మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలలో మోడీ.. రాజకీయ వర్గాలలో ఆసక్తి

Publish Date:Jun 16, 2022

Advertisement

ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే నెల మొదటి వారంలో ఏకంగా మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలలో పర్యటించనున్నారు. జులై 2, 3 తేదీలలో హైదరాబాద్ వేదికగా జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరౌతారు. ఆ మరునాడు అంటే జులై 4న ఏపీలో పర్యటించనున్నారు. మంగళగిరిలో ఆయన ఎయిమ్స్ ను ప్రారంభిస్తారు.

ప్రధాని ఏకంగా మూడు రోజులు తెలుగు రాష్ట్రాలలోనే మకాం వేయనుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.   తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు తెలంగాణను  వేదిక చేసుకుంది. ఈ సమావేశాలకు ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సహా పార్టీ అగ్రనేతలంతా హాజరు కానున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్వహణతో తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపి తెలంగాణలో కమల వికాసం దిశగా వారిని కార్యోన్ముఖలను చేయడానికి అవసరమైన దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఇక ఏపీలో కూడా బీజేపీ బలోపేతం కోసం సర్వశక్తులూ ఒడ్డుతోంది. సొంతంగా బలం పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. అందులో భాగంగానే రాష్ట్రంలో ఏ పార్టీనీ, ఏ వ్యక్తినీ పార్టీ భుజాన మోయదంటూ బీజేపీ జనసేనకు స్పష్టత నిచ్చింది.

ఈ నేపథ్యంలోనే మోడీ రాష్ట్రపర్యటనకు ప్రాధాన్యత వచ్చింది. ఏపీ గడ్డపై నుంచి రాష్ట్ర బీజేపీ సేనలకు ఆయన ఏం చెబుతారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన ఉంది. అయితే పర్యాటకులు మాత్రం రాష్ట్రపతి ఎన్నికలో బీజేపి అభ్యర్థికి వైసీపీ మద్దతు ఇవ్వడం ఖరారైనప్పటికీ, మరో సారి అదే విషయమై జగన్ తో చర్చించే అవకాశాలు మెండుగా ఉన్నాయని భావిస్తున్నారు.  మొత్తం మీద దక్షిణాదిలో బలోపేతం కావాలన్న బీజేపీ యత్నాలకు అనుగుణంగానే ప్రధాని, హోంమంత్రి సహా కమలం పార్టీ  నే తలు ఒక్కరొక్కరుగా తెలుగు రాష్ట్రాలకు క్యూ కడుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇందులో భాగంగానే  మోడీ వరుసగా మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలలో పర్యటన ఉండేలా షెడ్యూల్ ఖరారు చేసుకున్నారని అంటున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన తెలంగాణలో రెండు రోజులు మకాం వేయనున్నారు. ఆ సందర్భంగా తెలంగాణలో పార్టీ బూత్ స్థాయిలో బలోపేతం అయ్యేలా క్యాడర్ కు దిశా నిర్దేశం చేయడంతో పాటు ఏపీకి చెందిన పార్టీ ముఖ్య నేతలతో కూడా ఆయన చర్చించే అవకాశం ఉంది. ఏపీలో కూడా ముందస్తు అంచనాల నేపథ్యలో పార్టీ క్యాడర్ ను ఎన్నికలకు సన్నద్ధం చేయడంతో పాటు.. పార్టీకి నష్టం వాటిల్లకుండా, పొత్తుపొడుపుల విషయంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని కూడా ఖరారు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఎవరెన్ని చెబుతున్నా ఏపీలో బీజేపీకి వైసీపీకి మైత్రి బహిరంగ రహస్యమే. ఆ కారణంగానే తన మిత్రుడికి మేలు కలిగేలా రాష్ట్రంలో విపక్షాల ఐక్యతకు గండి కొట్టేలా రాష్ట్రంలో కమలం నాయకత్వం వ్యవహరిస్తున్నది. వైసీపీ బలం పెచ్చు చేసి చూపుకునేందుకు వీలుగా ఆత్మకూరు ఉప ఎన్నికలో అభ్యర్థిని పోటీకి నిలిపిందని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో మోడీ ఏపీ పర్యటన సందర్భంగా అధికార పార్టీపై విమర్శల మరకలు కాకుండా ప్రశంసల మెరుపులు ఉండే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

రాష్ట్రపతి ఎన్నికలో వైసీపీ మద్దతుకు సంబంధించిన మంతనాలకే మోడీ ఏపీ పర్యటన పరిమితమయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయంటేన్నారు.  నిన్న గాక మొన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ హస్తినలో పర్యటించి ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఆ భేటీ వివరాలు బయటకు రాకపోయినప్పటికీ.. ఇరువురి మధ్యా చర్చ ప్రధానంగా రాష్ట్రపతి ఎన్నికలో వైసీపీ బీజేపీకి మద్దతు ఇవ్వడంపైనే జరిగిందని ఇరు పార్టీల నాయకులూ కూడా ప్రైవేటు సంభాషణల్లో చెబుతున్నారు.

