా ఆయన్ని సొంతం చేసుకుంటున్నట్లు లేదు. తెరాస వంటి కొన్ని పార్టీలు ఇంకా యశ్వంత్ సిన్హా’కు మద్దతు తెలుపుతున్నా,చివరకు ఆత్మ ప్రభోధమే అందరి నినాదం అయ్యేలా వుందని అంటున్నారు. నిజానికి  యశ్వత్ సిన్హాకు గెలుపు మీద ఎప్పుడూ ఆశలు లేవు.. కానీ, ఓటమి ఏ స్థాయిలో ఉంటుంది అనేదే, ఇప్పడు అందరి ముందున్న ప్రశ్న.

By
en-us Political News

  
తెలంగాణ రక్షణ సేన పార్టీకి గుర్తింపు ఇవ్వాలని పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు.
సీఎం అవినీతి బండారం మొత్తం బయటపడిందన్న కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్ తీరు పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజా రంజక పాలనను పూర్తిగా గాలికొదిలేసి కేవలం ప్రతిపక్షాలపై నిందలు వేయడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు.
తెలంగాణ షాబాద్ లో ఆరుగురిని అత్యంత కిరాతకంగా చంపిన రాజ్ కుమార్ కు, సొంత బాబాయిపై గొడ్డలి వేటు, సొంత తల్లీ, చెల్లిని గెంటేసిన జగన్ కూ మనస్తత్వ పరంగా పోలీకలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పరిశ్రమల పేరుతో యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పి, వేల ఎకరాల విలువైన ప్రభుత్వ భూములను ఇలా కారుచౌకగా కేటాయించడంపై అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే, భూములు పొందిన తర్వాత గాలి జనార్ధన్ రెడ్డి అక్కడ ఉక్కు కర్మాగారాన్ని నిర్మించడంలో పూర్తిగా విఫలమయ్యారు. పరిశ్రమ పెట్టకపోగా, ఈ ప్రభుత్వ భూములను జాతీయ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి దాదాపు 350 కోట్ల రూపాయల మేర రుణాలు పొంది బ్యాంకులను సైతం మోసం చేశారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి.
ముందస్తు ఎన్నికల ప్రచారాలపైనా సీఎం స్పష్టత ఇచ్చారు. కొందరు ప్రచారం చేస్తున్నట్లుగా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే ప్రశక్తే లేదని స్పష్టం చేశారు. ఎవరో ఏదో అనుకున్నారని తాము ముందస్తుకు వెళ్లే ప్రసక్తే లేదన్నారు.
నిన్న మొన్నటి వరకూ వైసీపీకి, వివాదాస్పద యూట్యూబర్ ప్రశ్న రావణ్ కు అనుకూలంగా గళమెత్తిన జడ శ్రవణ్ కుమార్ అంత లోనే.. ఇలా యూటర్న్ తీసుకుని వైసీపీపై విరుచుకు పడటం విశేషం. తనకు వైసీపీ ఫండింగ్ చేస్తోందని వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చే క్రమంలో ఆయన వైసీపీ దోపిడీని ఎండగట్టారు. వైసీపీ తనకు ఫండింగ్ చేయడమేంటని ప్రశ్నించిన ఆయన ఆ పార్టీ నేతలు ఎంగిలి మెతుకులను కూడా వదలకుండా దోచేసుకుంటారని దుయ్యబట్టారు. జగన్ పాలనా కాలమంతా దోపిడీ రాజ్యమేలిందని విమర్శలు గుప్పించారు.
మొత్తం మీద రేవంత్ సభలో జగన్ ఫ్లెక్సీలు, బ్యానర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా తెలంగాణలో కేటీఆర్ సభలోనూ జగన్ ఫ్లెక్సీలు వెలిసన సంగతి తెలిసిందే. సొంత రాష్ట్రంలో కార్యక్రమాలు చేపట్టడంలో స్తబ్దుగా ఉంటున్న వైసీపీ శ్రేణులు తెలంగాణలో మాత్రం ఇతర పార్టీల సభలలో తమ అధినేత ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రదర్శించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది.
మాజంలో వివాదాలకు కారణమైన ఒక వ్యక్తికి వైసిపి బహిరంగంగా మద్దతు ప్రకటించడం, మరీ ముఖ్యంగా మత విద్వేషాలు ప్రజ్వరిల్లేలా వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి.. తనను తాను రావణుడినని చెప్పుకున్న వ్యక్తిని వత్తాసుగా వైసీపీ నిలవడం కోరి ప్రజా వ్యతిరేకతను కొని తెచ్చుకోవడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఈటల కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ గళం ఎత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఆరోపణలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. కాళేశ్వరం కమిషన్ విచారణ నేపథ్యంలో ఈటల రాజేందర్ బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మాట్లాడారు. దీంతో ఈటల మళ్లీ కారెక్కేస్తారా అన్న ప్రచారం అప్పట్లో జోరందుకుంది. ఆ తరువాత సద్దుమణిగింది.
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అత్యంత సంక్లిష్టమైన మరియు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నాయి.
ఉపా కింద నమోదైన ఈ కేసులో నిందితుడి తరఫున న్యాయపోరాటం చేసేందుకు వైసీపీ పార్టీ లీగల్ సెల్ విభాగానికి చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి రంగంలోకి దిగారు.
ఈ సర్జరీల తరువాత పవన్ కల్యాణ్ కనీసం నెల రోజుల పాటు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఇటీవల అనంతపురం జిల్లాలో మడకశిర ఎమ్మెల్యే ఎమ్ఎస్ రాజు, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య చోటుచేసుకున్న వ్యక్తిగత విమర్శలు, ఆరోపణల పరంపరపై మధుసూదన్ రెడ్డి, ప్రజాప్రతినిధుల మధ్య కేవలం రాజకీయ పోరాటం ఉంటే ఫర్వాలేదని, కానీ ఇరువర్గాలు కులాల ప్రస్తావన తెస్తూ కుంపట్లు రాజేయడం తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.