పప్పు కాదు పవర్ ఫుల్ లీడర్! వైసీపీని షేక్ చేస్తున్న లోకేష్ 

Publish Date:Jan 22, 2021

Advertisement

ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చేవారు కొందరు.. సంపాదనే పరమావధిగా పాలిటిక్స్ చేసేవారు మరికొందరు. ప్రస్తుత రాజకీయాల్లో మొదటి రకంలో  కొందరే ఉంటారు. అలాంటి వారిలో టాప్ గా నిలుస్తారు నారా లోకేష్. ప్రజలకు సేవ చేయాలనే ఆశయంతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన లోకేష్.. ఎమ్మెల్సీగా, మంత్రిగా, టీడీపీ ప్రధాన కార్యదర్శిగా అనునిత్యం ప్రజల కోసమే పని చేస్తూ అందరి నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. వైసీపీ నేతలు తనను పప్పు పప్పు అని అవహేళన చేస్తున్నా .. ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రజా సేవలో ముందుంటూ తానొక ఫర్ ఫెక్ట్ లీడరని నిరూపించుకున్నారు.  
         
తండ్రి ఎమ్మెల్యే అయితేనే అక్రమ దందాలు చేస్తూ అతని కుటుంబ సభ్యులు కేసుల్లో చిక్కుకునే కాలమిది.  తండ్రి వైఎస్ సీఎం అయితే ఆ అధికారాన్ని అడ్డుపెట్టుకుని 43 వేల కోట్లు ప్ర‌జాధనం దోచుకుని 31 కేసులు ఎదుర్కొంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్న వ్య‌క్తి వైఎస్ జ‌గ‌న్‌రెడ్డి. కాని తాత, తండ్రి ముఖ్యమంత్రులుగా సుదీర్ఘ కాలం పనిచేసినా.. నారా లోకేష్‌పై ఇప్పటివరకు ఒక్క కేసు లేదు. తాత  తార‌క‌రామారావు ఆరేండ్లు, తండ్రి చంద్ర‌బాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్నాప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల‌లో త‌ల‌దూర్చ‌లేదు. అందుకే  ఒక్క కేసులేని మిస్టర్ ఫర్ ఫెక్ట్ గా ఉన్నారు చినబాబు. జగ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం వ‌చ్చాక  ఏదో ఒక కేసు పెట్టాల‌ని చూసినా వారి కుట్రలు ఫలించలేదు. ఇసుక సైట్ హ్యాక్ చేశార‌ని, డేటా చోరీ అంటూ చిల్లర ప్ర‌య‌త్నాలు చేసి విఫ‌ల‌మయ్యారు.చివ‌రికి అజాగ్ర‌త్త‌గా ట్రాక్ట‌ర్ న‌డిపార‌ని, కోవిడ్ నిబంధ‌న‌లు ఉల్లంఘించార‌ంటూ  లోకేష్ పై  కేసులు బ‌నాయించి కామెడీ పీసైపోయారు 
సర్కార్  రెడ్డి పోలీసులు.  

మంత్రిగా  పనిచేసి రూపాయి అవినితి ఆరోప‌ణ‌లు నారా లోకేష్ పై రాలేదు‌. అంతేకాదు తన పనితీరుతో ఏపీని దేశంలోనే టాప్ లో నిలిపారు. పంచాయతీ రాజ్, ఐటీ శాఖలను లోకేష్  నిర్వహించగా.. ఈ రెండు శాఖలకు కేంద్రం నుంచి ఎన్నో అవార్డులు, రివార్డులు లభించాయి. నారా లోకేష్ డైరెక్షన్ లోనే ఈ ఘనత సాధించామని అధికారులే స్వయంగా ప్రకటించారు. ఉపాధి హామీ పథకంలో ఎక్కువ పనిదినాలు కల్పించి పేదలకు బాసటగా నిలిచారు నారా లోకేష్. అవినీతి అంతమే లక్ష్యంగా పని చేస్తూ.. ప్రత్యర్థి పార్టీల వైఫల్యాలను ఏకరవు పెడుతూ వారికి కొరకరాని కొయ్యలా మారారు నారా లోకేష్. 

