మిస్ వ‌ర‌ల్డ్ పోటీల్లో చేనేత అందాల ఆర‌బోత‌

Publish Date:Apr 19, 2025

Advertisement

ఇంత‌కీ ఏంటీ పోచంప‌ల్లి ఇక్క‌త్ చీర ప్ర‌త్యేక‌త‌?
అన‌సూయ‌ది కూడా పోచంప‌ల్లి అంద‌మేనా! 

మే 7 నుంచి మే 31 వ‌ర‌కూ హైద‌రాబాద్ లో జ‌రిగే మిస్ వ‌ర‌ల్డ్ పోటీల్లో చేనేత అందాల‌ను ప్ర‌ద‌ర్శించేలా ఒక ఏర్పాటు చేయ‌నుంది రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ. ఈ పోటీల సంద‌ర్భంగా ఇక్క‌డికి 140 దేశాల‌కు సంబంధించిన వారు రానున్నారు.  వీరిని మే 15న పోచంప‌ల్లికి తీసుకెళ్లాల‌ని భావిస్తున్నారు. 

అంతే కాదు వీరి చేత పోచంప‌ల్లి వ‌స్త్రాల‌ను ధ‌రింప చేసి.. ప్ర‌మోట్ చేయాల‌నుకుంటున్నారు. ఇందు కోసం పోచంప‌ల్లి చేనేత క‌ళాకారుల చేత ప్ర‌త్యేక ప్ర‌ద‌ర్శ‌న‌లు చేయించ‌నుంది రాష్ట్ర ప్ర‌భుత్వం. స్థానిక చేనేత క‌ళ‌ల‌పై అతిథుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించ‌డం మాత్ర‌మే కాక‌.. ఆయా వ‌స్త్రాల  ప్ర‌త్యేక‌త‌ల‌ను తెలియ చేయ‌నున్నారు. 

క‌ళాకారుల‌తో అతిథులు మాట్లాడ్డానికి గానూ.. ట్రాన్స్ లేట‌ర్ల‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారంటే చేనేత కళ ప్రమోషన్ విషయంలో ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో, పట్టుదలతో ఉందో  ఊహించుకోవ‌చ్చు. అలాగే, గద్వాల్‌ సిల్క్‌, సిద్దిపేట దగ్గరలోని గొల్లభామ కాటన్‌, నారాయణపేట వస్త్రాలకు సంబంధించిన స్టాల్స్‌ను కూడా పోచంపల్లిలో ఏర్పాటు చేయ‌నున్నారు. 

పోచంపల్లి పర్యటనకు వచ్చిన వారంతా ఈ స్టాల్స్‌ను కూడా సందర్శిస్తారు. ఆయా స్టాల్స్‌లో ప్రదర్శించే వస్త్రాల విశేషాలు కూడా విదేశీయులకు అర్థమయ్యేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఈ ప

ర్యటన మొత్తం రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరగనుండగా..  విదేశీ అతిథుల కోసం పోచంపల్లిలో తెలంగాణ జానపద కళా ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.దీంతో ఎక్క‌డిదీ పోచంప‌ల్లి అన్న చ‌ర్చ మొద‌లైంది. ఇది  తెలంగాణ లోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ప్రాంతం.

పోచంప‌ల్లి చేనేత క‌ళాకారులు నిలువు పేక‌ల మ‌గ్గంపై నేసిన చేనేత క‌ళాఖండాల‌కు ప్ర‌పంచ వ్యాప్త గుర్తింపు ఉంది. హైద‌రాబాద్ కి 35కిలోమీట‌ర్ల దూరంలో ఉండే పోచంప‌ల్లి.. ఇటు చేనేత‌, అటు భూదానోద్య‌మానికి ప్ర‌సిద్ధి చెందిన‌ది.

