ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు?.. బడ్జెట్లో కీలక హామీకి దక్కని చోటు

Publish Date:Mar 1, 2025

Advertisement

ఉచిత బస్సు. ఏపీలో కూటమి హామీలలో కీలకమైన వాటిలో ఇదొకటి. ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలవుతున్నా, ఇప్పటివరకు ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పధకం ఇంకా అమల్లోకి రాలేదు . దీనిపై మహిళా లోకంలో ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో, త్వరలోనే ఆ పధకాన్ని అమల్లోకి తీసుకొస్తామని సర్కార్ అంటోంది. అయితే, తాజా బడ్జెట్ లో కూడా దానికి సంబంధించి ఊసే లేకపోవడంతో... విపక్ష నేతలు విమర్శలతో చెలరేగిపోతున్నారు.

2024 సార్వత్రిక ఎన్నికల్లో 164 సీట్ల అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది కూటమి సర్కార్. జనసేన తెలుగుదేశం బిజెపి లను ఏకతాటి మీదకు తీసుకువచ్చి జగన్ కు భారీ షాక్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. అయితే ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు అనేక హామీలు ఇచ్చాయి. వాటిలో ఇప్పటికే కొన్ని అమలు చేస్తుండగా... మరికొన్ని ఇంకా మొదలు కాలేదు. అయితే భారీ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ, కొన్ని పథకాల ఊసు అందులో కనిపించలేదు . దీంతో ఆయా వర్గాల్లో ఆందోళన పెరుగుతోంది. ముఖ్యంగా మహిళాలోకం  ఉచిత బస్సు పథకం కోసం ఎప్పటినుంచో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా.. ఇప్పటివరకు ఉచిత బస్సు పథకం హామీ అమల్లోకి రాలేదు . బడ్జెట్లో కూడా దాని గురించి ఊసే ఎత్తకపోవడంతో, అసలు ఆ పథకం ఎప్పుడు అమలు చేస్తారు అన్న సందేహం అందరిలోనూ నెలకొంది. అయితే ప్రభుత్వం మాత్రం త్వరలోనే ఉచిత బస్సు పథకాన్ని అమలులోకి తీసుకొస్తామని చెబుతోంది. 

గడచిన తొమ్మిది నెలల కాలంలో, కూటమి ప్రభుత్వం అనేక సంస్కరణలను తీసుకువచ్చింది. ముఖ్యంగా వివిధ శాఖల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలో పవన్ కళ్యాణ్ విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చారు. అదే విధంగా మిగతా మంత్రులు కూడా వారివారి శాఖల్లో మార్పు తీసుకువచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అభివృద్ధిని ప్రధాన అంశంగా తీసుకున్న కూటమి సర్కార్ .... ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు రాష్ట్రంలో పేదరికం నిర్మూలించేందుకు... కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందుకు సంబంధించి పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకువచ్చే దిశగా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది . అంతేకాదు, కేంద్రం నుంచి కూడా భారీ ఎత్తున నిధులు తీసుకువచ్చి అభివృద్ధికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూస్తోంది . అయితే సంక్షేమ పథకాల విషయానికి వచ్చేసరికి... నెలకు 4000 రూపాయల పింఛన్ పథకాన్ని ఇప్పటికే అమలు చేస్తుండగా... వృద్ధుల్లో కూటమి ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది. అయితే ఉచిత బస్సు పథకం కోసం మహిళలు మాత్రం తొమ్మిది నెలల నుంచి ఉత్కంఠ గా ఎదురు చూస్తున్నారు. మరి ఆ పథకం ఎప్పుడు అమలు అవుతుందో తెలియదు గానీ విపక్షం నుంచి మాత్రం అనేక విమర్శలు వసున్నాయి. 

కర్ణాటక, తెలంగాణలో ఉచిత బస్సు పథకం అద్భుతమైన ఫలితాలు ఇస్తోంది. అక్కడ అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే పధకాన్ని అమల్లోకి తీసుకొచ్చారు . కానీ, ఏపీలో మాత్రం ఇంకా... మొదలు పెట్టలేదు . తాజా బడ్జెట్ లో కూడా... మహిళలకు ఉచిత బస్సు పధకం ఊసెత్తకపోవడం వారిని నిరాశకు గురిచేసింది.  ఉగాది నుంచి ఉచిత బస్సు పథకం పథకం అమలు చేస్తామని ఆశ చూపి.. తీరా బడ్జెట్‌లో దాని గురించి మాట్లాడలేదు అని వైసీపీ విమర్శలు చేస్తోంది .  అయితే, కర్ణాటక , తెలంగాణాలలో ఉచిత బస్సు పధకం వలన... ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటూ అక్కడి విపక్షాలు ఆందోళనలు కూడా నిర్వహించాయి. 

అయితే,  ఏపీలో ఉచిత బస్సు కంటే.. అర్జెంటుగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చెయ్యడం ముఖ్యం అని కూటమి ప్రభుత్వం భావిస్తోందట . ఎందుకంటే, ఈ రెండు పథకాల ప్రభావం విద్యార్థుల తల్లిదండ్రులపై,  రైతన్నలపై ఉంటుంది. వీటిని త్వరగా ప్రారంభించకపోతే, వారంతా తీవ్ర ఇబ్బందులు పడతారు. ఉచిత బస్సు అర్జెంటుగా ప్రారంభించకపోయినా.. అంత ఇబ్బందేమీ ఉండదు కాబట్టే.. వీటికి నిధులు కేటాయించి, వీటిని ముందు ప్రారంభించాలని ప్రభుత్వం ఆలోచించినట్లు తెలుస్తోంది.  మరి.. ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటినుంచి అమల్లోకి వస్తుందో కాలమే తేల్చాలి.

By
en-us Political News

  
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
G.D. Naidu, known as the “Edison of India,” was an Indian inventor, industrialist and pioneer of innovation. This article explores his remarkable life, curiosity, self-learning, experimentation and practical approach to technology, and the lessons his journey offers to Millennials, Gen Z and Gen Alpha.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
G.D. Naidu జీవితంలో నుంచి Millennials, Gen Z, Gen Alpha నేటి తరాలు ఏం నేర్చుకోవాలి? ఆయన Curiosity, Self-Learning, Innovation, Technology, Learning by Doing, Experimentation మరియు India కోసం కొత్తగా ఆలోచించే విధానం గురించి తెలుసుకోవడానికి ఈ కథనం చదవండి.
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.