టీడీపీకి కులం రంగు అంటించి విష‌ప్ర‌చారం చేస్తోంది వైసీపీ. అయితే లోకేష్ ను దగ్గరనుంచి చూసిన వారికి తెలుసు అతను ఏమాత్రం క్యాస్ట్ పట్టింపులేని వజ్రమని. ప్రస్తుత సీఎం జగన్ కార్యాలయంలో ఆఫీస్ బాయ్ నుంచి అధికారుల వరకు అంతా ఒకే కులం. సీఎంవో మొత్తం ఆయన  సామాజిక‌వ‌ర్గ‌మే.  నారా లోకేష్ మంత్రిగా ఉన్నప్పుడు మాత్రం ఆయన దగ్గర పనిచేసిన వారంతా ఇతర సామాజిక వర్గాల వారే.  పంచాయ‌తీరాజ్ శాఖ  కార్య‌ద‌ర్శిగా జ‌వ‌హ‌ర్‌రెడ్డి, గ్రామీణ‌నీటిస‌ర‌ఫ‌రా శాఖలో 
భ‌ర‌త్‌గుప్తా, స్వ‌చ్ఛ‌భార‌త్ కార్పొరేష‌న్ ఎండీ గా  ముర‌ళీధ‌ర్‌రెడ్డి ఉండేవారు. ఐటీ శాఖలో జ‌య‌చంద్రారెడ్డి, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ రామాంజనేయులు (ఎస్సీ) మంత్రి కార్యాల‌యంలో ఓఎస్‌డీగా  రంజిత్ భాషా(ముస్లిం), శ్రీనివాస్ (బీసీ),  పీఎస్ అర్జున్ (ఎస్సీ) ప్రైవేట్ పీఏ న‌రేష్ (గౌడ‌) పీఆర్వోగా  చైత‌న్య‌రెడ్డి పని చేశారు. లోకేష్ ఐటీ  మేనేజ‌ర్ గా శ్రీనివాస్ (బ్రాహ్మిన్‌). వ్య‌క్తిగ‌త ఫిట్‌నెస్ ట్రైన‌ర్ జిజూ జోసెఫ్ (క్రిస్టియ‌న్ కేర‌ళ‌) ప‌ర్స‌న‌ల్ డ్రైవ‌ర్ స‌తీష్ (ఎస్సీ). ఇలా ప్ర‌భుత్వం ఇచ్చిన  ప్రైవేట్ సెక్యూరిటీలోనూ నారా లోకేష్ కులం వారు ఒక్క‌రూ లేరు. 

నారా లోకేష్‌ కు తెలుగు మాట్లాడటం రాదని ఎక్కువగా విమర్శిస్తూ ఉంటారు. తాను చిన్న‌ప్ప‌టి నుంచి ఇంగ్లీషు మీడియం కావ‌డం వ‌ల్ల తెలుగు మాట్లాడేట‌ప్పుడు త‌డ‌బ‌డ‌తాన‌ని నిజాయితీగా ఒప్పుకున్నారు లోకేష్. పదాలు తడబడుతున్నా.. ప్రత్యర్థి పార్టీలు వాటినే వైరల్ చేస్తూ శునకానందం పొందుతున్నా.. ఆయన ప్రజాబాట మరవలేదు. లైవ్‌లో మాట్లాడ‌టం ఆపేయ‌లేదు. మీడియా మిత్రుల‌ని కూడా ఏమైనా ప్ర‌శ్న‌లున్నాయా అంటూ అడిగి మ‌రీ ప్రెస్‌మీట్లు ముగిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డి రాసిచ్చిన స్క్రిప్ట్ చ‌ద‌వ‌లేక  తెలుగుని ఖూనీ చేస్తూనే వున్నాడు. చివ‌రికి లైవుల్లో దొరికిపోతున్నామ‌ని రికార్డెడ్‌కి వెళ్లి అక్క‌డా త‌ప్పుడు లెక్క‌లు, ప‌దాల్ని ప‌ల‌క‌లేక నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. ప‌ప్పు అని జ‌గ‌న్‌రెడ్డి అండ్ కో గేలి చేసిన నారా లోకేష్ ప్ర‌జ‌ల్లో వుంటూ, లైవుల్లో పంచ్ డైలాగులు విసురుతుంటే..  జ‌గ‌న్‌రెడ్డి మాత్రం మీడియా ముందుకి కూడా రాలేక తాడేప‌ల్లి నుంచి రికార్డెడ్ ప్రెస్‌మీట్లు వ‌దులుతూ జీరో అయిపోయారు. 
 
