కొత్త వేషం కట్టిన ఎమ్మెల్సీ కవిత!?

Publish Date:Jun 16, 2025

Advertisement

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత,కొత్త వేషం కట్టారు. పాఠాలు చెప్పే పంతులమ్మగా మారి పోయారు. అయితే  కవితా టీచర్, అందరు టీచర్లు చెప్పే పాఠాలు చెప్పరు. పొలిటికల్ పాఠాలు మాత్రమే చెపుతారు.అది కూడా అందరికీ కాదు.. ఓన్లీ మహిళలు మరియు యువతకు మాత్రమే కవిత మేడం రాజకీయ పాఠాలు  బోధిస్తారు. అందు కోసం  ఆమె  తెలంగాణ జాగృతి తరపున 'లీడర్' కార్యక్రమాన్ని ప్రారంభించారు. బాగుంది.. ఒకప్పుడు కమ్యూనిస్ట్  పార్టీలు  రాజకీయ పాఠశాలలు నిర్వహించేవి.  అలాగే ఇతర పార్టీలు కూడా శిక్షణ తరగతులు నిర్వహించేవి. ఇప్పుడు అలాంటి పాఠశాలలు ఉన్నాయో లేదో తెలియదు కానీ.. వాటి  అవసరం అయితే వుంది. 

యువతను రాజకీయాల్లోకి రప్పించి, సమాజంలో మార్పు తీసుకురావడానికి అవసరమైన నాయకత్వ నైపుణ్యాలను అభివృద్ధి చేయడం ఈ కార్యక్రమ లక్ష్యంగా కవిత పేర్కొన్నారు. యువత, మహిళలకు తెలంగాణ జాగృతి ఒక రాజకీయ శిక్షణ వేదికగా మారబోతుందని తెలిపారు.రాజకీయాల్లోకి యువత రావడం ద్వారా స్వచ్ఛమైన రాజకీయాలకు నాంది పలుకుతుందని   కవిత సెలవిచ్చారు. 
సో .. సంకల్పం మంచిదే. అదీ కాకుండా ఆమే అన్నట్లు  మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజక వర్గాల పునర్విభజన తర్వాత, ముందు ముందు రాజకీయ నాయకుల అవసరం, మరీ ముఖ్యంగా..  ఎన్నికల్లో పోటీ చేసే మహిళా నాయకుల అవసరం పెరుగుతుంది. అలాగే..  బీసీ రిజర్వేషన్స్ అమలులోకి వచ్చిన తర్వాత  బీసీ నాయకులకు డిమాండ్ పెరుగుతుంది. సో .. కవిత సంకల్పం వరకు అయితే బాగుంది. కానీ.. ఢిల్లీ లిక్కర్ కుంభ కోణంలో జైలుకు కూడా వెళ్లి వచ్చిన ఆమెకు ఆ ఆర్హత, యోగ్యతా ఉన్నాయా  అనేదే ప్రశ్న.   
సరే.. ఆమెకు ఆ అర్హత,యోగ్యతా ఉన్నాయా అనే విషయాన్ని కాసేపు పక్కన పెట్టినా.. నిజంగా ఆమె సంకల్పం అదేనా లేక అటు పార్టీకి, ఇటు ఫ్యామిలీకి దూరమై కొని తెచ్చుకున్న మనుగడ సంక్షోభం నుంచి బయట పడేందుకు ఆమె కొత్త వేషం కట్టరా అనేది పెద్ద పజ్లింగ్  ప్రశ్న. గత వారం పది రోజులుగా ఆమె పడుతున్న అగచాట్లు, ఫేస్ చేస్తున్న అవమానాలను గమనిస్తే..  కవిత  లీడర్  కార్యక్రమం పరమార్ధం  మనుగడ కాపాడు కోవడం కోసమే అని వేరే చెప్ప నక్కర లేదు. 

అవును.. ఉదర పోషణార్ధం బహుకృత వేషం  అంటారు పెద్దలు. అది కాకా పోయినా, కోటి విద్యలు కూటి కొరకే  అనే సామెతను అయితే అందరూ వినే ఉంటారు. అంటే..  బతుకు తెరువు కోసం అనేక వేషాలు వేయక తప్పదని అర్థం. ఆఫ్టరాల్  పొట్ట కూటి కోసమే ఎన్నో వేషాలు వేయక తప్పనప్పుడు రాజకీయాల్లో రాణించాలంటే ఇంకెన్ని వేషాలు వేయవలసి ఉంటుందో వేరే చెప్ప నక్కర లేదు. అందులోనూ.. కాలం కలసి రానప్పుడు, కష్టాలు చుట్టిముట్టినప్పుడు రాజకీయ నాయకులు అవసరార్ధం వేషాలు మార్చక తప్పదు.. ఇప్పడు  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధినాయకురాలు కవిత పరిస్థితి కూడా అదే. అందుకే, ఆమె పంతులమ్మ వేషం కట్టారని అంటున్నారు.

