లోకేశ్ 'ది లీడర్'.. దమ్మున్నోడు.. త‌గ్గేదేలే వ‌దిలేదేలే..

Publish Date:Apr 29, 2022

Advertisement

‘పోగొట్టుకున్న చోటే వెతకాలి’ ఇది పెద్దలు చెప్పిన మాట. కానీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ వెతకడమే కాదు ఏకంగా వేట మొదలెట్టేశారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంపై ఆయన పూర్తి పట్టు సాధించడం కోసం తీవ్రంగా కృషిచేస్తున్నారు. ప్రతినిత్యమూ ప్రజల మధ్యనే ప్రజల్లోనే ఉండి ప్రజా సమస్యలపై తక్షణమే స్పందిస్తున్నారు. జగన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ సర్కార్ హయాంలో ఏపీ వ్యాప్తంగా ప్రజలకు ఎక్కడ ఏ సమస్య ఎదురైనా వేగంగా స్పందిస్తున్నారు. బాధిత ప్రజలకు మద్దతుగా నిలుస్తున్నారు. అందుకే, లోకేశ్ దూకుడు వైసీపీకి ముచ్చెమటలు పట్టిస్తోంది. చినబాబు తుమ్మపూడిలో అడుగుపెడితే.. ఆర్కే అనుచ‌రులు రాళ్ల దాడికి ప్ర‌య‌త్నించారు. ఎస్ఐ త‌ల‌ప‌గ‌ల‌గొట్టారు. ఇలా రౌడీల్లా రెచ్చిపోతే.. కుక్క‌ల్లా మొరిగితే.. లోకేశ్ భ‌య‌ప‌డిపోతార‌ని అనుకున్న‌ట్టున్నారు. కానీ, అక్క‌డ ఉన్న‌ది నారా లోకేశ్‌. రాళ్ల దాడి జ‌రిగినా.. అద‌ర‌లేదు.. బెద‌ర‌లేదు. బాధిత కుటుంబాన్ని ప‌రామ‌ర్శించి.. రాళ్ల దాడిపై అదే రేంజ్‌లో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. న్యాయం జ‌ర‌గ‌క‌పోతే 15 రోజుల్లో మ‌ళ్లీ వ‌స్తానంటూ స‌వాల్ చేశారు. ద‌టీజ్ లోకేశ్‌. 

లోకేష్ తన స్లైల్ మార్చారు. ప్రసంగాల్లో వాడీ వేడీ పెంచారు. అధికార పార్టీపైన నిశితంగా విమర్శలు చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై మరింత అవగాహనతో మాట్లాడుతున్నారు. ‘సమయం లేదు మిత్రమా… ఇంకా రెండేళ్లే ఉంది.. ప్రజల్లోకి వెళ్లాలి’ అంటూ వచ్చే ఎన్నికలకు టీడీపీ శ్రేణులను సమాయత్త పరుస్తున్నారు. చినబాబు లోకేష్ స్పీడును చూసి టీడీపీ శ్రేణులే అవాక్కవుతున్నాయి. మా చినబాబు కెవ్వు కేక అంటూ సంబరపడిపోతున్నారు.

చినబాబు లోకేష్ చాలా రోజులుగా నిత్యం మంగళగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. నియోజకవర్గం ప్రజల కష్టనష్టాల గురించి తెలుసుకుంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై తీక్షణమైన విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజా సమస్యలపై తాము పోరాటం చేస్తుంటే.. ఎమ్మెల్యేగిరీ చేతిలో పెట్టుకుని ఆళ్ల కొన్ని ఫొటోలకు ఫోజులిచ్చి వెళ్లిపోతున్నారని నిప్పులు చెరుగుతున్నారు. నియోజకవర్గం ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఆళ్ల విఫలమైన వైనాన్ని జనానికి అర్థమయ్యేలా చెబుతున్నారు. చంద్రబాబు లాంటి విజనరీ కావాలా? జగన్ లాంటి ప్రిజనరీ కావాలా? ప్రజలే నిర్ణయించుకోవాలని అంటున్నారు. జనరంజకంగా పాలన సాగించిన రాముడు లాంటి చంద్రబాబు కావాలా? నిత్యావసర వస్తువుల ధరలు పెంచుకుంటూ పోతున్న రాక్షసుడు లాంటి జగన్ కావాలా? నిర్ణయించుకోండంటున్న లోకేష్ మాటలు జనంలోకి బాగా వెళుతున్నాయి.

