Publish Date:Aug 12, 2022
బీహార్ ఎఫెక్ట్ దేశ వ్యాప్తంగా బీజేపీపై పడిందా? నిన్న మొన్నటి దాకా తిరుగులేని పార్టీగా, 2024 ఎన్నికలలో ఒంటరిగా బీజేపీకే 300కు పైగా స్థానాలు వస్తాయంటూ అన్ని సర్వేలూ వెల్లడించిన పరిస్థితి మారిపోయిందా? అంటే తాజాగా వెలువడిన సీ ఒటర్ సర్వే ఔననే అంటోంది. నితీష్ ఎపిసోడ్ తరువాత బీజేపీ బలం గణనీయంగా తగ్గిందని మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట ఇండియా టుడే నిర్వహించిన సీ ఓటర్ సర్వే పేర్కొంది.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి కనీసంలో కనీసం 21 సీట్ల తక్కువ వస్తాయని సర్వే వెల్లడించింది. ఆగస్టు 1కి ముందు నిర్వహించిన సర్వేలో బీజేపీ కూటమికి 300కు పైగా సీట్లు వస్తాయని పేర్కొన్న ఆ సర్వే నితీష్ ఎపిసోడ్ తరువాత మాత్రం ఆ సంఖ్య 289కి పరిమితం అవుతుందని తేల్చింది.
కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థానాలు లభించినప్పటికీ మెజారిటీ మాత్రం గణనీయంగా తగ్గుతుందని పేర్కొంది. భారీ విజయంపై ఆశలు పెట్టుకున్న బీజేపీ సాధారణ విజయంతో సరిపెట్టుకోవలసి వస్తుందని ఆ సర్వే పేర్కొంది. అయితే ఈ సర్వే అనంతరం విశ్లేషకులు రానున్న రోజులలో బీజేపీ బలం మరింత తగ్గే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు.
ఒక్కటొక్కిగా మిత్ర పక్షాలు చేజారిపోతున్న నేపథ్యంలో త్వరలో జరగనున్న మునుగోడు ఉప ఎన్నిక..కర్నాటక అసెంబ్లీ ఎన్నికల తరువాత బీజేపీ బలహీనతలు మరింత ప్రస్ఫుటంగా బయటపడే అవకాశాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించకుంటే.. ఆ పార్టీ ఇక తెలంగాణపై ఆశ వదిలేసుకోవలసిందేనని చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nitesh-effect-on-bjp-hopes-2024-is-not-that-easy-39-141836.html
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్ఎస్ నేతలు హరీశ్రావు, కేటీఆర్లకు సవాల్ విసిరారు.