Publish Date:Oct 14, 2025
దేశ వ్యాప్తంగా అందరిలోనూ ఉత్కంఠ రేపుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖారరయ్యాయి. రాష్ట్రంలో రెండు విడతలుగా పోలింగ్ జరుగుతుంది. వచ్చే నెల 6న తొలి విడత, 11న మలివిడత పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో ప్రధానంగా ఎన్డీయే, ఇండియా కూటముల మధ్యే పోరు ఉన్నా.. జనసురాజ్ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సైతం కీలక పాత్ర పోషించనున్నారన్న అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ బీహార్ పరిస్థితి, ప్రజల మొగ్గు ఏ కూటమి వైపు అన్న కోణంలో జరిగిన పలు సర్వేలు కూడా ప్రశాంత్ కిశోర్ కింగ్ మేకర్ గా అవతరించే అవకాశాలున్నాయనే పేర్కొన్నాయి. అటువంటి ప్రశాంత్ కిశోర్ ఎన్డీయే, ఇండియా కూటముల కంటే ముందే తన పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేశారు. విద్యావంతులు, మేధావులతో కూడిన ఆ జాబితా విస్మయ పరిచింది. రాజకీయ నేపథ్యం ఇసుమంతైనా లేనివారికే ఆయన తొలి జాబితాలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి టికెట్లు కేటాయించారు. అదలా ఉంచితే..
అధికారంపై ధీమా వ్యక్తం చేస్తున్న ఎన్డీయే, ఇండియా కూటములు మాత్రం పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు విషయంలో మల్లగుల్లాలు పడుతున్నాయి. అసమ్మతులను బుజ్జగించి జాబితాలను ప్రకటించడానికి నానా తంటాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్డీయేలో సీట్ల సర్దుబాటు సోమవారం (అక్టోబర్ 13) నాటికి ఓ కొలిక్కి వ చ్చింది. ఆ సర్దుబాటు ప్రకారం రాష్ట్రంలోని మొత్తం 243 నియోజకవర్గాలకు గాను కూటమిలో ప్రధాన భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జేడీయూలు చెరో 101 స్థానాలలోనూ పోటీ చేయనున్నాయి.
సద్దుబాటులో భాగంగా కూటమి భాగస్వామ్య పక్షమైన చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్-విలాస్)కి 29 సీట్లు కేటాయించారు. మాజీ ముఖ్యమంత్రి జితన్రామ్ మాంఝీకి చెందిన హిందుస్థానీ అవామ్ మోర్చా (సెక్యులర్) , రాజ్యసభ ఎంపీ ఉపేంద్ర కుష్వాహాకు చెందిన రాష్ట్రీయ లోక్మోర్చా కు చెరో ఆరు సీట్లు కేటాయించారు. ఎన్డీయే కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం సజావుగా పూర్తయ్యిందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ థృవీకరించారు. ఇక ఇండియా కూటమి సీట్ల సర్దుబాటు వ్యవహారం నేడో రేపో కొలిక్కి వచ్చే అవకాశం ఉందంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nda-seats-adjustment-betwwn-allaence-parties-completed-39-207891.html
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండేళ్లయిన ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.
అన్నదమ్ములు, తల్లీ కుతుళ్లు, తోడికోడళ్లు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి సై సంటే సై అంటున్న ఉదంతాలూ ఉన్నాయి.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఒకే వార్డు నుంచి తల్లి, కూతురు నామినేషన్లు వేశారు.
తెలుగు వన్. దక్షిణాదిలో మాత్రమే కాదు యావత్ భారత దేశంలోనే యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లో తొలి వీడియో అప్ లోడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్. డిజిటిల్ మీడియా రంగంలో తెలుగు వన్ తన పాతికేళ్ల ప్రస్థానంలో చేయని ప్రయోగముందా? అన్న పేరుంది.