ప్రజా సమస్యలపై వేగంగా స్పందిస్తున్న లోకేష్ జంగారెడ్డిగూడెం కల్తీసారా మరణాలపై వైసీపీ సర్కార్ ను దుమ్మెత్తిపోశారు. రాజకీయ లబ్ధి కోసం తల్లిని, చెల్లిని పక్క రాష్ట్రానికి తరిమేసిన జగన్ కు నవ్వుతూ అబద్ధాలాడడం అలవాటంటూ తూర్పారపడుతున్నారు. సొంత బ్రాండ్లతో జనం జేబులు, ఆరోగ్యాలను గుల్ల చేస్తున్న వైసీపీ సర్కార్ తీరును ఎద్దేవా చేస్తూ జగన్ రెడ్డి చిత్రపటానికి మద్యంతో అభిషేకం చేయడం అందర్నీ ఆకర్షించింది. జేబ్రాండ్ మద్యం మరణాలపై న్యాయ విచారణకు లోకేష్ డిమాండ్ చేశారు.

పెగాసస్ సాఫ్ట్ వేర్ ను టీడీపీ హయాంలో కొనుగోలు చేసి ఉంటే నిరభ్యంతరంగా తమపై చర్యలు తీసుకోవచ్చని జగన్ సర్కార్ ను ఛాలెంజ్ చేస్తున్నారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని టీడీపీ విధానం అని చెబుతూనే.. అభివృద్ధి వికేంద్రీకణ జరగాలని, పరిపాలన కేంద్రీకృతంగా ఉండాలని చెబుతున్నారు. ఏపీ రాజధానిని మూడు ముక్కలాటగా మార్చేసిన జగన్ సర్కార్ తీరుపై లోకేష్ చెప్పిన ఈ మాటలు ఆయన పరిపక్వతకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మూడేళ్లలో ఒక్క పరిశ్రమను తీసుకురాలేని వైసీపీ.. ఇప్పుడు జిల్లాల విభజన చేస్తే అభివృద్ధి జరుగుతుందా? అని ఘాటుగా ప్రశ్నించారు. విశాఖను రాబందుల్లా వైసీపీ నేతలు పీక్కు తింటున్నారని దుమ్మెత్తిపోశారు. వైసీపీ కబ్జా కోరల నుంచి విశాఖను రక్షించుకుందామని లోకేష్ పిలుపునివ్వడమే కాకుండా.. బాధితులకు అండగా తాము ఉంటమని భరోసా ఇస్తున్నారు.

ఏపీలో విద్యుత్ సమస్యపై స్పందిస్తూ.. 2019 ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలు, ప్రస్తుతం చేస్తున్న పనులను ఉదహరిస్తూ ‘జనం చెవిలో జగన్ పూలు’ ఏప్రిల్ 1న విడుదల అంటూ సెటైరికల్ వీడియో విడుదల చేశారు. చీటికి మాటికి ఢిల్లీ వెళ్తున్న జగన్ టూర్ దేని కోసం అంటూ.. పేలని జ’గన్’ హస్తిన పయనమెందుకు అంటూ లోకేష్ ట్విట్టర్ లో పెట్టిన పోల్ బాగా వైరల్ అయింది. ‘అసూయకు మందు లేదు.. అసూయతో ఉంటే త్వరగా గుండెపోటు, బీపీలు వస్తాయి’ అన్న జగన్ కు లోకేష్ ట్విట్టర్ వేదికగా ‘అసూయకు అన్నలాంటి వాడు సీఎం జగన్’ అంటూ గట్టి కౌంటరే ఇవ్వడం గమనార్హం.

