మూడో ఫ్రంట్ ముచ్చటే లేదు తెరపైకి మళ్ళీ పీకే

Publish Date:Apr 30, 2022

Advertisement

తిరిగే కాలు, తిట్టే నోరు ఉరుకోవు. ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిశోర్. (పీకే)కూడా అంతే. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రత్యాన్మాయ రాజకీయ కూటమి ఏర్పాటు ప్రయత్నాలలో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, ఆయన వెనకడుగు వేయరు. నిజానికి, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పీకే, ‘ఎన్నికల వ్యూహ కర్త’ అవతారం చాలిస్తున్నానని ప్రకటించారు.అలాగే, ప్రత్యక్ష రాజకీయాలకు తాను పనికి రానని, ఆయనకు ఆయనే, ‘ఐ యామే ఫెయిల్డ్ పొలిటీషియన్’ అని ప్రకటించుకున్నారు. 
అయితే, ఆ తర్వాత ఆయన,ఆ విషయమే మరిచి పోయారు. ఏ పార్టీ పిలిచి బొట్టు పెట్టక పోయినా, ఆయనంతట ఆయనగానే బీజేపీ యేతర పార్టీల కూటమి ఏర్పాటు కోసం నడుం బిగించారు. మమత, శరద్ పవార్, స్టాలిన్, కేసీఆర్, ఇలా బీజేపీ వ్యతిరేక శక్తులు అన్నిటినీ ఏకం చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తునే ఉన్నారు.ఈ ప్రయత్నాలలో వడిదుడుకులు ఎదురైనా, ఎదురు దెబ్బలు తగిలినా పట్టించుకునేదే’ లే .. అంటూ ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వ్యూహాలను మారుస్తూ ముందుకు సాగుతూనే ఉన్నారు. ఇందులో భాగంగానే, ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమై చర్చలు సాగించారు. దేశంలో వారం రోజుల పాటు హల్  చల్ సృష్టించారు. అయితే, చివరకు పీకే కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన నుంచి వెనకడుగు వేశారు. అయినా, అక్కడితో కథ ముగిసి పోలేదు. 
ఇప్పుడు మళ్ళీ పీకే బీజేపీ వ్యతిరేక కూటమి గురించి, కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి కాంగ్రెస్ ఒక్కటే ప్రత్యాన్మాయం. థర్డ్ ఫ్రంట్, ఫోర్త్ ఫ్రంట్’కు  ఛాన్స్ లేదు. బీజేపీని ఓడించాలంటే, కాంగ్రెస్’తో జట్టు కట్టడం మినహా, తెరాస, తృణమూల్ వంటి ప్రాంతీయ పార్టీలకు మరో దారి లేదని తేల్చి చెప్పారు.  ఒక టీవీ చానల్’ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన ఇదే విషయాన్ని కుండ బద్దలు కొట్టారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారధ్యంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారా, అన్న ప్రశ్నకు పీకే, దేశంలో మూడు, నాలుగు ఫ్రంట్లతో ప్రయోజనం లేదని, స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా గెలిచినా గెలవకున్నా, ఉనికి ఉన్న, బీజేపీ యేతర పార్టీ కాంగ్రెస్ ఒక్కటే, సో.. బీజేపీకి కాంగ్రెస్ సారధ్యంలో కూటమి మాత్రమే ప్రత్యాన్మాయం అవుతుందని, శషబిశాలు లేకుండా స్పష్టం చేశారు. 
దేశంలో మూడో ఫ్రంట్ లేదా నాలుగో ఫ్రంట్ ఎన్నికల్లో విజయం సాధించగలదని తాను ఎప్పుడూ నమ్మలేదని, బీజేపీని మొదటి ఫ్రంట్‌గా పరిగణిస్తే.. ఆ పార్టీని ఓడించాలంటే రెండో ఫ్రంట్ కావాల్సిందేనని, ఏ పార్టీ అయినా బీజేపీని ఓడించాలనుకుంటే.. రెండవ ఫ్రంట్‌గా ఆవిర్భవించాలంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ను సెకండ్‌ ఫ్రంట్‌గా భావిస్తున్నారా అని ఆయన్ను ప్రశ్నించగా.. దేశంలోనే రెండో అతిపెద్ద పార్టీ కాంగ్రెస్‌ అని అన్నారు. కాంగ్రెస్ సారధ్యంలోనే బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పడుతుందని విశ్వాసం వ్యక్తపరిచారు. 
ఈ  నేపధ్యంలో తెలంగాణలో బీజీపే అధికారంలోకి రాకుండా అడ్డు కునేందుకు, తెరాస, కాంగ్రెస్ తో జట్టు కట్టాలని పీకే చెప్పకనే చెప్పినట్లు అయిందని పరిశీలకు బావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు లేదా ఎన్నికల తర్వాత అయినా, తెరాస, కాంగ్రెస్ జట్టు కట్టే అవకాశాలను ఇప్పటికీ కొట్టి వేయలేమని విశ్లేషకులు అంటున్నారు. అందుకే, ముఖ్యమంత్రి కేసేఆర్ కూడా థర్డ్ ఫ్రంట్ ఆలోచను అటక ఎక్కించారని విశ్లేషకులు అంటున్నారు. అయితే కాంగ్రెస్ నాయకులు మాత్రం, తెరాసతో కలిసేదే లేదని అంటున్నారు. మరో వంక బీజేపీ నాయకులు కోతికి కొబ్బరి కాయ దొరికింది అన్నట్లుగా, పీకే  వ్యాఖ్యలను పట్టుకుని, తెరాస ప్రభుత్వ వ్యతిరేక ఓటును కొల్ల గొట్టేందుకు,  కాంగ్రెస్, తెరాస పార్టీలు ఒకే నాణ్యానికి రెండు పక్కలని ప్రచారం చేస్తున్నారు. అయితే, ఎన్నికలకు ఇంకా చాల సమయం వుంది కాబట్టి, రేపు ఏమి జరుగుతుంది అనేది, ఇప్పుడే ఉహించలేమని పరిశీలకులు అంటున్నారు. నిజం. రాజకీయాలలో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చును.