అంతకు మించి ఏపీకి రావలసిన ప్రత్యేక హోదా, రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ వంటి డిమాండ్లేవీ జగన్ మోడీ ఎదుట ఉంచలేదని కూడా అంటున్నారు. అయితే రాష్ట్రంలో షో రన్ చేయడానికి, ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి మరింత అప్పు మంజూరు చేయాలని జగన్ ప్రధానిని కోరారనీ, అందుకు మోడీ సానుకూల స్పందన ఫలితమే.. మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టుకుని రుణం పొందేందుకు ఆర్బీఐ అంగీకరించడమని చెబుతున్నారు. అదనపు రుణాన్ని అందించినందుకు మోడీకి జగన్ కృతజ్ణతలు తెలపడం వినా మోడీ రాష్ట్ర పర్యటన వల్ల ఒరిగేది, ఒనగూడేదీ ఏమీ ఉండదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
వచ్చే ఎన్నికల్లో నాగబాబు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి.
బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించలేదు. ఇంత వరకూ వచ్చిన తరువాత పార్టీలో కొనసాగితే.. తన గౌరవానికి భంగం అని జీవన్ రెడ్డి తనను బుజ్జగించడానికి వచ్చిన నేతలతో అన్నట్లు సమాచారం. వాస్తవానికి గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నజీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ గూటికి చేరనున్నారని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు 15వేల రూపాయలు, జనరల్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వారు పాతిక వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. ఇలా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దిష్ట తేదీ, నిర్దిష్ట సమయం కేటాయించి ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
తెలుగువన్ వాస్తవ వేదిక తాజా సంచికలో వివేక హత్య కేసుపై విస్తృత చర్చ జరిగింది
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి ఇటీవల ఒకే ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
చంద్రబాబు కూడా పలు సందర్భాలలో కొందరు మంత్రుల పనితీరు బాగా లేదనీ, వారు తమ తీరు మార్చుకోవాలని పలుమార్లు సూచించిన విషయం తెలసిందే. అయితే ఏ సందర్భంలోనూ కూడా ఆయన పని తీరు బాగా లేని మంత్రుల పేర్లు వెల్లడించలేదు. ఇక బాబు తనదైన శైలిలో ఎప్పటికప్పుడు మంత్రుల పని తీరును సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే.
తనకు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధానికి తెగతెంపులు చేసుకోవడం ఖాయమైపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.
పుట్టా మహూష్ ఇచ్చిన వివరణ ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులోతెలుగుదేశం పార్టీ నాయకుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి విదితమే ఈ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ గా స్పందించి.. పుట్టా మహేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పార్టీ హైకమాండ్ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసి ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాని ఆదేశించింది.
ఆమె పోరాటం ప్రధానంగా తన తండ్రి కేసీఆర్, ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలపైనేనని విస్పష్ట సంకేతాలిచ్చేశాయి. డాడీ అంటే తన తండ్రి కేసీఆర్ అని, చిన్న మోదీ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పరోక్షంగా అయినా స్పష్టంగా చెప్పారు.
ఒకప్పుడు అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీలో కీలక నేతగా, ఆ పార్టీ అధినేత జగన్ కు సన్నిహితుడిగా, ఆయన కుటుంబ బంధువుగా బాలినేని శ్రీనివాసరెడ్డి చక్రం తిప్పారు. అయితే గత ఎన్నికలకు ముందు నుంచే వైసీపీలో బాలినేని పరిస్థితి పొమ్మనలేక పొగపెట్టిన చందంగా మారింది.
తెలంగాణ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ లో 13 వేల 679 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక పోతే మల్లు భట్టి విక్రమార్క మొత్తం 3 లక్షల24 వేల234 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు.
టి.సి. రాజన్ 1967లో స్వతంత్ర పార్టీ తరపున పలమనేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాజకీయాల్లో ఆయన తన సుదీర్ఘ సేవలతో ప్రత్యేక గుర్తింపు పొందారు.
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేయెన్నం శ్రీనివాస్ రెడ్డి శాసనసభ విప్‌లుగా నియమితులయ్యారు. అలాగే శాసనమండలిలో అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌లను విప్‌లుగా నియమించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.