నిర్భయ కేసులో బాలనేరస్తుడిని విడుదల చేయాలా...వద్దా?

Publish Date:Dec 15, 2015

Advertisement

 

సరిగ్గా మూడేళ్ళ క్రితం డిల్లీలో జరిగిన నిర్భయ కేసులో దోషిగా నిర్ధారించబడిన బాల నేరస్థుడికి బాల నేరస్తుల చట్ట ప్రకారం మూడేళ్ళ నిర్బంధం విధించబడింది. అతను ఈ మూడేళ్ళ కాలం డిల్లీలో బాల నేరస్తుల సంరక్షణా కేంద్రంలో గడిపాడు. అతనికి విధించిన శిక్ష కాలం ఈనెల 20వ తేదీతో పూర్తవుతుంది. కనుక అతనిని విడుదల చేయవలసి ఉంది. అతనికిప్పుడు 20 ఏళ్ళు నిండాయి. కనుక అతను మళ్ళీ నేరాలు చేయకుండా సాధారణ జీవితం జీవించేందుకు డిల్లీ ప్రభుత్వం అతనికి రూ. 10,000 నగదు, ఒక కుట్టు మిషను అందించడానికి సిద్దపడింది. అతని తల్లి తండ్రులను స్వగ్రామం నుండి కారులో రప్పించి, అతనిని వారికి అప్పగించి మళ్ళీ కారులో వారిని స్వగ్రామంలో దింపి వచ్చేందుకు కూడా డిల్లీ ప్రభుత్వం సిద్దపడింది.

 

అటువంటి దారుణమయిన నేరం చేసిన వ్యక్తికి ప్రభుత్వమే ఆర్ధిక సహాయం చేయడాన్ని చాలా మంది తప్పు పడుతున్నారు. నేరం చేసినవాడిని కటినంగా శిక్షించలేకపోగా మళ్ళీ అతనికి ఇటువంటి బహుమానాలు ఇవ్వడమేమిటని ప్రశ్నిస్తున్నారు. “అతనికి డిల్లీ ప్రభుత్వమే ఇల్లు కట్టించి పెళ్లి చేసి ఉద్యోగం కూడా ఇస్తే బాగుండేది కదా? ఇంక మళ్ళీ అటువంటి నేరాలు చేయడు..”అని డిల్లీ ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు.

 

నేరస్తులను శిక్షించడం కంటే సంస్కరించడమే మేలని అందరూ అంగీకరిస్తారు. ఈ మూడేళ్ళ కాలంలో బాల నేరస్తుల సంరక్షణా కేంద్రంలో అతనిని సంస్కరించి సన్మార్గం వైపు మళ్ళించే ప్రయత్నాలు జరిగాయో లేదో తెలియదు కానీ అతను డిల్లీ హైకోర్టు బాంబు ప్రేలుడు కేసులో నిర్బంధించబడిన మరో బాల నేరస్తుడితో స్నేహం చేస్తున్నట్లు నిఘా వర్గాలు కనుగొన్నారు. అతను ఉగ్రవాదంపై ఆసక్తి పెంచుకొన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. కనుక అతని మానసిక పరిస్థితి ఏవిధంగా ఉందో తెలుసుకోకుండా అతనిని బయటకు పంపినట్లయితే అతని వలన సమాజానికి ఇంకా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని, కనుక అతని విడుదలను మరికొంత కాలం పాటు పొడిగించాలని కేంద్రప్రభుత్వం డిల్లీ హైకోర్టుని అభ్యర్ధించింది.

 

బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా అతని విడుదల కాకుండా నిలిపివేయాలని కోరుతూ హైకోర్టులో ఒక పిటిషను వేశారు. ఒకవేళ అతనిని విడిచిపెట్టదలిస్తే, అతనిపై నిరంతర నిఘా ఉంచవలసిందిగా నిర్భయ తల్లి తండ్రులు హైకోర్టుని, కేంద్ర హోంమంత్రి రాజ్ నాద్ సింగ్ ని కోరారు. ఆ విధంగా చేసినట్లయితే మళ్ళీ అతని వలన సమాజానికి ప్రమాదం కలగకుండా నివారించవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ కేసును విచారణకు స్వీకరించిన డిల్లీ హైకోర్టు, దీనిపై తీర్పు చెప్పే ముందు ఈ విషయాలన్నిటినీ పరిగణనలోకి తీసుకొంటామని చెప్పింది కానీ ఇంకా తీర్పు చెప్పలేదు.

 

ఇటువంటి హేయమయిన నేరాలకి పాల్పడిన 16-18 ఏళ్ల వయసుగల బాల నేరస్తులను మేజర్లుగానే పరిగణించి వారికి చట్ట ప్రకారం శిక్ష వేసేందుకు కేంద్ర ప్రభుత్వం బాల నేరస్తుల చట్టానికి సవరణ చేసి పార్లమెంటులో ప్రవేశపెట్టింది. లోక్ సభ దానికి ఆమోదం తెలిపినప్పటికీ అధికార, విపక్షాల మధ్య పార్లమెంటులో జరుగుతున్న రాద్దాంతం కారణంగా అది రాజ్యసభ ఆమోదానికి నోచుకోలేదు. కనుక నేటికీ పాత చట్టమే అమలులో ఉంది. కనుక ఈ నిర్భయ కేసులో బాలనేరస్తుడు ఇప్పుడు మేజర్ అయినప్పటికీ అతనిని శిక్షించే అవకాశం లేదు.

 

అనేక నేరాలు చేసి జైలు శిక్ష అనుభవించిన వారిని సత్ప్రవర్తన కారణంగా జైలు నుండి విడిచిపెడుతుంటారు. కానీ ఈ నిర్భయ నేరస్థుడు తన శిక్ష కాలం పూర్తి చేసిన్నపటికీ అతని విషయంలో ఇంకా ఇంత చర్చ, అనుమానాలు రేకెత్తుతున్నాయి అంటే కారణం అంత చిన్న వయసులోనే అంత తీవ్రమయిన నేరానికి పాల్పడినందుకేనని భావించవచ్చును. మూడేళ్ళపాటు బాలనేరస్థుల సంరక్షణా కేంద్రంలో ఉంచినపుడు అతనిని సంస్కరించలేకపోతే అది వారి వైఫల్యంగానే భావించవచ్చును. లేదా అతను సంస్కరించలేనంత కరుడుగట్టిన నేరస్తుడిగా మారి ఉండవచ్చునని అనుకోవాలి. అయితే ఆ కారణంగా అతను శిక్ష పూర్తి చేసుకొన్న తరువాత కూడా ఇంకా నిర్బంధించి ఉంచడం కూడా చట్ట ప్రకారం తప్పే అవుతుంది. కానీ సమాజానికి అతని వలన హాని కలుగుతుందని భావిస్తున్నట్లయితే అతనిని జైలుకి తరలించక తప్పదు. లేదా నిర్భయ తల్లి తండ్రులు సూచిస్తున్నట్లుగా అతను విడుదలయిన తరువాత అతనిపై నిరంతర నిఘా పెట్టవలసి ఉంటుంది. డిల్లీ హైకోర్టు ఈ విషయంలో తగిన నిర్ణయమే తీసుకొంటుందని ఆశిద్దాము.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.