జాతీయ బాలికల దినోత్సవం.. ఆడపిల్లల భవితకు ఓ చేయూత..!

Publish Date:Jan 24, 2026

Advertisement


ఆడపిల్ల ఇంటికి వెలుగు అంటారు. ఆడపిల్ల ఇంట్లో ఉండే  మహాలక్ష్మి ఇంట్లో ఉన్నట్టే అని కూడా అంటారు. అయితే కొన్ని దశాబ్దాల క్రితం ఆడపిల్ల పుడితే పురిట్లోనే చిదిమేసేవారు,  ఇంకొందరు బ్రూణ హత్యలు చేయించేవారు.  ఈ కారణాల వల్ల ప్రస్తుతం మగపిల్లలతో పోలిస్తే ఆడపిల్లల నిష్పత్తి తక్కువగా ఉంది.  పెళ్లిళ్ల కోసం ఆడపిల్లలు కరువయ్యారు అంటూ పెద్దలు మొరపెట్టుకుంటున్నారు.  అయితే ఆడపిల్లల గురించి, వారి భవిత గురించి ఆలోచించి వారి అబివృద్ది కోసం ప్రతి ఏడాది జనవరి 24వ తేదీన జాతీయ బాలికల దినోత్సవం జరుపుకుంటున్నారు,  బాలికల హక్కులు,  వారి భద్రత,  విద్య,  ఆరోగ్యం వంటి అంశాలపై సమాజంలో అవగాహన కల్పించేందుకే ఈ రోజును జరుపుకుంటారు.  ఈ రోజు గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..

జాతీయ బాలికల దినోత్సవం..

2008 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఈ దినోత్సవాన్ని అధికారికంగా ప్రారంభించింది. మహిళా,  శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (Ministry of Women and Child Development), భారత ప్రభుత్వం కలిసి ఉమ్మడిగా ఈ రోజును జరుపుకోవాలని పిలుపు ఇచ్చింది.

జనవరి 24నే ఎందుకు..

ఈ తేదీకి ప్రత్యేకమైన చారిత్రక సంఘటన ఏమీ లేదు. కానీ బాలికల హక్కులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టేందుకు, సంవత్సర ఆరంభంలోనే సమాజానికి ఒక బలమైన సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ తేదీని ఎంపిక చేశారు.

 ఎందుకు జరుపుకుంటారు..

సమాజంలో బాలికలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా.. బాల్యవివాహాలు,  శిశుహత్యలు, లింగ వివక్షత,  బాలికల విద్యకు అవకాశాల లోపించడం,  ఆరోగ్యం, పోషణలో నిర్లక్ష్యం వంటి సమస్యలు ఎక్కువగా ఉండేవి.  ఈ సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించి, బాలికలకు సమాన హక్కులు, గౌరవం, అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

ప్రధాన లక్ష్యాలు..

బాలికలపై జరుగుతున్న వివక్షను తగ్గించడం, బాలికల విద్యను ప్రోత్సహించడం, బాల్యవివాహాలు, ఆడ పిల్లలను పురిటిలో లేదా కడుపులోనే హత్య చేయడం,   వంటి  దారుణమైన కార్యకలాపాలను  అరికట్టడానికి,  బాలికల ఆరోగ్యం, భద్రతపై దృష్టి పెట్టడానికి  తగినట్టు కార్యాచరణ చేయడమే ఈ రోజు ప్రధాన లక్ష్యాలలో భాగంగా ఉంటుంది.  అదేవిధంగా.. బాలికలు కూడా సమాజానికి ఒక బలం అనే భావనను పెంపొందించడం దీని లక్ష్యం.

ఎలా జరుపుకుంటారు..

పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం.  వ్యాసరచన, ప్రసంగ పోటీలు, బాలికల హక్కులపై చర్చలు, ర్యాలీలు.  ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం. బాలికలను ప్రోత్సహించే  కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఈ రోజును జరుపుకుంటారు.

బాలికల గౌరవం, హక్కులు, భవిష్యత్తుపై దేశంలోని ప్రతి ఒక్కరి  బాధ్యతను గుర్తు చేసే రోజు ఇది.   ముఖ్యంగా ఆడపిల్ల చదువు బారం  అనే రోజు నుండి బాలిక చదువుకుంటే  దేశం అభివృద్ధి చెందుతుంది అని దేశం మొత్తం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఇలాంటి రోజులను నిర్వహిస్తూ ప్రజలలో అవగాహన కల్పించడం వల్లే వచ్చింది. బాలికల చదువును ప్రోత్సహించి, వారి రక్షణ చూసుకోవాల్సిన బాధ్యత దేశ పౌరుల మీద ఖచ్చితంగా ఉంటుంది.

                           *రూపశ్రీ.

