ప్రచారాభిలాషలో బాబుకు ప్రథమస్థానం?
Publish Date:Oct 3, 2012
Advertisement
ఎటువంటి చిన్న అవకాశం లభించినా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు దాన్ని భారీస్థాయిలో ప్రచారం చేసుకుంటారు. చేసినది కొంచెమైనా ప్రచారం భారీగా చేసుకునే స్టయిల్ చంద్రబాబు సొంతమంటారు. రాష్ట్రంలో ఇటువంటి ప్రచారాభిలాష ఉన్న నేతలే తక్కువని కూడా గుర్తించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకమునుపు పత్రికలకు ప్రచారం కోసం భారీగా డబ్బు ఖర్చు పెట్టిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీకే దక్కింది. ఓ ప్రత్యేకమైన వాటా వేసి మరీ పత్రికలను అప్పట్లో బాబు పోషించారు. ఆ తరహాలో ఇంకెవ్వరూ ప్రచారం చేయలేరని కూడా ఆయన నిరూపించారు. అందుకే అప్పటి ప్రతపక్షనేత వైఎస్ రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబులాంటి ప్రచారకర్త ఏమి చేసినా అబ్బురమే మరి అని కూడా వ్యాఖ్యానించారు. దీనికి బాబు సమాధానం ఇవ్వలేదు. చంద్రబాబు అథికారంలో ఉన్నప్పుడు గోదావరి పుష్కరాలు జరిగాయి. ఆ పుష్కరాలకు బాబు కాబట్టి అంత డబ్బు ఖర్చు పెట్టారని పలువురు కొనియాడారు. రాజమండ్రి రహదారులతో సహా అన్ని రూపురేఖలు అకస్మాత్తుగా మార్చేసిన ఘనత, ప్రచారం చంద్రబాబుకే దక్కింది. ఇలా చెప్పుకుంటూ పోతే బాబు ప్రచారం కోసం ఏదో ఒక వింత పని చేయటం కూడా అలవాటు చేసుకున్నారు. ఇటీవల విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్తో ఢీ కొనేందుకు సిద్ధమైన బాబు అస్సలు రాజగోపాల్కు దొరక్కుండా తిరిగేసి హైదరాబాద్ చేరుకోవటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అలానే తాజాగా పాదయాత్రలను ప్రారంభిస్తూ సినీదర్శకుల సూచనలు పాటిస్తామన్నారు. ఇలాంటి వింతతరహా ప్రచారానికి బాబు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు.
http://www.teluguone.com/news/content/first-place-to-chandrababu-24-17850.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