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వందేమాతరం అంశం చర్చనీయాంశంగా మారింది.
2024 ఎన్నికల సమయానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న జనసేన పార్టీ తెలుగుదేశం, బీజేపీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల రంగంలోకి దిగింది. ఆ ఎన్నికలలో నాగబాబు అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి రంగంలోకి దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది. అయితే పొత్తు ధర్మంలో భాగంగా నాగబాబుకు ఆ ఎన్నికలలో పోటీ చేసే అవకాశమే దక్కలేదు.
తమిళనాడులో బీజేపీ, హీరో విజయ్ సారథ్యంలోని టీవీకేల పొత్తు విషయంలో మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఈసీ తీరుపై నమ్మకం లేదని చెబుతున్న పార్టీ, ఇప్పుడు సీఈసీపై అభిసంశన తీర్మానానికి మద్దతుగా నిలబడకుంటే.. ఆ పార్టీ నైతికతే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒక వేళ వైసీపీ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తే ఇక ముందు, ఎన్నికల అక్రమాలపై మాట్లాడేందుకు వైసీపీకి అర్హతే ఉండదు. ఇంత వరకూ తెలుగుదేశం కూటమి విజయంపై వారు చేసిన విమర్శలన్నీ దూదిపింజెల్లా ఎగిరిపోతాయి.
బీఆర్ఎస్ హయాంలో ఇదే ఫామ్‌హౌస్ వేదికగా జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతం అప్పట్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో రోహిత్ రెడ్డి ఫిర్యాదుతోనే పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ కేసు జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.
దేవ్ జీ అరెస్ట్ ఎలా జరిగింది? అరెస్టు తరువాత ఆయన లొంగుబాటు ప్రకటన చేసి జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? లొంగిపోలేదు అంటూనే.. ప్రస్తుత పరిస్థితుల్లో అజ్ణాతంగా ఉండి ఉద్యమాన్ని కొనసాగించడం కష్టసాధ్యమని ఎందుకు చెబుతున్నారు?
త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి రావడం కన్ఫర్మ్ అన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి త్రిష నుంచి ఎటువంటి క్లారిటీ అయితే ఇప్పటి వరకూ రాలేదు. ప్రస్తుతం త్రిష పలు సినిమాలలో నటిస్తున్నారు. వాటిలో మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా కూడా ఉంది.
మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా పవన్ కల్యాణ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనీ, షూటింగ్ లంటూ అధిక సమయం హైదరాబాద్ లోనే ఉంటున్నారని రోజా అన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి సినిమాలలో యాక్టింగ్ కి పరిమితమైనట్లుగా పవన్ కల్యాణ్ తీరు ఉందని రోజా అన్నారు. కీలకమైన మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టడం సరికాదన్న రోజా దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే.. పాతిక మంది ఎమ్మెల్యేలు ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ భేటీ జరగడం సంచలనం సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదిక 16వ సంచికలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్‌ రెండుసార్లు, కాంగ్రెస్‌ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.