‘వెంట్రుక కూడా పీకలేరు’ అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు అంతే స్పీడుగా కౌంటర్ వేయడం లోకేష్ లోని స్పీడుకు నిదర్శనం అంటున్నారు. ‘గల్లీ నుండి ఢిల్లీ వరకూ పనికిమానిలోడని తేలిపోయిన తర్వాత ఫ్రస్టేషన్ కాకపోతే ఫన్ వస్తుందా?.. మీ వెంట్రుకలు పీకే ఓపిక, తీరిక మాకు లేవు.. మీ నవరంధ్ర పాలన నుంచి ప్రజలను ఎలా గట్టెంకించాలనే ఆలోచనతో మేం పనిచేస్తున్నాం.. ప్రజలే మీ వెంట్రుకలు పీకడానికి, గుండు కొట్టించి, పిండిబొట్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు’ అని కౌంటర్ వేశారు. ఒక వైపున ట్విట్టర్ వేదికగా ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపుతూనే మరో పక్కన జగన్ కు వివిధ అంశాలపై లోకేష్ లేఖలు రాస్తున్నారు. ఏపీలో ఇటీవల విధించిన పవర్ హాలిడే ఎత్తేయాలంటూ జగన్ కి లేఖ రాశారు. విద్యుత్ రంగాన్ని నాశనం చేసి, ఏపీని అంధకారంలో నెట్టేయడం సరికాదని తప్పుపట్టారు. ఏపీలోని ధాన్యం రైతుల దైన్యంపైన కూడా జగన్ కు లోకేష్ లేఖ రాశారు. రైతుల నుంచి మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

‘అమ్మ ఒడి’ లబ్ధిదారులకు నిబంధనలు పెట్టిన తీరుపై లోకేష్ సెటైర్లు వేశారు. ‘కన్న తల్లికి అన్నం పెట్టనోడు.. పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానన్నట్లు ఉంది జగన్ అమ్మ ఒడి పథకం తీరు’ అని సెటైర్ వేశారు. ‘అమ్మ ఒడిని అర్ధ ఒడి’ చేశారని దుయ్యబట్టారు. ఏపీలో జగన్ రెడ్డి ఏలుబడిలో బాలికలు, యువతులు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై లోకేష్ స్పందించారు. ఆస్పత్రుల ప్రైవేట్ అంబులెన్స్ ల దందాపై స్పందిస్తూ.. చేతగాని పాలకుడు జగన్ చెత్త పాలన కారణంగానే రుయా ఆస్పత్రి నుంచి తన కొడుకు మృతదేహాన్ని ఓ తండ్రి బైక్ పై తీసుకెళ్లిన దుస్థితి దాపురించిందని దుయ్యబట్టారు. ఏపీ ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా టీడీపీ చేపట్టిన ‘బాదుడే బాదుడు’ నిరసనలో భాగంగా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లిలో ప్రజలకు విసనకర్ర, కొవ్వొత్తి, అగ్గిపెట్టి పంపిణీ చేశారు. గత ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఇళ్లపట్టాలు ఇస్తానని హామీ ఇచ్చిన మంగళగిరి ఎమ్మెల్యే ఇళ్ల పట్టాలు ఇవ్వకపోగా ప్రజలపై కక్షకట్టి ఇళ్లు కూల్చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ట్విట్టర్ వేదికగా వైసీపీ సర్కార్ ను అనుక్షణం నిలదీస్తూనే, మరో పక్కన ప్రజలతో మమేకం అవుతున్నారు. ప్రజల సమస్యలపై ప్రభుత్వానికి, సీఎం జగన్ కు లేఖలు రాస్తున్నారు. మొత్తం మీద పార్టీని గెలుపు బాటలో నడిపించేందుకు చేయాల్సిన కృషి చేస్తూనే.. మంగళగిరిపై మరింత పట్టు పెంచుకునేందుకు కూడా లోకేస్ మరింత వేగంగా అడుగులు వేస్తున్నారు. రాళ్ల దాడులు జ‌రిగినా.. త‌గ్గేదేలే.. వైసీపీ అరాచ‌కాల‌కు బెదిరేదేలే.. జ‌గ‌న్ అండ్ కో ను వ‌దిలేదేలే అంటున్నారు. 