By
en-us Political News

  
భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త , గొప్ప ఆర్థికవేత్త అయిన డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి జయంతి...
ఆశా భోస్లే.. భారతీయ సంగీత ప్రపంచంలో ఒక చెరగని ముద్ర.  ఆమె గాత్రం కేవలం భారతదేశాన్నే కాకుండా ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించింది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కు సోదరి అయినా.. పాటల ప్రపంచంలో..
సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. నేటి బిజీ బిజీ జీవితాలలో మనస్ఫూర్తిగా,  సంతోషంగా గడిపిన క్షణాలు వెతుక్కోవాల్సి వస్తోంది. అందరూ ఉద్యోగాలు చేస్తారు,  వ్యాపారాలు చేస్తారు, సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు....
ప్రపంచంలో అన్ని రకాల మనుషులు  ఉంటారు.  మనుషులకు ఒక్కొక్కరికి ఒక్కో వ్యక్తిత్వం కూడా ఉంటుంది. ప్రపంచంలోని గొప్ప వ్యక్తులను లేదా మన చుట్టూ ఉండే గొప్ప వ్యక్తులు లేదా శక్తివంతమైన వ్యక్తులను గమనిస్తే...
విజయం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక లక్ష్యంగా ఉంటుంది.  చదువు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ప్రతి విషయంలో ఒక లక్ష్యం పెట్టుకుని,  దాన్ని సాధించి,  విజయ బావుటా ఎగరవేయాలని అనుకుంటారు చాలా మంది...
మంచి, చెడు ప్రతి మనిషిలోనూ తప్పకుండా ఉండే గుణాలు.  మనుషులు కొన్ని విషయాల్లో మంచిగా, మరికొన్ని విషయాల్లో చెడ్డగా ఉంటారు. పూర్తీగా మంచితనం ఉన్న మనుషులు, పూర్తీగా చెడ్డగా ఉన్న మనుషులు ఎక్కడా ఉండరు...
అపరాజిత లేదా శంఖు పుష్పాలు నీలం ,  తెలుపు రంగులో ఉంటాయి.  ఈ పువ్వులు  చాలా అందంగా ఉంటాయి. శంఖు పుష్పం మొక్కను దేవతా మొక్కగా పరిగణిస్తుంటారు.  ఈ పువ్వులు  సంతోషం, శ్రేయస్సు,  సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. వేసవిలో...
వేసవి వచ్చేసింది, తీవ్రమైన ఎండ , మండే ఎండలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి.  ఈ ఎండల ఇబ్బందికి తోడు వేసవిలో కరెంట్ కోత కూడా దారుణంగా ఉంటుంది. దీనివల్ల ఇంట్లో ఉండటం చాలా కష్టమవుతుంది.
గుడ్ ఫ్రైడే క్రైస్తవ మతంలో అత్యంత పవిత్రమైన,  భావోద్వేగభరితమైన రోజు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రైస్తవులు యేసు క్రీస్తు శిలువపై మరణించిన సంఘటనను స్మరించుకుంటారు...
పిల్లలను సరిగ్గా పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. ఒక చిన్న పొరపాటు కూడా పిల్లల జీవితాన్ని నాశనం చేయగలదు. సరైన పెంపకం పిల్లలను విజయ శిఖరాలకు చేరుస్తుంది అనడంలో  ఎలాంటి సందేహం లేదు...
నేటి డిజిటల్ ప్రపంచంలో, పిల్లలకు, ముఖ్యంగా టీనేజర్లకు చదువుకునేటప్పుడు ఏకాగ్రత పెట్టడం చాలా కష్టంగా మారుతోంది. స్మార్ట్‌ఫోన్‌లు, గేమ్‌లు, సోషల్ మీడియా,  మరెన్నో విషయాలు వారి చదువుకు చాలా..
వేసవికాలం అలా రాగానే.. అందరికీ చల్లదనం కావాలని అనిపిస్తుంది.  పడుకోవడానికి గది చల్లగా ఉండాలి.. దుకోసం కూలర్లు, ఏసీలు రెఢీ చేసుకుంటారు. అలాగే చల్లగా నీరు తాగాలని అనిపిస్తుంది.  నేటికాలంలో ప్రతి ఇంట్లో ఫ్రిజ్ లు ఉండటం సహజమే అయినా ఫ్రిజ్ లో ఉంచిన నీరు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతుంటారు...
జైనమత 24వ తీర్థంకరుడు మహావీరుడు ఆధ్యాత్మికత ద్వారా తన జీవితాన్ని మార్చుకున్నాడు. యువరాజు వర్ధమానుడు  తన సాధన,  ఆధ్యాత్మిక మార్గం ద్వారా  మహావీరుడిగా  పరివర్తన చెందాడు.  అయితే ఇలా పరివర్తన చెందడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.