Publish Date:May 21, 2022
నిన్న మొన్నటి వరకూ ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడ లాడించింది. ఆ వైరస్ ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోనే లేదు. ఇంతలోనే మరో వైరస్ ప్రపంచంపై దండయాత్ర ప్రారంభించింది. ఈ వైరస్ కొత్తదేం కాదు.. ఆఫ్రికా దేశాల్లో ఎప్పటి నుంచో ఉన్నదే.. కానీ ఈ సారి ఇది ప్రపంచంపై దండయాత్ర చేస్తోంది.
వేగంగా విస్తరిస్తూ ప్రపంచాన్నికమ్మేస్తోంది. ఈ వైరస్ వ్యాప్తి కరోనాతో సమానమైన వేగంతో ఉంది. ఈ వైరస్ కరోనా అంత ప్రమాదకరం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్నా...వైరస్ సోకిన పది మందిలో ఒకరు మరణిస్తారని చెబుతోంది. అంటూ ఈ వ్యాధి సోకిన వారిలో పది శాతం మంది మరణిస్తారన్నది ప్రపంచ ఆరోగ్య శాఖ అంచనా. ఇప్పటికే ఈ వైరస్ బ్రిటన్, స్పెయిన్, పోర్చుగల్, స్వీడన్, అమెరికా, కెనడా, ఇటలీలకు వ్యాపించింది.
ఆందోళనకరమైన అంశమేమిటంటే బ్రిటన్ మినహా మిగిలిన దేశాలలో బయటపడిన మంకీ వైరస్ కు ఆఫ్రికా దేశాలతో సంబంధం లేకపోవడమే. ఆఫ్రికా దేశాలలో కొతులలో ఈ వైరస్ ను కనుగొనడంతో దీనికి మంకీ ఫాక్స్ అని పేరు పెట్టారు కానీ, ఇది ఇతర జంతువుల నుంచి కూడా మనుషులకు సోకే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.
ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న మంకీ ఫాక్స్ వైరస్ పట్ల కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మంకీ ఫాక్స్ వ్యాప్తి అధికంగా ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణీకుల ఆరోగ్య పరిస్థితిని చెక్ చేసి.. అనారోగ్య లక్షణాలుంటే విమానాశ్రయం నుంచే ఐసోలేషన్ కు తరలించే ఏర్పాట్లు చేసింది. ఈ వైరస్ సోకిన వారిలో జ్వరం ఒళ్లు నెప్పులతో పాటు శరీరంపై చికెన్ ఫాక్స్ లా బొబ్బలు వస్తాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/monkey-fox-another-virus-spreading-world-wide-25-136241.html
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు వంటి మహనీయుడిని సైతం నేడు ఒకే ఒక్క కులానికి పరిమితం చేసే దుస్థితి మన రాష్ట్రంలో నెలకొందన్న పవన్ కల్యాణ్.. కులాల పేరుతో సమాజాన్ని విడదీసే ఈ దుర్మార్గపు రాజకీయాలకు ఎక్కడో ఒకచోట చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. కులాల ఐక్యతే జనసేన పార్టీ మూల సిద్ధాంతమన్నారు.
గద్దర్ కుమార్తె వెన్నెల పవన్ కల్యాణ్ మాటలు తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, తన తండ్రి గద్దర్ వారసత్వాన్ని అవమానించేలా ఉన్నాయని మండిపడ్డారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా పవన్కు గట్టి కౌంటర్ ఇచ్చారు.
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమైన మలుపులతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి.
పవన్ కళ్యాణ్పై తెలంగాణలోని కొన్ని రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు.
చివరి గింజ ధాన్యం కొంటామన్న కాంగ్రెస్ సర్కార్ అప్పులు చేయడంలో రేవంత్ ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోందని విమర్శించిన కేటీఆర్.. రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం 4 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందన్నారు.
లంగాణ ప్రజల దశాబ్దాల కల సాకారమైన రోజున ఇక్కడి సెంటిమెంట్ను దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదన్నారు. గతంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు తాను 11 రోజుల పాటు అన్నం తినలేదని పవన్ కల్యాణే స్వయంగా చెప్పారనీ.. అలాంటి వ్యక్తి మళ్లీ ఇప్పుడు తెలంగాణకు తాను వ్యతిరేకం కాదంటూ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని కేటీఆర్ అన్నారు.
జగన్ ఎప్పుడెప్పుడు అధికారం నుంచి దిగిపోతారా అని దేవుళ్లకు పూజలు చేశారు, శాపనార్థాలు పెట్టారు. జగన్ అధికారంలో ఉంటే తమ అమరావతి కలలు ఎప్పటికీ ఫలించవని ఆవేదన చెందారు. అలాంటిది, ఇప్పుడు అదే అమరావతికి చెందిన రైతులు తాడేపల్లిలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లి, ఆయనతో సుదీర్ఘంగా భేటీ అయ్యారనే వార్త పొలిటికల్ సర్కిల్స్ నే కాకుండా సామాన్య ప్రజలను కూడా విస్మయానికి గురి చేసింది.
దశాబ్దాలుగా కోలీవుడ్ లో సంపాదించుకున్న తన స్టార్ డమ్ ను, ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఓటు బ్యాంకుగా మార్చుకోవడంలో విజయ్ సఫలమయ్యారు. వీటన్నింటికీ తోడు తమిళనాట కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజ నేతల మరణాల తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యం విజయ్ కు అనుకూలంగా మారింది.
ఈ విజయం కేవలం ఒక పదవి మాత్రమే కాదని, తన దశాబ్దాల కఠిన శ్రమకు, అంకితభావానికి దక్కిన అసలైన ఫలితమని ప్రకటించారు.
గతంలో మాతో పెట్టుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, ఇప్పుడు పెట్టుకుంటే మూతిపళ్ళు రాలుతాయని కవిత హెచ్చరించారు. అంతేకాకుండా, అక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజధాని కట్టుకోవడం చేతకానివాళ్ళు, తెలంగాణ నవనిర్మాణం చేస్తారా అంటూ ఆమె ఎద్దేవా చేశారు.
అరవ శ్రీధర్పై ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో జనసేన నాయకత్వం దీనిపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
పోలీసులు జనసేన సభకు నో చెప్పారు. వేలాది మంది అభిమానులు, వందలాది మంది ముఖ్య నాయకులు హాజరయ్యే ఇటువంటి కీలక సభకు చివరి నిమిషంలో పర్మిషన్ నిరాకరించడంపై జనసేన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి కోలుకోకముందే.. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి సొంత పార్టీ ఎమ్మెల్యేలు భారీ షాక్ ఇచ్చారు. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత.. భవిష్యత్తు కార్యాచరణను చర్చించేందుకు ఏర్పాటు చేసిన కీలక సమావేశానికి పార్టీకి ఉన్న 80 మంది ఎమ్మెల్యేలలో ఏకంగా 60 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు అయ్యారు.