By
en-us Political News

  
టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇటీవల తనపై సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం, పార్టీలో నెలకొన్న చర్చల నేపథ్యంలో స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్టీ శ్రేణులు కూడా ఆయన తీరును తప్పుపట్టారు. అయితే   బోండా ఉమా కూడా  తగ్గేదేలే అన్నట్లుగా స్పందించారు.  గతంలో వంగవీటి రాధా, జ్యోతుల నెహ్రూ వంటి నాయకులు కూడా ఇతర పార్టీల నేతలతో కలిసినప్పుడు లేని అభ్యంతరం, కేవలం తన విషయంలోనే ఎందుకు వస్తోందని నిలదీస్తున్నారు.
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై వైసీపీ విమర్శలను  కూడా శ్రావణ్ తప్పుబట్టారు. ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చాయో ప్రభుత్వం ఇప్పటికే పూర్తి వివరణతో క్లారిటీ ఇచ్చిందనీ,  పరీక్ష రాసిన లక్షలాది మందిలో ఎంపిక కాని వారి అసంతృప్తిని ఆసరాగా చేసుకుని, ఎలాంటి రుజువులు లేకుండా పత్రికా సమావేశాలు పెట్టి మాట్లాడటం వల్ల అభాసుపాలయ్యేది వైసీపీయేనని చెప్పారు. 
ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీల సంక్షేమానికి పెద్దపీట వేసిందని, వారికి తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుందని లోకేష్ వివరించారు. ప్రభుత్వం చూపిన ఈ చొరవకు లబ్ధిదారులుగా ఉన్న అంగన్వాడీలు సంతోషం వ్యక్తం చేస్తూ, పెనమలూరు పర్యటనలో తనకు ధన్యవాదాలు తెలిపేందుకే పెద్ద ఎత్తున తరలివచ్చారని వివరంచారు.
సీసీటీవీ ఫుటేజీల ఆధారంతో వాస్తవాలను తేల్చుకున్న పోలీసులు ప్రమాదానికి కరాణమైన సిదిరి అప్పలరాజు కుమారుడిని అరెస్టు చేయడంతో పాటు.. కేసును తప్పుతోవ పట్టించేందుకు ప్రయత్నించారనీ, అలాగే ఆధారాలు తారుమారు చేసే యత్నాలు చేశారనీ పేర్కొంటూ సిదిరి అప్పల రాజును కేసులో ఏ3గా చేర్చి ఆయనను కూడా అరెస్టు చేశారు.
మనీశ్ సిసోడియా సవాల్ ను స్వీకరించిన కాంగ్రెస్, బిజెపి, శిరోమణి అకాలీదళ్ పార్టీలు పంజాబ్‌లో ఆప్ పాలనలో గత నాలుగున్నరేళ్లలో కనీసం 6 ప్రధాన పోటీ పరీక్షల్లో అక్రమాలు, లీకేజీలు జరిగాయని ఆధారాలతో సహా వెల్లడించారు.
ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య వాగ్బాణాలు పతాక స్థాయికి చేరాయి.
తాజాగా బోండా ఉమ.. గుంటూరులో జరిగిన కాపు ఉద్యమ నేత, దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడం, ఆ వేదికపై నుంచి బోండా ఉమ చేసిన వ్యాఖ్యలు.. ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి
కాక్రోచ్ ఉద్యమం ప్రారంభం అయిన నాటి నుంచీ ధర్మేంద్ర ప్రధాన్ ను వెనకేసుకుంటూ వచ్చిన మోడీ చివరకు దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడటమే ఇందుకు కారణం. అందులోనూ ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా విద్యార్థి నాయకుడు. విద్యార్థి నాయకుడి నుంచి రాజకీయ వేత్తగా అక్కడ నుంచి విద్యాశాఖ మంత్రిగా ఎదిగారు.
వైసీపీ హయాంలో పర్యాటక, సాంస్కృతిక, యువజన సంక్షేమం, క్రీడా శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి విదితమే.. ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా క్రీడా పరికరాల కొనుగోల విషయంలో భారీ స్థాయిలో అక్రమాలు, నిధుల మళ్లింపు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తరువాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధకారంలోకి వచ్చాకా, ఆడుదాం ఆంధ్ర అక్రమాలపై వివిధ పోలీస్ స్టేషన్లలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు నమోదయ్యాయి.
అంబటితో వేదిక పంచుకోవడంపై కలకలం..! కాపు ఉద్యమంపై కీలక వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్పందించారు.   ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా ఆమె స్పీడీ రికవరీ ఆకాంక్షిస్తూ పోస్టు షేర్ చేశారు. రాజకీయంగా, సిద్ధాంతపరంగా విభేదాలు పక్కన పెట్టి ప్రజాస్వామ్య విలువలను  పాటించారు.
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.