హైదరాబాద్‌లో ఇక నైట్‌ బస్సులు.. 6 మార్గాల్లో ప్రత్యేక సర్వీసులు..!

Publish Date:Aug 26, 2026

Advertisement

 

ఉద్యోగాలు, ఉపాధి కోసం నగరంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి, శివారు ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు ప్రతిరోజూ ప్రయాణించే వారికి రాత్రివేళ ప్రజా రవాణా కొరత ఇబ్బందిగా మారుతోంది. రాత్రి 10 గంటల తర్వాత బస్సు సర్వీసులు తగ్గిపోవడం, 11 గంటల తర్వాత మెట్రో సేవలు నిలిచిపోవడంతో నైట్‌ షిఫ్ట్‌ ఉద్యోగులు, ముఖ్యంగా మహిళా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆటోలు, ప్రైవేట్‌ క్యాబ్‌లను ఆశ్రయించాల్సి రావడంతో అధిక మొత్తంలో చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో రాత్రివేళ ప్రజా రవాణాను మరింత అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాత్రి 10.30 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ప్రత్యేక నైట్‌ బస్సులు నడపాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఈ సేవలను ప్రతిరోజూ నిరంతరాయంగా నిర్వహించనున్నారు.

ప్రభుత్వ నిర్ణయం మేరకు తొలి దశలో 30 ప్రత్యేక బస్సులను 6 ప్రధాన మార్గాల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. రాత్రివేళ విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు, ఐటీ–బీపీఓ సిబ్బంది, దూర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే ప్రయాణికులకు ఈ సేవలు ఉపయోగపడనున్నాయి. మేడ్చల్‌ నుంచి గచ్చిబౌలికి 195 నంబర్‌ బస్సు, కొండాపూర్‌ నుంచి సికింద్రాబాద్‌కు 10H బస్సు, కోఠి నుంచి పటాన్‌చెరుకు 218, మరో మార్గంలో 222A బస్సులు అందుబాటులో ఉంటాయి. హయత్‌నగర్‌ నుంచి జేబీఎస్‌కు 290U బస్సు, సికింద్రాబాద్‌ నుంచి పటాన్‌చెరుకు 219 నంబర్‌ బస్సు రాత్రివేళల్లో సేవలు అందించనున్నాయి. రాత్రి వేళల్లో ప్రజా రవాణా అందుబాటులో లేకపోవడంతో మహిళా ఉద్యోగులు ఆటోలు, క్యాబ్‌లపై ఆధారపడాల్సి వస్తోంది. 

దీంతో అధిక చార్జీలతో పాటు భద్రతపైనా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నైట్‌ బస్సుల అందుబాటుతో ఈ సమస్య కొంతవరకు పరిష్కారం కానుంది. అత్యవసర రాత్రి ప్రయాణాలకు ప్రజా రవాణా మరింత అందుబాటులోకి రావడంతో ప్రయాణికులకు ఆర్థిక భారం కూడా తగ్గనుంది. ప్రస్తుతం ఆరు ప్రధాన మార్గాల్లో ప్రారంభించిన నైట్‌ బస్సులకు ప్రయాణికుల నుంచి వచ్చే స్పందన, ఆక్యుపెన్సీని అధికారులు పరిశీలించనున్నారు. డిమాండ్‌ పెరిగితే రానున్న రోజుల్లో మరిన్ని మార్గాలకు నైట్‌ బస్సు సర్వీసులను విస్తరించే అవకాశం ఉంది. దీంతో రాత్రివేళల్లో ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులకు నగర ప్రజా రవాణా మరింత ఉపయోగకరంగా మారనుంది.

Night buses in Hyderabad, Night shift employees, TG RTC, Occupancy, Kondapur, Koti, Secunderabad

By
en-us Political News

  
తిరుపతి ఫారెస్ట్ డివిజన్ అధికారులు అత్యంత అరుదైన 3 రోజ్-రింగ్డ్ ప్యారాకీట్స్ (రామచిలుకలను) సమర్థవంతంగా రక్షించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వాటిని తిరిగి అడవిలోకి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలు చదవండి.
శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే హయగ్రీవ జయంతి విశిష్టత, శ్రీమహావిష్ణువు హయగ్రీవ అవతారం ఎత్తడానికి గల ఆధ్యాత్మిక కథ మరియు విద్యార్థులకు జ్ఞానాన్ని ప్రసాదించే హయగ్రీవ పూజా విధానం గురించి వివరంగా తెలుసుకోండి.
చంద్ర గ్రహణ సమయంలో ఆధ్యాత్మిక రక్షణ మరియు మానసిక ప్రశాంతత పొందేందుకు పాటించాల్సిన సూతక కాల నియమాలు, మంత్ర జపం, గర్భవతుల జాగ్రత్తలు మరియు గ్రహణానంతర శుద్ధి, దానాల విశిష్టతలను వివరంగా తెలుసుకోండి.
2026 రక్షాబంధన్ సందర్భంగా సోదరుడి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం మరియు దీర్ఘాయువు కోసం సోదరీమణులు చేయాల్సిన పవిత్ర దానాల విశిష్టతలను తెలుసుకోండి. ఆహార ధాన్యాలు, బెల్లం, వస్త్రాలు మరియు నల్ల నువ్వుల దానం వల్ల కలిగే ఆధ్యాత్మిక, జ్యోతిష్య ప్రయోజనాలు ఇవే!
పెద్దపల్లి జిల్లాలోని ప్రసిద్ధ ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాన్ని ₹15 కోట్లతో దశలవారీగా పునర్నిర్మించనున్నారు. పర్యాటక శాఖ నుండి మరో ₹8 కోట్లు, భక్తుల కోసం 22 నూతన వసతి గదుల నిర్మాణానికి భూమిపూజ చేశారు. పూర్తి వివరాలు చదవండి.
కేరళ తీరం నుండి కార్గిల్ మంచు ఎడారుల వరకు భారతీయ పర్యావరణం, అడవులు మరియు నీటి వనరుల సంరక్షణలో ఇస్లామిక్ ఆధ్యాత్మిక సంప్రదాయాలు మరియు సూఫీ సంస్కృతి పోషించిన అరుదైన చారిత్రక పాత్రను సమగ్రంగా తెలుసుకోండి
ఫార్ములా ఈ-కార్ రేస్‌ కేసులో నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో మంగళవారం విచారణ జరిగింది.
ఎల్‌ఐసీ ఆన్‌లైన్ పోర్టల్‌లో క్రెడిట్ కార్డ్ ద్వారా ప్రీమియం చెల్లింపుల సదుపాయాన్ని హఠాత్తుగా నిలిపివేశారు. పేమెంట్ గేట్‌వే ఛార్జీల వివాదమే దీనికి కారణమా పూర్తి వివరాలు, ప్రత్యామ్నాయ చెల్లింపు మార్గాలు ఇక్కడ తెలుసుకోండి.
సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదిత అమెరికా పర్యటనకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ పొలిటికల్ క్లియరెన్స్ నిరాకరించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ప్రముఖ నటి, పద్మశ్రీ అవార్డు గ్రహీత షావుకారు జానకి మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు.
వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు.   ఆమె భౌతికకాయాన్ని అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం చెన్నైలోని తేనాంపేట, సెంట్ ఆఫ్‌ రోడ్‌లో ఉన్న ఆమె నివాసంలో ఉంచారు.
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.