Publish Date:Oct 15, 2022
రైతుల మహా పాదయాత్రకు వ్యతిరేకంగా ఆ పాదయాత్ర మార్గంలో వెలుస్తున్న ఫ్లెక్సీల గుట్టు రట్టయ్యింది. వివిధ సంఘాలు, వ్యక్తుల పేర్లతో వైసీపీ ఏర్పాటు చేస్తున్న ఆ ఫ్లెక్సీల లోగుట్టును ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో వెలిసిన ఓ పోస్టర్ వైసీపీ చేస్తున్న దుష్ట రాజకీయాన్ని ఎలుగెత్తి చాటింది. రైతుల మహాపాదయాత్రకు వ్యతిరేకంగా నిడదవోలులో క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ పేరుతో పోస్టర్లు వెలిశాయి.
ఆ పోస్టర్లలో వైసీపీ ఎమ్మెల్లే శ్రీనివాసనాయుడి ఫోటో పెద్దగా ఉంది. అయితే ఆ పోస్టర్ వెలసిన వెంటనే క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ వారు ఎమ్మెల్యేను కలిసి తమకు కనీస సమాచారం ఇవ్వకుండా, అనుమతి తీసుకోకుండా ఇలా ఫ్లెక్సీలు వేయడం సరికాదని ఆయనకు చెప్పారు. వాటిని వెంటనే తొలగించేయాలనీ కోరారు. అయితే ఎమ్మెల్యే మాత్రం.. మీకు ఏం కాదు.. వాటి సంగతి నేను చూసుకుంటానంటూ సర్ది చెప్పి పంపించేశారు. అయితే క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ వారు మాత్రం ఎమ్మెల్యే సమాధానంతో సమాధాన పడలేకపోయారు. దీంతో వారే రైతులు, ప్రజలకు విజ్ణప్తి చేస్తూ మరో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
ఆ ఫ్లెక్సీపై గత ఫ్లెక్సీతో తమకేమీ సంబంధం లేదనీ, వాటిని ఎవరు ఏర్పాటు చేశారో, ఎందుకు చేశారో అన్న విషయంపై తాము చర్చించదలచుకోలేదనీ, వారి విజ్ణతకే వదిలేస్తున్నామనీ పేర్కొన్నారు. దీంతో రైతుల మహాపాదయాత్ర మార్గంలో ఆ పాదయాత్రను వ్యతిరేకిస్తూ వెలుస్తున్న ఫ్లెక్సీలు, నిరసనల లోగుట్టు ఏమిటన్నది అందరికీ బోధపడిపోయింది. వైసీపీ వారే కుట్ర పూరితంగా సంఘాలు, సంస్థల అనుమతితో సంబంధం లేకుండా వారి, వాటి పేర్లతో రైతులకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని నిడదవోలు క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ వారు తాజాగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ తో తేటతెల్లమైపోయింది.
వైసీపీ బండారం బయటపడిపోయింది. ఇక వికేంద్రీకరణకు అనుకూలంగా విశాఖలో తలపెట్టిన ర్యాలీకి డ్వాక్రా మహిళలను తీసుకురావడానికి మొత్తం అధికార యంత్రాంగాన్నే నియోగించిన తీరు వైసీపీ ఏ స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నది తేటతెల్లం చేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nidadavolu-cloth-merchants-exposes-ycp-conspiracy-on-flecies-25-145474.html
గతంలో మాతో పెట్టుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, ఇప్పుడు పెట్టుకుంటే మూతిపళ్ళు రాలుతాయని కవిత హెచ్చరించారు. అంతేకాకుండా, అక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజధాని కట్టుకోవడం చేతకానివాళ్ళు, తెలంగాణ నవనిర్మాణం చేస్తారా అంటూ ఆమె ఎద్దేవా చేశారు.
