Publish Date:Oct 20, 2022
పిల్లల్ని నర్సరీల్లో చేర్చడం ఈరోజుల్లో పరిపాటి. తల్లి ఉద్యోగరీత్యానో, పనుల ఒత్తిడివల్లనో సమయానికి పిల్లల్లి చూసుకోలేని పరిస్థితుల్లోనూ నర్సరీలో చేరుస్తున్నారు. వారికి చిన్నపాటి ఆటపాటలతో సరదాగా అక్కడివారు జాగ్రతగానూ చూసుకుంటుంటారు. అలాగని వదిలేసి ధైర్యంగా తల్లులు ఉండలేరు. ఏదో ఒక భయం వెన్నాడుతూనే ఉంటుంది. ఇంట్లో ఉన్నట్టు, ఇంట్లోవారు కనిపెట్టుకున్నట్టు అక్కడ కుదరదు గదా. చాలామంది పిల్లల్లో మన పిల్లవాడు! కొట్టుకుంటారు, గిచ్చుకుంటారు, ఏడుస్తారు, నానా రభసా ఉంటుందక్కడ. నర్సరీ క్లాసులు చూసుకునే టీచర్ చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నపాటి పొర పాటు కూడా పిల్లలకు ప్రమాదకరంగా మారవచ్చు. ఇదుగో యార్క్షైర్లో అలాంటి చిన్నప్రమాదమే జరిగింది.
ఏడిది పిల్లాడు జాక్. అతన్ని తన తల్లి దగ్గర్లోని ఒక నర్సరీలో చేర్చింది. వారు నిజానికి బాగానే చూసు కుంటూండేవారు. మొన్ననీ ఒక నర్సు చేసిన తప్పిదంతో పిల్లాడికి దాదాపు కన్నుపోయే ప్రమాదం వచ్చిపడింది. అందరూ ఆస్పత్రికి పరిగెత్తారు. అదృష్టవశాత్తూ కంటికి ఏమీ కాలేదు. ఫస్ట్స్టెప్స్ అనే నర్సరీలో పిల్లలంతా ఆడుతున్నారు. అక్కడ వాళ్ల సంరక్షకురాలు చక్కగా గోళ్ల అందం చూసుకుం టోంది. ఈమధ్య నకిలీ గోళ్లు కూడా వచ్చాయి. వాటిని పెట్టుకుంటోంది. అంతలో ఎటునించి వెళ్లాడో జాక్ ఆమె దగ్గరికి వెళ్లాడు. ఆమె తయారుచేసుకున్న జిగురులాంటి పదార్ధం గిన్నెలో అమాంతం చేయి పెట్టాడు. అది చూసి ఆ నర్సు వాడి చెయ్యి పట్టుకునేలోగానే వాడు లాగేసరికి అది కళ్లకి తగిలి కుడికన్ను వెంటనే ఎర్రగా అయి వాచింది. ఈమె భయంతో ఒణికింది. ఓర్నాయనో ఏదో అయ్యిందిరా అని. ఒక్క పొలికేక పెట్టింది.
వెంటనే పిల్లాడిని దగ్గర్లోని ఆస్పత్రికి తీసికెళితే పరీక్షచేసిన డాక్టర్లు మరేం ఫరవాలేదు కంటికేమీ కాలేదని చెప్పారు. రెండు రోజులు జాగ్రత్తగా చూసుకోమని జాక్ తల్లిదండ్రులకు చెప్పారు. ఆ నర్సరీ స్కూలు యాజమాన్యం ఆ నర్సుని తిట్టి బయటకి పంపేసింది. అంచేత.. పిల్లల్ని నర్సరీకి పంపామని మరీ ధైర్యం గా ఉండకండి.. అక్కడి పరిస్థితులు వాకబు చేస్తుండండి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nursery-accidentchild-rescued-from-eye-problem-39-145737.html
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.