ఇక్క‌డ చేనేత చీర‌లు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉండే  స్త్రీ మూర్తులంద‌రినీ విశేషంగా ఆక‌ట్టుకుంటాయి. ఈ చీర‌లు ప్ర‌పంచ వ్యాప్తంగా  ఉన్న  ఆయా ప్రాంతాల మేని ఛాయ‌ల‌న్నిటికీ న‌ప్పి.. ఆయా స్త్రీమూర్తుల‌లోని మ‌హిళా శ‌క్తిని  మ‌రింత ప్ర‌జ్వ‌రిల్లేలా చేస్తాయి. అందుకే పోచంప‌ల్లి చీర కేవ‌లం మ‌హిళ ఒంటిని మాత్ర‌మే కాదు ఈ భూగోళం మొత్తం  చుట్టేసిన ఖ్యాతి సంపాదించిందని అంటారు. 

అలాంటి పోచంప‌ల్లిలో తొలుత నూలు చీర‌లు మాత్ర‌మే నేసేవారు. డెబ్భైల నుంచీ ప‌ట్టు చీర‌ల త‌యారీ మొద‌లైంది. ఇద్ద‌రు యువ‌కుల‌ను బెంగ‌ళూరుకు పంపి ప‌ట్టు నేతలో మెల‌కువ‌లు తెలుసుకోమ‌న్నారు. ఇది పోచంప‌ల్లి చేతి మ‌గ్గాల ద‌శ- దిశ మార్చేలా చేసింది. ఈ చీర‌లు ఎంతో మోడ్ర‌న్ గా ఉంటాయి. ఈ చీర‌ల త‌యారీ ఇక్క‌త్ మీద ఆధార‌ప‌డుతుంది. ఈ ప‌నిత‌నం చీరాల నుంచి ఈ ప్రాంతానికి వ‌చ్చిందని అంటారు. నూలుతో చేసిన ప్ర‌యోగం విజ‌య‌వంతం కావ‌డంతో అది ప‌ట్టు మీద కూడా చేయ‌డం మొద‌లెట్టారు.

గుజ‌రాత్, ఒడిశాలాగా ఇక్క‌త్ నేత‌కు తెలంగాణ‌లోని పోచంప‌ల్లి ఎంతో ఫేమ‌స్ అయ్యింది. 1953 లో తొలిసారిగా పోచంపల్లిలో ఇక్కత్ కళ మొదలైంది. కర్నాటి అనంతరాములు అనే పెద్దాయన గుజరాత్ లోని బెనారస్ వెళ్లి.. అక్క‌డ‌ శిక్షణ తీసుకుని సిల్క్ తో ఇక్కత్ కళను వెలుగులోకి తెచ్చారు. ఇక్కత్ కళకు 2003 లో భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ హక్కులు లభించాయి. 

ఇక్కడ ఉత్పత్తయ్యే చేనేత చీరలు 2 వేల రూపాయల నుంచి యాభై, అరవై వేల రూపాయల వరకు ధర పలుకుతాయంటే అతిశ‌యోక్తి కాదు. తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలకు చెందిన‌ ప్రముఖ సినీతారలు, అనేక మంది రాజకీయ నాయకులు, ఇతర దేశాల నుంచి వ‌చ్చిన‌ మహిళలు.. పోచంపల్లి చేనేత కార్మికులు తయారుచేసిన చీరలపై ఎక్కువ‌గా మక్కువ చూపుతుంటారు.  

తెలంగాణ గాంధీగా పిలుచుకునే కొండా లక్ష్మణ్ బాపూజీ చొరవతో చేనేత సహకార సంఘాలు ఏర్పాటు చేశారు. దీంతో పోచంపల్లి చేనేత పరిశ్రమ కేవలం పోచంపల్లికి మాత్ర‌మే పరిమితం కాకుండా జిల్లాలోని చౌటుప్పల్, కొయ్యలగూడెం, పుట్టపాక, గట్టుప్పల్, సిరిపురం, ఎల్లంకి, రామన్నపేట, నాగారం, బోగారం గ్రామాలకు విస్తరించింది. దీంతో పాటు వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాలో కూడా ఎంద‌రో కార్మికులకు పోచంపల్లి డిజైన్ చీరలు ఉపాధి కల్పిస్తున్నాయి. 

