Publish Date:Oct 20, 2022
మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయిన వెంటనే చేసిన మొదటి పని ఏమిటంటే, సోనియా గాంధీతో అపాయింట్మెంట్ కోరడం. అంతకు ముందే తన విజయం అమ్మదయే అని ప్రకటించారు. సాధారణంగా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన ఖర్గేకు అడగ్గానే సోనియా అప్పాయింట్ మెంట్ ఇచ్చేయాలి. మామూలుగానే ఖర్గే వంటి విధేయులకు అడిగినప్పుడల్లా సోనియమ్మ అప్పాయింట్ మెంట్ ఇచ్చేస్తారు.
కానీ ఇప్పుడు తన ఆశీస్సులతో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఖర్గే కోరినా సోనియాగాంధీ అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదు. పార్టీ శ్రేణులు ఏమిటిది అంటూ నిబిడాశ్చర్యంలో మునిగిపోయారు. ఆ ఆశ్చర్యం నుంచి వారు తేరుకోకముందే.. వారు దిగ్భ్రమాశ్చర్యాలకు లోనయ్యే మరో సంఘటన జరిగింది. అదేమిటంటే సోనియాగాంధీ స్వయంగా నంబర్ 10, రాజాజీ మార్గ్ లోని ఖర్గే నివాసానికి చేరుకున్నారు. సాధారణంగా సోనియాగాంధీ ఎవరి నివాసానికీ వెళ్లరు.. ఎవరైనా సరే ఆమె నివాసానికి వచ్చి కలవాల్సిందే.
ఆ సంప్రదాయం మేరకే అధ్యక్షునిగా ఎన్నికైన వెంటనే ఆయన సోనియా ఆశీస్సులను అందుకోవడానికి అప్పాయింట్ మెంట్ కోరారు. అయితే సోనియా ఆయనకు అప్పాయింట్ మెంట్ నిరాకరించి.. స్వయంగా ఆమే ఖర్గే నివాసానికి చేరుకుని ఆయనకు అభినందనలు తెలిపారు. పార్టీ మాజీ అధ్యక్షురాలిగా, తాత్కాలిక అధ్యక్షురాలిగా కొత్త అధ్యక్షుడిని స్వయంగా వచ్చి అభినందించడం ద్వారా పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ లో మార్పుపై విస్పష్టమైన సందేశం ఇవ్వాలని సోనియా భావించారు.
పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గేకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి సోనియా స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి.. శ్రేణులకు ఇక ఆయన మార్గదర్శనంలో పని చేయాలన్న స్పష్టమైన సందేశాన్నిచ్చారని పరిశీలకులు చెబుతున్నారు. అద్యక్షుడెవరైనా రిమోట్ సోనియా చేతిలోనే అన్న భావన ఇకపై ఉండకూడదన్న సందేశాన్ని ఈ చర్య ద్వారా సోనియా ఇచ్చారని అంటున్నారు. సోనియాగాంధీ ఇకపై పార్టీ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ గా కొనసాగుతారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అలాగే పార్టీ పార్లమెంటరీ పార్టీ చీఫ్, రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేతగా మల్లిఖార్జున్ ఖర్గే స్థానంలో ఎవరిని నియమించాలన్నది సోనియా గాంధీ త్వరలో నిర్ణయిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా సోనియా స్వయంగా ఖర్గే నివాసానికి వచ్చి మరీ అభినందనలు తెలియజేయడంపై పార్టీ సీనియర్ నాయకుడు, అధ్యక్ష ఎన్నికలో ఖర్గే ప్రత్యర్థి అయిన శశిథరూర్ స్పందించారు. కాంగ్రెస్ లో స్పష్టమైన మార్పునకు ఇది సంకేతమని అభివర్ణించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/new-tradition-in-congress-sonia-reaches-kharge-residence-to-greet-him-39-145740.html
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.