దేశానికి బలమయిన నాయకత్వం అవసరమే కదా?

Publish Date:Dec 14, 2015

Advertisement

 

జాతీయ పార్టీలయిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలలో వ్యక్తిపూజ బాగా ఎక్కువయిపోయిందని ఎస్.సి.పి అధినేత శరద్ పవార్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ, బీజేపీలో ప్రధాని నరేంద్ర మోడీల చుట్టూనే ఆ పార్టీల రాజకీయాలు నడుస్తున్నాయని, అలాగే అధికారం అంతా వారి చేతుల్లోనే కేంద్రీకృతం అయి ఉందని, అది మంచి పద్ధతి కాదని శరద్ పవర్ తన ఆత్మకధలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో వ్యక్తి ఆరాధన ఇవ్వాళ్ళ కొత్తగా మొదలయిందేమీ కాదు. ఇందిరా గాంధీ హయాంలోనే అది పరాకాష్టకు చేరుకొంది. నాటి నుండి నేటి వరకు అది కొనసాగుతూనే ఉంది. అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ తన స్వశక్తి, పార్టీ సిద్దాంతాల కంటే గాంధీ, నెహ్రూ కుటుంబం పేరు మీద, ప్రాంతీయ పార్టీల మద్దతుతోనే తన రాజకీయ మనుగడ సాగిస్తోందని చెప్పక తప్పదు. అందుకే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి తనే అర్హుడనని భావించగలుగుతున్నారు. కానీ ఆయన తన నాయకత్వ లక్షణాలు నిరూపించుకోలేకపోవడం, పార్టీలో సమర్దులయిన వేరెవరికీ పార్టీ పగ్గాలు కట్టబెట్టే ఆలోచన చేయకపోవడంతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికి దిగజారుతోంది. ఒక వ్యక్తి మీద ఆధారపడి పార్టీ లేదా సంస్థ నడవడం వలన ఎటువంటి నష్టం జరుగవచ్చో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని చూసినట్లయితే అర్ధమవుతుంది.

 

బీజేపీలో ఏనాడూ ఇటువంటి వ్యక్తి ఆరాధన చూడలేదు. ఒకప్పుడు బీజేపీ అనగానే అటల్ బిహారీ వాజ్ పేయి, లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, యశ్వంత్ సిన్హా వంటి అనేకమంది ప్రముఖుల పేర్లు మదిలో మెదిలేవి. కానీ ప్రస్తుతం ఆ పార్టీ మోడీ నామస్మరణలో మునిగిపోయిందని, అధికారం అంతా ఆయన చేతిలోనే కేంద్రీకృతం అయిందని శరద్ పవార్ అభిప్రాయపడ్డారు. దేశంలో చాలా మంది అదే అభిప్రాయంతో ఉన్నారు.

 

ఆ అభిప్రాయం సహేతుకంగానే కనిపిస్తునప్పటికీ, ఒక్కోసారి అటువంటి విధానం కూడా అవసరం అవుతుంటుంది. గత పదేళ్ళ యూపీఏ పాలనలో పరిపాలనా వ్యవస్థలన్నీ అదుపు తప్పాయి. తత్ఫలితంగా దేశంలో అవినీతి, ఆరాచకం పెరిగిపోయి ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఆ పరిస్థితులను చక్కదిద్ది మన వ్యవస్థలను మళ్ళీ గాడినపెట్టాలంటే దేశానికి చాలా దృడమయిన నాయకత్వం అవసరం. అది మోడీలో ఉందని దేశ ప్రజలు భావించబట్టే ఆయనకు అధికారం కట్టబెట్టారు. అందుకే ఆ పార్టీలో అందరూ ఆయన నాయకత్వాన్ని అంగీకరిస్తున్నారు. నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేప్పట్టిన వెంటనే ఆ గాడి తప్పిన వ్యవస్థలన్నిటినీ మళ్ళీ గాడిన పెట్టడం మొదలుపెట్టారు. అవినీతి, కుంభకోణాలకు తావులేని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దేశంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. అంతర్జాతీయంగా దేశ పేరు ప్రతిష్టలు, విదేశాలతో భారత్ సంబంధాలు మెరుగుపరచగలిగారు.

