మల్లాడి మరో హైడ్రామా
Publish Date:Oct 3, 2012
Advertisement
ప్రతీసారి అవకాశం ఎప్పుడు దొరుకతుందా అని ఎదురుచూసే కేంద్రపాలితప్రాంతమైన యానాం శాసనసభ్యుడు మల్లాడికృష్ణారావు రాజీనామా ద్వారా హైడ్రామాకు తెరలేపారు. తాను యానాం అభివృద్థి కోసం 8 డిమాండ్లు నెరవేర్చాలని కోరితే పుదుచ్ఛేరి సిఎం రంగస్వామి స్పందించనందుకు నిరసనగా తాను ఈ రాజీనామా చేస్తున్నానని ఆయన ప్రకటించారు. తన రాజీనామా లేఖను న్యూఢల్లీ నుంచి పుదుచ్చేరి అసెంబ్లీ స్పీకర్కు పంపించారు. ఈ రాజీనామా ద్వారా యానాంలో తిరిగి తమ కోసం ఎమ్మెల్యే పదవిని కృష్ణారావు వదులుకున్నారన్న ప్రచారం ఆల్రెడీ ప్రారంభమైపోయింది. ఈ ప్రచారంతో యానాం ఓటర్లు ఎన్నికల కోసం మళ్లీ ఎదురుచూస్తారు. ఎన్నికలు రాగానే కృష్ణారావుకు ఓటేస్తారు. దీంతో తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికై అధికారపార్టీపై పెత్తనం చెలాయిస్తారు. ప్రతీసారి అధికారపార్టీపై తన అధికారం చూపే అవకాశం వెదుక్కునే కృష్ణారావు అనుకోకుండా ఈసారి ప్రతిపక్షంలో ఉండిపోయారు. ప్రజలు ఎన్నుకుంటే తాను వదులుకున్నా ఓటర్లు గెలిపించుకున్నారని అధికారపార్టీపై కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేయవచ్చు. తాజాగా జరిగిన ఎన్నికల్లో కృష్ణారావు గెలుపొందిన తీరు పరిశీలిస్తే ఆయన ఇంట్లో నుంచి రూపాయి తీయకుండా నేను కావాలనుకుంటే గెలిపించుకోండి, నాకు పదవీవ్యామోహం లేదు, నేను పేదవాడిని, గెలిపిస్తే మాత్రం సేవ చేసుకుంటానని మల్లాడి మౌనం వహించారు. ప్రచారం వదిలేసి ఇంట్లోనే ఉండిపోయిన మల్లాడిని యానాం ఓటర్లు గెలిపించుకున్నారు. ఇలాంటి హైడ్రామాలు ఆడటంలో అనుభవమున్న మల్లాడి మళ్లీ తెరపై తన హంగామాను మొదలుపెట్టారు. స్పీకర్ రాజీనామా ఆమోదిస్తే ఒకరకంగానూ, ఆమోదించకపోతే మరో రకంగానూ మల్లాడి మాట్లాడే అవకాశాలున్నాయి. ఇప్పటికే సిఎంకు వ్యతిరేకంగా కొందరు ఎమ్మెల్యేలను చేరదీసిన మల్లాడి అంత అకస్మాత్తుగా రాజీనామా చేశారంటే ఆలోచించాల్సిన విషయమేనని రాజకీయపరిశీలకులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/mla-malladi-krishna-rao-24-17849.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





