జాతీయ పార్టీలే పోటీకి అర్హులు... లోక్ సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకు చుక్కెదురు
Publish Date:Dec 17, 2019
Advertisement
మోదీ సర్కార్ రెండో సారి అధికారం లోకి వచ్చిన తర్వాత అనేక విషయాల్లో దూకుడు ప్రదర్శిస్తోంది. దశాబ్దాల తరబడి వెంటాడుతున్న సమస్యల్ని సాహసోపేతంగా పరిష్కరిస్తోంది. కేవలం ఆరేడు నెలల్లోనే అనేక చారిత్రక నిర్ణయాలు తీసుకొంది. ఈ సారి లోక్ సభలో కేవలం జాతీయ పార్టీలే పోటీ చేసేలా చట్టాన్ని సవరించే ఆలోచన చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దేశంలో అధ్యక్ష తరహా ప్రజాస్వామ్య దిశగా దేశాన్ని నడిపించడానికి ఇది తొలి మెట్టుగా భావిస్తున్నారు. ఇదే జరిగితే ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాలకే పరిమితమై లోక్ సభ వైపు చూసే పరిస్థితి రాకపోవచ్చు. బిజెపి తన ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాల్లో చాలా వాటిని ఇప్పటికే నెరవేర్చింది. కశ్మీర్ కోసం ప్రత్యేకించిన 370 నిబంధనను రద్దు చేసింది. దాంతో పాటు 35 ఏ కూడా రద్దయింది. ట్రిపుల్ తలాక్ ను కూడా రద్దు చేసింది. అంతేకా కుండా దశాబ్దాల తరబడి నలుగుతున్న రామజన్మభూమి కేసులో కూడా సత్వర తీర్పు వచ్చేలా కేంద్రం చొరవ తీసుకుంది. ఇక కామన్ సివిల్ కోడ్ బిజెపి మ్యానిఫెస్టోలో ఉన్న అంశమే, దీని పైన కూడా త్వరలోనే మోదీ సర్కార్ దృష్టి పెట్టొచ్చు. మోదీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కారు ఎన్నికల సంస్కరణల పైనే ఫోకస్ పెడుతోందని చెప్పుకొంటున్నారు. కేవలం జాతీయ పార్టీలు మాత్రమే లోక్ సభకు పోటీ చేసేలా రాజ్యాంగ సవరణ తెచ్చే ఆలోచన చేస్తోందని ప్రచారం జరుగుతోంది. ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల అంశాలకే పరిమితమై వీసాల జాతీయ ప్రయోజనాలపై దృష్టి సారించలేకపోతున్నాయని బీజేపీ భావిస్తోంది. దీంతో పాటు ప్రాంతీయ పార్టీల జోక్యంతో కేంద్రంలో సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడి లేక పోతున్నాయని కూడా ఆ పార్టీ అభిప్రాయపడుతోంది. అయితే బీజేపీ ఏం చెప్పినా వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో బీజేపీతో కలిసి నడిచే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీల వల్ల అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీనే ఎక్కువగా నష్టపోయింది. బిజెపి రీజినల్ పార్టీల మనుగడను ప్రశ్నార్థకం చేసే ఇటువంటి ఆలోచన చేస్తోందా అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/modi-govt-may-give-big-shock-to-regional-parties-39-92275.html





