Publish Date:Jun 16, 2026
అంతర్జాతీయ దౌత్య వేదికలపై దేశాల మధ్య వ్యూహాత్మక చర్చలు, ఒప్పందాలు జరగడం సర్వసాధారణం. కానీ కొన్నిసార్లు అక్కడ చోటుచేసుకునే సరదా సన్నివేశాలు ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటాయి. సరిగ్గా ఇలాంటి ఒక సరదా సన్నివేశం ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న జీ7 సదస్సులో ఆవిష్కృతమైంది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య జరిగిన ఒక ఆసక్తికరమైన సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సంభాషణ మళ్లీ మెలోడీ ట్రెండ్ ను తెరపైకి తెచ్చింది.
ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫారమ్లో మనమే ఫేమస్ అంటూ ఇటలీ పీఎం మెలోనీ చేసిన సరదా వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. జీ 7 సదస్సులో భాగంగా ప్రపంచ దేశాల అధినేతలంతా సంప్రదాయబద్ధంగా ఒకేచోట చేరి ఫ్యామిలీ ఫోటో' దిగడానికి సిద్ధమైన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీని పలకరించిన జార్జియా మెలోనీ.. మిమ్మల్ని ఇక్కడ మళ్లీ కలుసుకోవడం సంతోషందా ఉందన్నారు. దానికి ప్రధాని మోదీ డిజిటల్ ప్రపంచంలో, ముఖ్యంగా సోషల్ మీడియాలో తమ ఇద్దరికీ ఉన్న పాప్యులారిటీని గుర్తు చేశారు. మోదీ సమాధానానికి ఇటలీ ప్రధాని మెలోనీ హాయిగా నవ్వుతూ.. నిజమే.. ఇన్స్టాగ్రామ్లో మనమే ఫేమస్ మన తరువాతే ఎవరైనా అంటూ బదులిచ్చారు.
అలా ఈ ఇద్దరి మధ్యా జరిగిన సరదా సంభాషణకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నిముషాల వ్యవధిలోనే లక్షలాది వ్యూస్ వచ్చాయి. నిజానికి ప్రధాని మోదీ, జార్జియా మెలోనీల మధ్య ఇలాంటి సరదా ముచ్చట్లు సాగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఇటలీ రాజధాని రోమ్ నగరంలో జరిగిన ఒక ద్వైపాక్షిక సమావేశంలో ప్రధాని మోదీ ఇటలీ పీఎం మెలోనీకి మెలోడీ చాక్లెట్ల ప్యాకెట్ను బహుమతిగా ఇచ్చారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని అప్పట్లో మెలోనీ, హలో ఫ్రం ది మెలోడి టీమ్ అనే క్యాప్షన్ను జోడించి మోడీ తనకు మెలోడీ చాక్లెట్లను బహుమతిగా అందజేస్తున్న ఫొటోను పోస్టు చేశారు. అప్పటి నుంచి నెటిజన్లు నరేంద్ర మోదీ పేరులోని చివరి అక్షరాలను, జార్జియా మెలోనీ పేరును కలిపి మెలోడి హ్యాష్ట్యాగ్తో ట్రెండ్ చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/most-fmous-on-instagram-36-223174.html
తమిళనాడుకు చెందిన నవనీతమ్మ తిరుపతిలోనే నివసిస్తున్నారు. శనివారం జులై 4)ఆమె కాలినడకన తిరుమల శ్రీవారి కొండను అధిరోహిస్తున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఆమె అచంచల భక్తి విశ్వాసాలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు ఫిదా అయ్యారు.
ఆంధ్రప్రదేశ్లోని పారిశ్రామిక హబ్ శ్రీసిటీ లో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నందుకు షోలమ్ గ్రూప్ యాజమాన్యానికి ధ్యాంక్స్ చెప్పిన లోకేష్.. ఈ ప్లాంట్కు సంబంధించిన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు.
రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. 16 వేల350 కోట్లరూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారంతో పాటు దానికి అనుబంధంగా రాబోయే గ్రీన్ ఎనర్జీ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ఆయన ప్రారంభించారు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ నాట్ బ్రంట్ అసాధారణ పోరాట పటిమను కనబరిచి.. కేవలం 53 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్గా నిలవడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఫ్రేయా కెంప్ కూడా 28 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్గా నిలిచింది.
బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్దం చేసుకున్న తారిఖ్.. దుండగుడిని గట్టిగా ప్రతిఘటించాడు. దీంతో ఆ దుండగుడు తుపాకీతో తాఱీఖ్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తారిఖ్ అక్కడికక్కడే మరణించాడు.
ఆందోళనకారులపై పోలీసులు, రేంజర్లు.. టియర్ గ్యాస్ షెల్లింగ్, కాల్పులకు తెగబడ్డారు. అన్బ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మహ్మద్ యాకూబ్ అనే సామాన్య పౌరుడు మరణించాడు. మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
క్షణ విషయంలో నాటో సభ్య దేశాలు అమెరికాపై అతిగా ఆధారపడే విధానానికి స్వస్తి పలకడం కోసమే ట్రంప్ ఈమాండ్ తెరపైకి తీసుకువచ్చారని శ్వేత సౌధ సీనియర్ అధికారులు చెబుతున్నారు. ==
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక మండుతున్న అగ్నిపర్వతంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28 అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
యుద్ధనౌకకు సంబంధించిన ప్రధాన నావికాదళ ఫిరంగులు, ఆటోమేటిక్ గన్నులు, రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ల పనితీరును కూడా కిమ్ స్వయంగా పరిశీలించి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.