తెలుగుదేశం పార్టీకి స‌మాజ‌మే దేవాల‌యం..ప్ర‌జ‌లే దేవుళ్లు. టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌కి తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌లే కుటుంబం. తమ్ముళ్ల  కోసం లోకేష్‌ ఆలోచ‌న‌ల కార్య‌రూపమే కార్య‌క‌ర్త‌ల సంక్షేమ నిధి. జెండా మోసే కార్య‌క‌ర్త‌కి అండ‌గా నిలిచేందుకు నారా లోకేష్ ఆరంభించిన ఈ విభాగం ఇప్పటికే వేలాది కుటుంబాల‌కు చేయూత‌నిచ్చింది.  టిడిపి స‌భ్య‌త్వం తీసుకున్న 80 ల‌క్ష‌ల‌మంది కార్య‌క‌ర్త‌ల‌కు బీమా ప్రీమియం క‌ట్టి, వారి భ‌ద్ర‌త‌కు భ‌రోసానిచ్చారు నారా లోకేష్‌. ఎటువంటి ఆర్థిక ఆస‌రాలేని సీనియ‌ర్ కార్య‌క‌ర్త‌ల‌కు ప్రతి నెలా  1500 వారి ఖాతాల్లో వేస్తూ చేదోడుగా నిలుస్తున్నారు లోకేష్‌. నిరుపేద టీడీపీ కార్య‌క‌ర్త‌లు, ప్ర‌త్య‌ర్థి పార్టీల దాడుల్లో చ‌నిపోయిన కార్య‌క‌ర్త‌ల పిల్ల‌ల‌కు ఎన్టీఆర్ మోడ‌ల్‌ స్కూల్లో ఉచిత విద్య‌నందిస్తున్నారు. నిరుపేద‌లైన కార్య‌క‌ర్త‌ల వైద్య‌, విద్య‌, వివాహ అవ‌స‌రాల‌కు సంక్షేమ నిధి నుంచి  సాయం అందిస్తున్నారు. ప్రాణాంత‌క క్యాన్స‌ర్ సోకిన పార్టీ కుటుంబ స‌భ్యుల‌కు బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌‌త్రిలో చికిత్స ఇప్పిస్తున్నారు. పేద కార్య‌క‌ర్త‌ల పిల్ల‌ల‌ వివాహాలకు పార్టీ నుంచి పెళ్లికానుక  అందిస్తున్నారు నారా లోకేష్. 

పార్టీ కార్య‌క‌ర్త‌ల్ని కుటుంబ‌స‌భ్యుల్లా భావించి వారి సంక్షేమానికి పాటుప‌డుతూ కార్య‌క‌ర్త‌ల పాలిట పెన్నిధిగా నిలుస్తున్న నారా లోకేషే అస‌లు సిస‌లు ప్ర‌జానాయ‌కుడని రాజకీయ అనలిస్టులు చెబుతున్నారు. ప్రజలే దేవుళ్లని భావించే కుటుంబం నుంచి వచ్చిన లోకేష్.. వాళ్ల స్పూర్తిని, వారసత్వాన్ని కొనసాగిస్తూ.. అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు. కొద్ది కాలంలోనే రాజకీయంగా రాటు దేలి, ప్రజా సేవలో ఆదర్శంగా నిలుస్తూ.. అవినీతికి అంతమే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఏపీకి భవిష్యత్ ఆశాకిరణంలా మారిపోయారు చినబాబు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.