అంతరిక్షంలో.. మరో అద్భుతం !

Publish Date:Jun 17, 2025

Advertisement

 

 

అంతర్జాతీయ అంతరిక్ష సహకారంలో మరో మహోత్తర ఘట్టం ఆవిష్కరణ సమయం ఆసన్నమైంది. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా), భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), జూన్ 18న తమ మొదటి ఉమ్మడి ఉపగ్రహ మిషన్, నిసార్ (నాసా-ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్) ను చెన్నై శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించనున్నాయి. ఇది, భూఉపరితలంపై జరిగే చిన్న పెద్ద మార్పులను అత్యంత ఖచ్చితత్వంతో గుర్తించడానికి అత్యాధునిక, సింథటిక్ ఎపర్చర్ రాడార్ వ్యవస్థతో అనుసంధానం చేయబడిన అసాధరణ ఉపగ్రహ ప్రయోగం, నిసార్  ఉపగ్రహ ప్రయోగం. 

నిసార్’ ఉపగ్రహం వాతావరణ మార్పుల అవగాహన, పరిష్కారానికి అత్యవసరమైన, భూ ఉపరితల పర్యావరణం, ప్రకృతి వైపరీత్యాలు, సముద్ర మట్టం ఎదుగుదల, భూగర్భజలాలు, హిమానీనదాలకు (గ్లోసరీస్)కు సంబందించిన,సంక్లిష్ట సమాచారాన్ని, అత్యంత ఖచ్చితత్వంతో సేకరించడమే, ఈ  మిషన్ ప్రధాన లక్ష్యం. ఈ రాడార్ నాసా అత్యాధునిక ఎల్ – బ్యాండ్ సింథటిక్ అపెట్రూర్ ఎపర్చర్’ రాడార్’( ఎస్ఎఆర్), ఇస్రో ఎస్- బ్యాండ్ రాడార్’ల సంయుక్త కృషి ఫలితం. అందుకే, దీన్ని, ‘నాసా-ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్’ గా వ్యవాహరిస్తున్నారు. 

ఈ రాడార్ వ్యవస్థలోని డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సామర్ధ్యం, శాస్త్ర వేత్తలు భూమి ఉపరితలం పై ప్రతి సెంటీ మీటర్ పరిమాణం వరకు జరిగే  మార్పులను గుర్తించేందుకు తద్వారా, భూకంపాలు, అగ్ని కీలల విస్పొటనాలు, మంచు చరియలు విరిగే పడే ప్రమాదాలను ముందుగానే పసిగట్టేందుకు ఉపకరిస్తుంది. కాగ,ఇస్రో సీనియర్ అధికారి ఒకరు, ‘ఇది రెండు ప్రపంచ ప్రసిద్ద అంతరిక్ష సంస్థల మధ్య కుదిరిన ఒక చారిత్రిక భాగస్వామ్యం’గా పేర్కొన్నారు.అలాగే, ‘భూమండలం ఎదుర్కుంటున్న, అత్యంత ప్రధాన సవాళ్ళను అర్థం చేసుకోవడంతో పాటుగా, పరిష్కార స్పందనలో మార్పులకు నిసార్ ఉపగ్రహం సహాయ పడుతుందని, అన్నారు. ఈ ఉపగ్రహాన్ని, ఇస్రో – జీఎస్ఎల్వీ ఎంకే 2 రాకెట్  ద్వారా ప్రయోగిస్తారు. 

ఉపగ్రహం కక్షలో ప్రవేశించిన తర్వాత, ప్రతి 12 రోజులకు ఒక సారి భూమిని చుట్టి వస్తుంది. శాస్త్ర వేత్తలు మొదలు విధాన నిర్ణేతలు, విపత్తు నిర్వహణ సంస్థలు, వరకు అనేక మందికి,  అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది.,  నిసార్’ కేవలం ఒక శాస్త్రీయ అద్భుతం, సాకేతిక మైలు రాయి మాత్రమే కాదు, భారత్, అమెరికా దేశాల మధ్య పెరుగుతున్న అంతరిక్ష , సాంకేతిక సహకారానికి ఓ చిహ్నం. ఈ మిషన్, భూ పర్యవేక్షణ, విపత్తు నివారణలో ప్రపంచ సామర్ధ్యాన్ని గణనీయంగా పెంచుతుంది.  ఈ దశాబ్దపు అత్యంత ప్రధానమైన, ఎర్త్ సైన్సు మిషన్’ గా భావిస్తున్న నిసార్ ప్రయోగం కౌంట్ డౌన్ ప్రారంభమైన నేపధ్యంలో, ఉభయ దేశాల్లో అంచానాలు ఎగసి పడుతున్నాయి.


 

By
en-us Political News

  
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
యాక్సిస్ మై ఇండియాతన అంచనాలలో తృణమూల్ కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టింది. ఈ సంస్థ అంచనా ప్రకారం టీఎంసీ 165 నుంచి 185 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండగా.. బీజేపీ 95 నుంచి 110 స్థానాలకే పరిమితం కావచ్చని ఆ సర్వే ఫలితం పేర్కొంది. ఇక సీ-ఓటర్ సర్వే కూడా మమతా బెనర్జీపైనే బెంగాల్ ప్రజలు విశ్వాసం ఉంచారని పేర్కొంది.
పదవి వచ్చిందనే అహంకారం వద్దనీ, అందరినీ కలుపుకుని ముందుకుసాగాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.
బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.