Publish Date:Oct 20, 2022
పిల్లల్ని నర్సరీల్లో చేర్చడం ఈరోజుల్లో పరిపాటి. తల్లి ఉద్యోగరీత్యానో, పనుల ఒత్తిడివల్లనో సమయానికి పిల్లల్లి చూసుకోలేని పరిస్థితుల్లోనూ నర్సరీలో చేరుస్తున్నారు. వారికి చిన్నపాటి ఆటపాటలతో సరదాగా అక్కడివారు జాగ్రతగానూ చూసుకుంటుంటారు. అలాగని వదిలేసి ధైర్యంగా తల్లులు ఉండలేరు. ఏదో ఒక భయం వెన్నాడుతూనే ఉంటుంది. ఇంట్లో ఉన్నట్టు, ఇంట్లోవారు కనిపెట్టుకున్నట్టు అక్కడ కుదరదు గదా. చాలామంది పిల్లల్లో మన పిల్లవాడు! కొట్టుకుంటారు, గిచ్చుకుంటారు, ఏడుస్తారు, నానా రభసా ఉంటుందక్కడ. నర్సరీ క్లాసులు చూసుకునే టీచర్ చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నపాటి పొర పాటు కూడా పిల్లలకు ప్రమాదకరంగా మారవచ్చు. ఇదుగో యార్క్షైర్లో అలాంటి చిన్నప్రమాదమే జరిగింది.
ఏడిది పిల్లాడు జాక్. అతన్ని తన తల్లి దగ్గర్లోని ఒక నర్సరీలో చేర్చింది. వారు నిజానికి బాగానే చూసు కుంటూండేవారు. మొన్ననీ ఒక నర్సు చేసిన తప్పిదంతో పిల్లాడికి దాదాపు కన్నుపోయే ప్రమాదం వచ్చిపడింది. అందరూ ఆస్పత్రికి పరిగెత్తారు. అదృష్టవశాత్తూ కంటికి ఏమీ కాలేదు. ఫస్ట్స్టెప్స్ అనే నర్సరీలో పిల్లలంతా ఆడుతున్నారు. అక్కడ వాళ్ల సంరక్షకురాలు చక్కగా గోళ్ల అందం చూసుకుం టోంది. ఈమధ్య నకిలీ గోళ్లు కూడా వచ్చాయి. వాటిని పెట్టుకుంటోంది. అంతలో ఎటునించి వెళ్లాడో జాక్ ఆమె దగ్గరికి వెళ్లాడు. ఆమె తయారుచేసుకున్న జిగురులాంటి పదార్ధం గిన్నెలో అమాంతం చేయి పెట్టాడు. అది చూసి ఆ నర్సు వాడి చెయ్యి పట్టుకునేలోగానే వాడు లాగేసరికి అది కళ్లకి తగిలి కుడికన్ను వెంటనే ఎర్రగా అయి వాచింది. ఈమె భయంతో ఒణికింది. ఓర్నాయనో ఏదో అయ్యిందిరా అని. ఒక్క పొలికేక పెట్టింది.
వెంటనే పిల్లాడిని దగ్గర్లోని ఆస్పత్రికి తీసికెళితే పరీక్షచేసిన డాక్టర్లు మరేం ఫరవాలేదు కంటికేమీ కాలేదని చెప్పారు. రెండు రోజులు జాగ్రత్తగా చూసుకోమని జాక్ తల్లిదండ్రులకు చెప్పారు. ఆ నర్సరీ స్కూలు యాజమాన్యం ఆ నర్సుని తిట్టి బయటకి పంపేసింది. అంచేత.. పిల్లల్ని నర్సరీకి పంపామని మరీ ధైర్యం గా ఉండకండి.. అక్కడి పరిస్థితులు వాకబు చేస్తుండండి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nursery-accidentchild-rescued-from-eye-problem-39-145737.html
జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది.
ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు ద్వారంపూడిపై చర్యల తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి బండారాన్ని బట్టబయలు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్లో ద్వారంపూడికి ఉన్న పట్టును సడలించడం ద్వారా ఆయన ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి రాంబాబును కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ సమయంలో పోలీసు స్టేషన్లో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ అంబటి రాంబాబు తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ వంటి నేతలను అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆవేదనను వినాల్సింది పోయి, వారికి మద్దతుగా వస్తున్న విపక్ష నేతలపై ఆంక్షలు విధించడం దారుణమన్నారు.
రిలే దీక్షకు మద్దతుగా గ్రామానికి చేరుకోవాలని ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలు, కార్య కర్తలను పోలీసులు మార్గ మధ్యలోనే నిలిపివేస్తూ వెనక్కి పంపించేశారు. దీంతో పరిగి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చారిత్రాత్మక విజయం సిద్ధించిన రోజిదని పేర్కొన్నారు. అమరావతి రైతుల త్యాగాలకు దక్కిన న్యాయమన్నారు. అమరావతి ఇప్పుడు కేవలం నగరం కాదు, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని బాలకృష్ణ పేర్కొన్నారు.
జములమడుగులో ఊహించిన దానికంటే అత్యధికంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని వివరించారు. వైసిపి అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వైఖరిని తూర్పారబట్టారు.. ప్రజలను కన్ఫ్యూజ్ చేసి మేలు పొందాలని ప్రయత్నిస్తున్నారంటూ జగన్ పై విమర్శలు కురిపించారు. పకృతిలో పంచభూతాల కూడా తన అధీనంలోనే ఉన్నాయని చెప్పుకునే పెను భూతంగా ఆయన జగన్ రెడ్డిని అబివర్ణించారు.
ఈ కీలక పరిణామం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఐదు కోట్ల ఆంధ్రుల చిరకాల కోరిక నేడు నెరవేరిందని పేర్కొన్నారు. అమరావతి చట్టానికి ఆమోదం తెలిపి రాష్ట్ర భవిష్యత్తుకు భరోసానిచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రజల తరఫున ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ చట్ట సవరణకు ఆమోదముద్ర వేయడంతో, కేంద్ర న్యాయశాఖ తుది నోటిఫికేషన్ను జారీ చేసింది. ఈ పరిణామంతో అమరావతికి పూర్తిస్థాయిలో చట్టబద్ధత లభించినట్లయింది.
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.