ముద్రగడ మళ్లీ మొదలెట్టారు!.. కాపులకు అన్యాయం అంటూ చంద్రబాబుకు లేఖ

Publish Date:Feb 2, 2026

Advertisement

ముద్రగడ పద్మనాభం అలియాస్ ముద్రగడ పద్మనాభ రెడ్డిపై నెటిజనులు ఉత్తర కుమారుడు అని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తుంటారు. ఎందుకంటే ఆయన చంద్రబాబుపై లేఖాస్త్రాలు సంధించడంలో ఎప్పుడూ బిజీగా ఉంటారు. ఇటీవలి కాలంలో అంటే గత ఎన్నికలలో ఘోర పరాజయం పాలై.. వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత ఆయన దాదాపుగా సైలంట్ అయిపోయారు. అంతకు ముందు అంటే ఎన్నికలకు ముందే..  పిఠాపురం నియోజకవర్గంలో జనసేనాని పవన్ కల్యాణ్ విజయం సాధిస్తే తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని సవాల్ చేశారు. అ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించడంతో ముద్రగడ పద్మనాభం తన పేరును అధికారికంగా ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు.

అది పక్కన పెడితే... అంతకు ముందు అంటే  2014 నుంచి 2019 మధ్య కాలంలో ఆయన కాపు రిజర్వేషన్ ఉద్యమాన్నినడిపారు.  ఆ ఉద్యమం పూర్తిగా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అప్పటి విపక్ష నేత జగన్ కు అనుకూలం అని అప్పట్లో  రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.   2019 ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి అధికారంలోకి రాగానే ముద్రగడ కాపు ఉద్యమాన్ని ఆపేశారు.  అంతే కాకుండా జగన్ సర్కార్ కు పూర్తి అనుకూలంగా వ్యవహరించారు. 2024 ఎన్నికలకు ముందు ఆయన పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు, వ్యవహరించిన తీరు కారణంగా  ఆయన కాపు సామాజికవర్గానికి దూరం అయ్యారు. సరే ఆ ఎన్నికలలో పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ ఘన విజయం, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కూటమి ప్రభంజనంతో వైసీపీ  ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని అధికారం కోల్పోయింది. ఆ తరువాత నుంచీ దాదాపుగా సైలంట్ అయిపోయిన ముద్రగడ పద్మనాభం, ఇప్పుడు తాజాగా తన పెన్ను విదిల్చారు.  

మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ నివాసాలపై దాడులు జరిగడంతో ఇప్పుడు మళ్లీ ఆయన కాపు సామాజిక వర్గానికి తెలుగుదేశం వ్యతిరేకం అంటూ గొంతు సవరించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ కు బహిరంగ లేఖ రాశారు.  రాష్ట్రంలో కాపులకు అన్యాయం జరుగుతోందంటూ ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.  చంద్రబాబు పాలన ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తోందంటూ విమర్శలు గుప్పించారు.

 కాపు సామాజిక వర్గాన్ని రాష్ట్రం నుంచి కట్టుబట్టలతో పంపించేయడానికి కంకణం కట్టుకున్నారా? అంటే ఆ లేఖలో చంద్రబాబు, లోకేష్ లను ప్రశ్నించారు. అయితే ఈ లేఖపై నెటిజనులు ముద్రగడను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ముద్రగడ పద్మనాభం కు కాపుసామాజిక వర్గం ఇప్పుడే గుర్తుకు వచ్చిందా అని నిలదీస్తున్నారు. పవన్ కళ్యాణ్ నుఓడిస్తానని శపథం చేసినప్పుడు, వైసీపీ అధినేత సహా వైసీపీ నేతలు పవన్ కల్యాణ్ పైనా, ఆయన కుటుంబ సభ్యులపైనా అసభ్యంగా వ్యాఖ్యలు చేసినప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు. అయినా తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకున్న ముద్రగడకు కాపు సామాజిక వర్గం ప్రతినిథిగా చెప్పుకునే నైతికత ఎక్కడిదని విమర్శిస్తున్నారు. 

By
en-us Political News

  
తాజా ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వానికి, పార్టీ ఇమేజ్‌కు నష్టం కలిగించేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వందేమాతరం అంశం చర్చనీయాంశంగా మారింది.
2024 ఎన్నికల సమయానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న జనసేన పార్టీ తెలుగుదేశం, బీజేపీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల రంగంలోకి దిగింది. ఆ ఎన్నికలలో నాగబాబు అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి రంగంలోకి దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది. అయితే పొత్తు ధర్మంలో భాగంగా నాగబాబుకు ఆ ఎన్నికలలో పోటీ చేసే అవకాశమే దక్కలేదు.
తమిళనాడులో బీజేపీ, హీరో విజయ్ సారథ్యంలోని టీవీకేల పొత్తు విషయంలో మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
దేశంలోని నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది
ఈసీ తీరుపై నమ్మకం లేదని చెబుతున్న పార్టీ, ఇప్పుడు సీఈసీపై అభిసంశన తీర్మానానికి మద్దతుగా నిలబడకుంటే.. ఆ పార్టీ నైతికతే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒక వేళ వైసీపీ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తే ఇక ముందు, ఎన్నికల అక్రమాలపై మాట్లాడేందుకు వైసీపీకి అర్హతే ఉండదు. ఇంత వరకూ తెలుగుదేశం కూటమి విజయంపై వారు చేసిన విమర్శలన్నీ దూదిపింజెల్లా ఎగిరిపోతాయి.
బీఆర్ఎస్ హయాంలో ఇదే ఫామ్‌హౌస్ వేదికగా జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతం అప్పట్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో రోహిత్ రెడ్డి ఫిర్యాదుతోనే పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ కేసు జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.
దేవ్ జీ అరెస్ట్ ఎలా జరిగింది? అరెస్టు తరువాత ఆయన లొంగుబాటు ప్రకటన చేసి జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? లొంగిపోలేదు అంటూనే.. ప్రస్తుత పరిస్థితుల్లో అజ్ణాతంగా ఉండి ఉద్యమాన్ని కొనసాగించడం కష్టసాధ్యమని ఎందుకు చెబుతున్నారు?
త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి రావడం కన్ఫర్మ్ అన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి త్రిష నుంచి ఎటువంటి క్లారిటీ అయితే ఇప్పటి వరకూ రాలేదు. ప్రస్తుతం త్రిష పలు సినిమాలలో నటిస్తున్నారు. వాటిలో మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా కూడా ఉంది.
మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా పవన్ కల్యాణ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనీ, షూటింగ్ లంటూ అధిక సమయం హైదరాబాద్ లోనే ఉంటున్నారని రోజా అన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి సినిమాలలో యాక్టింగ్ కి పరిమితమైనట్లుగా పవన్ కల్యాణ్ తీరు ఉందని రోజా అన్నారు. కీలకమైన మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టడం సరికాదన్న రోజా దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే.. పాతిక మంది ఎమ్మెల్యేలు ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ భేటీ జరగడం సంచలనం సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదిక 16వ సంచికలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
జనసేన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఈసారి దూరం జరిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.