 

ఇంతకు ముందు కేంద్రంలో దీనికి పూర్తి భిన్నమయిన పరిస్థితులు నెలకొని ఉండేవి. దేశంలో ఆర్ధిక సంస్కరణలు ప్రవేశపెట్టి గొప్ప పేరు సంపాదించుకొన్న డా. మన్మోహన్ సింగ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత అంతకు పదింతలు చెడ్డపేరు మూటగట్టుకట్టుకొన్నారు. ఆయన మచ్చ లేని నాయకుడయినప్పటికీ బొగ్గు కుంభకోణం కేసులో నిందితుడుగా కూడా పేర్కొనబడ్డారు. అందుకు కారణం ఆయన దృడంగా వ్యవహరించలేకపోవడమే. ఆయన పేరుకి ప్రధాని అయినప్పటికీ పెత్తనమంతా సోనియా గాంధీ చేసారు. కేంద్రంలో రెండు సమాంతర అధికార కేంద్రాలు ఏర్పడటం వలన దేశంలో వ్యవస్థలన్నీ గాడి తప్పాయి. దానిని మోడీ సరిచేస్తున్నారు. అందువలన అధికారం అంతా అయన చేతిలోనే ఉన్నట్లు పైకి కనబడుతున్నప్పటికీ లేదా అలాగ ప్రచారం జరుగుతున్నప్పటికీ అది పూర్తిగా వాస్తవం కాదని చెప్పవచ్చును.

 

ఉదాహరణకి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారి ఇటీవల విజయవాడలో ఫ్లై ఓవర్ కి శంఖుస్థాపన చేయడానికి వచ్చినపుడు రాష్ట్రంలో హైవే ప్రాజెక్టుల నిర్మాణానికి ఏకంగా రూ. 65,000 కోట్ల నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే కేంద్రమానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ రాష్ట్రంలో ఐదు ఉన్నత విద్యాసంస్థలకు శంఖుస్థాపన చేసి, శిక్షణా తరగతులు ప్రారంభించడానికి అనుమతులు కూడా మంజూరు చేసారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు రాజధాని నిర్మాణం మొదలుకాక మునుపే రాష్ట్రానికి రూ.1850 కోట్ల నిధులు తన శాఖ నుండి విడుదల చేసారు. ఇంకా డ్రెడ్జింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, బెల్ వంటి అనేక ఇతర ప్రాజెక్టులు మంజూరు అయ్యేయి.

 

ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే కాకుండా దేశంలో వివిధ రాష్ట్రాలకు గత ఎదాదిన్నర కాలంలో అనేక ప్రాజెక్టులు, నిధులు మంజూరు అవుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మంత్రులు, అధికారులు అందరూ కలిసికట్టుగా చేస్తున్న సమిష్టి కృషి కారణంగానే ఇవన్నీ సాధ్యం అవుతాయి తప్ప కేవలం మోడీయే స్వయంగా చేయలేరని అందరికీ తెలుసు. అయితే ఈ వ్యవస్థలన్నీ సక్రమంగా, సమర్ధంగా పనిచేస్తున్నాయంటే ప్రధాని నరేంద్ర మోడి దృడమయిన నాయకత్వం ప్రధాన కారణమని చెప్పక తప్పదు. దానిని ఎవరు ఏ విధంగా భావిస్తే ఆవిధంగా ఊహించుకోవచ్చును. కానీ దేశాభివృద్ధికి అటువంటి బలమయిన నాయకత్వం అవసరమనే విషయంలో ఎవరికీ భిన్నాభిప్రాయాలు ఉండవనే భావించవచ్చును.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.