By
en-us Political News

  
ఎట్ట‌కేల‌కు భార‌త్ యువ‌సేన ఇంగ్లండ్ గ‌డ్డ మీద అదీ విజయమన్నదే ఎరుగని ఎడ్జ్ బాస్టెన్ వేదికలో టెస్టు గెలుపు బావుటా ఎగుర‌వేయ‌గ‌లిగింది. కార‌ణం.. ఒక‌టి శుభ్ మ‌న్ గిల్ బ్యాటింగ్, రెండు సిరాజ్- ఆకాష్ దీప్ జోడీ అద్భుత బౌలింగ్.
మ‌స్క్ పెట్టిన పార్టీపై ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చ‌ర్చ న‌డుస్తోంది. ఎందుకంటే అమెరికాలో ఒక‌రు అధ్య‌క్షులు కావాలంటే.. అందుకు ఫ‌స్ట్ వారు జ‌న్మ‌తహ అమెరికా పౌరులై ఉండాలి. 35 ఏళ్ల‌ పైబ‌డి వ‌య‌సుగ‌ల వారై ఉండాలి. ఆపై 14 ఏళ్ల పాటు అమెరికాలోనే నివాసం ఉండి తీరాలి. వీటిలో ఏవీ మ‌స్క్ కి లేవు. ఆయ‌న ద‌క్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో పుట్టారు.
తెలంగాణలో మరో రెండున్నర మూడు నెలల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రధాన పార్టీలు సిద్దమవుతున్నాయి. ముఖ్యంగా, తెలంగాణను రోల్ మోడల్ గా చూపించి జాతీయ స్థాయిలో పునర్జీవనం పొందేందుకు ప్రయత్నిస్తున్న అధికార కాంగ్రెస్ పార్టీ.. స్థానిక సంస్థల ఎన్నికలను, జాతీయ ధృక్కోణంతో చూస్తోంది. అందుకే.. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సంస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్వయంగా రంగంలోకి దిగారు.
అధికారంలో ఉండగా ఇష్టారీతిగా చెలరేగిపోయినా చెల్లినట్లు, అధికారం కోల్పోయిన తరువాత కూడా చెలరేగిపోతామంటే కుదరదన్న విషయం ఇప్పుడు వైసీపీ నాయకులు, క్యాడర్ కు బాగా ఇప్పుడు తెలిసివస్తోంది.
దేశంలో ఏ మూల ఏ స్కాం జరిగినా అందులో వైసీపీ నేతలు కచ్చితంగా ఉంటారు. గంజాయి స్మగ్లింగ్, డ్రగ్స్ అక్రమ రవాణా ఇలా ఏ నేరం జరిగినా.. అందులో వైసీపీ నేతల ప్రమేయం ఉందని దర్యాప్తు సంస్థలు తేలుస్తున్నాయి.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. సోమవారం (జులై 7) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ ఎన్జీ షెడ్ల వరకూ సాగింది.
కేరళలో నిపా వైరస్ కలకలం రేపుతోంది. వేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్ కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాలలో కరోనా నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. క్వారంటైన్ జోన్లు, మాస్కులు అనివార్యం అయ్యాయి.
ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమ్ ఇండియా అద్భుత విజయాన్ని సాధించింది. స్కిప్పర్ శుభమన్ గిల్ ముందుండి జట్టును విజయం దిశగా నడిపించారు. ఈ విజయంతో సిరీస్ ను భారత్ 1-1తో సమం చేసింది.
తిరుమల లో ఈ నెల 15, 16 తేదీలలో శ్రీవారి బ్రేక్ దర్శనాలు ఉండవు. ఆ రెండు రోజులూ శ్రీవారి బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో తెలిపింది.
శ్రీశైలం జలాశయం గేట్లను పరిశీలించిన నిపుణుడు కన్నయ్య నాయుడు.. శ్రీశైలం జలాశయాన్ని రిటైర్డ్ ఇంజినీర్, ప్రాజెక్టుల గేట్లు నిపుణుడు నాగినేని కన్నయ్య నాయుడు ఆదివారం పరిశీలించారు.
పొన్నూరు దాడి ఘటనపై వైసీపీ నాయకులు కావాలనే రాజకీయం చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో స్మార్ట్ కార్డుల రూపంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. క్యూఆర్ కోడ్‌‌తో వివరాలు ప్రత్యక్షమయ్యేలా పాత కార్డుల స్థానంలో కోటిన్నర అగ్రిలో పంపిణీ చేయనుంది.
అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో కలకలం రేపిన ఉగ్ర భంధాలపై పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. రాయచోటిలో దొరి కిన ఉగ్రవాదులతో సన్నిహితంగా మె లిగిన వాళ్లకు సహకరించిన వాళ్లను పోలీసులు గత రెండు మూడు రోజులుగా రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.