ఇక్కడి చేనేత టైఅండ్ డై అసోసియేషన్, చేనేత సహకార సంఘం ఎంతో కృషి చేసి 30 రకాల డిజైన్లకు పేటెంట్ హక్కు కల్పించాలని జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ కి పలుమార్లు విన్నవించింది. కానీ, కేవలం 11 రకాల డిజైన్లనే పేటెంట్ హక్కును కల్పించేందుకుగాను 1999లో గుర్తించింది. 2000లో పేటెంట్ హక్కును కల్పించారు. దేశచరిత్రలో కార్మికుడు సాధించిన ఘన విజయంగా దీనిని అభివ‌ర్ణిస్తారు.

పోచంపల్లి చీరకు 2005లో భౌగోళిక గుర్తింపు, జాగ్రఫికల్ ఇండికేషన్ లేదా ఇంటలెక్చుయల్ రైట్స్ కి ర‌క్ష‌ణ‌ లభించింది. పోచంపల్లి లో తయారైన ఇక్కాత్ శైలి పోచంపల్లి చేనేత సహకార సంస్థ లిమిటెడ్, పోచంపల్లి హాండ్లూం టై అండ్ డై సిల్క్ సారీస్ తయారీ అసోసియేషన్ రిజిస్టర్డ్ ప్రోపర్టీగా గుర్తింప బడింది.

అయితే పోచంప‌ల్లి ఇక్క‌త్ కి న‌కిలీలు రావ‌డం మొద‌లైంది. దీనిపై కాంగ్రెస్ ఎంపీ చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి పోరాడుతూ.. పార్ల‌మెంటులో గ‌ళ‌మెత్తారు. అంతే కాదు, వాణిజ్య మంత్రికి ఈ దిశ‌గా ఒక లేఖ సైతం రాశారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పోచంపల్లి ఇక్కత్‌ చీరల నకిలీలను అరికట్టి.. చేనేత రక్షణ కోసం రూ.100 కోట్లతో నిధి ఏర్పాటు చేయాలని భువనగిరి ఎంపీ చామల త‌న లేఖ‌లో కోరారు.

ఇక పోచంప‌ల్లి మ‌రో అందాల ఆర‌బోత‌ విష‌యానికి వ‌స్తే జబ‌ర్ద‌స్త్ యాంక‌ర్ అన‌సూయ కూడా పోచంప‌ల్లికి చెందిన అంద‌మే. అయితే పోచంప‌ల్లి చీర నూలుతో చేసిన అంద‌మైతే.. అదే అన‌సూయ న‌వ్వుల‌తో త‌యారైన అందం. ఆమె యాంక‌రింగ్ చేసిన‌ జ‌బ‌ర్ద‌స్త్ లో వ‌చ్చే స్కిట్ల‌లో అక్క‌డ కామెడీ ఉన్నా లేక పోయినా త‌ను ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుతూ ఆ ముత్యాల‌ను ప్రేక్ష‌కుల చేత‌ ఏరుకునేలా చేసిన న‌వ్వుల అందం అన‌సూయ‌. ఈమెది కూడా ఈ పోచంప‌ల్లే. వీరికి ఈ ఊరిలో వంద గ‌డ‌ప‌ల ఇల్లు ఒక‌టి ఉంద‌ని స‌మాచారం. ఇది అతి పురాత‌న‌మైన ఇల్లుగా చెబుతారు.

ఇదండీ పోచంప‌ల్లి వెన‌క దాగిన అనేక విశేషాల స‌మాచార స‌మాహారం.. చూశారుగా మ‌న చెంత‌నే ఉన్న పోచంప‌ల్లికి ఎక్క‌డో విదేశీయులు వ‌స్తున్నార‌ని తెలిసి.. ఆరా తీస్తే ఇన్నేసి విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి గ‌మ‌నించారా!!!

By
en-us Political News

  
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్‌లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్‌ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.
ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు. తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు.
గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.