అరవ శ్రీధర్పై ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో జనసేన నాయకత్వం దీనిపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
పోలీసులు జనసేన సభకు నో చెప్పారు. వేలాది మంది అభిమానులు, వందలాది మంది ముఖ్య నాయకులు హాజరయ్యే ఇటువంటి కీలక సభకు చివరి నిమిషంలో పర్మిషన్ నిరాకరించడంపై జనసేన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి కోలుకోకముందే.. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి సొంత పార్టీ ఎమ్మెల్యేలు భారీ షాక్ ఇచ్చారు. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత.. భవిష్యత్తు కార్యాచరణను చర్చించేందుకు ఏర్పాటు చేసిన కీలక సమావేశానికి పార్టీకి ఉన్న 80 మంది ఎమ్మెల్యేలలో ఏకంగా 60 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు అయ్యారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటున్న ఈ రాజకీయ ఒత్తిడి, ప్రత్యర్థుల వ్యూహాలపై సీనియర్ రాజకీయ విశ్లేషకుడు భరద్వాజ తో తెలుగువ్ న్యూస్ చానల్ ప్రత్యేక ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పవన్ కళ్యాణ్ను మానసికంగా, రాజకీయంగా దెబ్బతీసి కూటమి స్పిరిట్ను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ వ్యూహాత్మక దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
తెలుగువన్ వేదికగా జరిగిన ప్రత్యేక విశ్లేషణా కార్యక్రమంలో రవిశంకర్ కంఠంనేని, డోలేంద్ర ప్రసాద్.. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగ రక్షకుడిగా ఉండాల్సిన స్థానంలో కూర్చున్న ఒక న్యాయమూర్తి, పౌరులను ముఖ్యంగా దేశ యువతను పారసైట్లు, కాక్రోచ్లు అనడం అత్యంత దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు.
మొదట్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్లో ఉండటంతో టిడిపిలో లేరని, ఆ తర్వాత పార్టీలోకి వచ్చిన చంద్రబాబుకు ఎన్టీఆర్ జనరల్ సెక్రెటరీ పదవి ఇచ్చి పార్టీ పగ్గాలు అప్పగించారని తెలిపారు. చంద్రబాబు వచ్చిన కొత్తలో హైదరాబాద్ పరిధిలోని చదువుకున్న యువ నాయకుల వివరాలు సేకరించగా తన పేరు తెరపైకి వచ్చిందన్నారు.
సీనియర్ నాయకులను బుజ్జగించడానికి ఉప ముఖ్యమంత్రి పదవులను పంచుతుంటారు. గతంలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏకంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమించి రికార్డు సృష్టించారు. ప్రస్తుత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన, శక్తిమంతమైన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూ డైనమిక్ రోల్ పోషిస్తున్నారు.
దేశవ్యాప్తంగా తిరుగులేని ఆధిక్యంతో దూసుకుపోతున్న బీజేపీ.. చారిత్రాత్మకంగా దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తమిళనాడులో పాగా వేయడానికి ఎప్పటి నుంచో తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే ఇక్కడి ద్రవిడ రాజకీయాల ప్రభావం బలంగా ఉండటంతో కమలం ఆశించిన స్థాయిలో విస్తరించలేకపోయింది. ఈ క్రమంలోనే ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చిన అణ్ణామలై రూపంలో బీజేపీకి ఒక బలమైన ఆశాకిరణం లభించింది.
గతంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందే.. ఇచ్చిన హామీని కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పుడు గా నిలబెట్టుకుంది. అయితే, ఈ కొత్త పదవి, అదనపు బాధ్యతలు వైఎస్ షర్మిలకు ఒక వైపు సంతోషాన్ని కలిగిస్తున్నప్పటికీ, మరోవైపు ఆమె ముందు అనేక సవాళ్లను ఉంచబోతున్నాయి.
సుపు రంగు అనేది భూమి పుట్టినప్పటి నుండి ఉనికిలో ఉందనీ.. ఆ రంగు కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే సొంతం కాదని తేల్చి చెప్పారు.
Publish Date:May 31, 2026
తెలుగుజాతి మనుగడ ఉన్నంతకాలం తెలుగుప్రజల హృదయాల్లో అన్న ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలచిపోతారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.
Publish Date:May 29, 2026
గాంధీభవన్లో జరిగిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.