Publish Date:Aug 11, 2022
గత రెండు రోజులుగాదేశంలో రాఖీ హడావుడి జరుగుతోంది. ఉత్తరాదిలో ఇప్పటికే రంగు రంగుల బ్యాండ్లతో, చిన్నకవర్లో ఓ వంద నోటుతోనో చెల్లెళ్ల ఇంటికి పయనమవుతున్నారు. కానీ చిత్రంగా ఇది ఇటీవల మరీ రాజ కీయంగానూ మారిపోయింది. ఇంట్లో చూపించేది నిజంగానే అన్నాచెల్లెళ్ల ప్రేమ బయటికి వస్తే సదరు చెల్లలో, అక్కో ఖచ్చితంగా ఓటరుగానే చెల్లుబాటు అవుతోన్నారు.
అన్నా..నీ అనురాగం ఏన్నో జన్మల పుణ్యఫలం.. అంటూ ఓ పాత సినిమాలు ఓచెల్లి ఇల్లంతా తిరుగుతూ హీరోగారికి చెల్లి ప్రేమ పంచుతుంది. అప్పట్లో ఈపాటకు అమాంతం వెనకవరసల్లో ఉన్నవారు కన్నీళ్ల పర్యంతమయ్యారు. పరుగున చెల్లెళ్ల ఇంటికి పరుగులు పెట్టారు. ఇదంతా ఒక ఎత్తు, సర్వసాధారణం. కాగా, ఎన్నికల సమయంలో దాదాపు అన్ని పార్టీలవారు అక్కచెల్లెళ్లను కలవాలని భార్యా సమేతంగా ఏకం గా కుం కుమ భరిణితో అన్నిఅపార్ట్మెంట్లకీ తిరగడం ఆనవాయితీగానూ మారిపోయింది. రాజకీయ నాయ కుల ప్రేమలో కొంత స్వార్ధం ఉంటుంది. వారు ఎంత ప్రచారం చేసుకున్నా సదరు అక్కచెల్లెళ్లు చివరాఖ రికి ఓటర్లుగా మారిపోతారు. ప్రధాని మోదీజీ కూడా ఈ చెల్లెళ్ల ప్రేమను ఉప్పొంగించాలని చాలా ఆతృతే ప్రదర్శించారు.
ఇటీవల కోవిడ్ మహమ్మారి సమయంలో నిజానికి ఎంతో అద్భుతంగా డాక్టర్లతో సమానంగా పనిచేసింది పారిశుద్ధ్య కార్మికులే. ఇందులో సందేహం లేదు. వారికి దేశప్రజలంతా అపార గౌరవాన్ని ప్రదర్శించారు. కాగా ఇపుడు లేటెస్టుగా ప్రధాని రక్షాబంధన్ అడ్డంపెట్టుకుని మంగళవారం (ఆగష్టు 10) ఢిల్లీలో ప్రధాని తన కార్యాలయంలో పనిచేస్తున్నపారిశుధ్య కార్మికుల పిల్లల్ని పిలిపించి వారితో రాఖీ కట్టించుకున్నారు. ఆ వచ్చిన పిల్లలు తల్లులతో పాటు ఎంతో మురిసిపోయారు. కానీ విపక్షాలు మాత్రం ఇదంగా రాజకీయ జిమ్మిక్కుగానే వర్ణిస్తున్నారు. నరేంద్రమోదీ వంటి రాజకీయ చతురుడు, ఎత్తులు, పై ఎత్తులు వేయడంలో ఆరితేరినవారూ బీజేపీలో ఎవ్వరూ లేరు. ఆయనకు ఏ సమయంలో ఎవరిని ఆకట్టుకోవాలన్నది బాగా ఎరుకే.
రక్షాబంధన్ మాత్రమే కాదు అజాదీ కా అమృతోత్సవ్ పాఠాన్ని దేశ ప్రజలందరికీ వినిపించి దేశ భక్తిని ప్రతీవారు ప్రదర్శించాలని. అందుకు గుర్తుగా జాతీయ పతాకాన్ని ఇంటి మీద, కార్యాలయాల మీద ఎగుర వేయాలని ఆదేశించడం ఆయన ప్రత్యే కత. మరి తాజాగా పారిశుధ్య కార్మికుల పిల్లలచేత రాఖీ కట్టిం చుకోవడం కూడా దేశభక్తి అక్కాచెల్లెళ్ల ప్రేమను వ్యక్తం చేయమనడం కంటే ఇంత బ్రహ్మాండంగా పాలి స్తున్న బీజేపీ ని మళ్లీ గెలిపించి పుణ్యం కట్టుకోవాలనే సందేశం దేశంలో ప్రచారానికి ఇదో గొప్ప అస్త్రం. ఎందుకంటే భావీభరాత పౌరులు అండ దండలు మరి ఎవరికైనా అవసరేమగా!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mothers-what-about-vote-39-141742.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.