మైనారిటీల హక్కుల దినోత్సవం 2024…వెనుకబడిన ప్రజలకు అపురూప వరం మైనారిటీ హక్కులు..!

Publish Date:Dec 18, 2024

Advertisement

 

ప్రపంచంలో ప్రతీ దేశంలోనూ వేర్వేరు జాతులవారు, వేర్వేరు భాషలవారు,  వేర్వేరు మతపరమైన విశ్వాసాలు కలిగినవారు ఉంటారు. ఇందులో కొన్ని వర్గాల వారు సంఖ్యాపరంగా చాలా ఎక్కువగా ఉంటారు.  కొన్ని వర్గాలవారి సంఖ్య  తక్కువ లేదా చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి వారిని మైనారిటీలగా గుర్తిస్తారు. ఇక భారతదేశం గురించి మాట్లాడుకుంటే, మన దేశంలో ఉన్నంత  భిన్నత్వం ఏ దేశంలోనూ  ఉండదు. అయినా సరే భిన్నత్వంలో ఏకత్వానికి మంచి ఉదాహరణగా ఇప్పటికీ నిలుస్తుంది. దీనికి కారణం మన భారత రాజ్యాంగం దేశ పౌరులందరికీ  సమాన హక్కులను అందించడమే కాకుండా భాష, జాతి, సాంస్కృతిక, మతపరమైన మైనారిటీల  హక్కులను రక్షించడానికి పలు చర్యలను అమలు చేసింది. మైనారిటీల హక్కులు, భద్రత, అభివృద్ధి గురించి అవగాహన కల్పించడం,  మైనారిటీల సమస్యలను గుర్తించి, వారి రక్షణ కోసం చర్యలు తీసుకోవటానికి భారతదేశంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 18న మైనారిటీల హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.


మైనారిటీ హక్కుల దినోత్సవం  ఎప్పుడు మొదలైంది..


మొదటి మైనారిటీ హక్కుల దినోత్సవం 2013లో ప్రారంభమైంది. ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించిన  మైనారిటీల హక్కుల ప్రకటనపై  సంతకం చేసిన తరువాత మనదేశం ఈ దినోత్సవాన్ని జరపడం ప్రారంభించింది. భారత ప్రభుత్వం 1992లో స్థాపించిన ‘జాతీయ మైనారిటీ కమిషన్ (NCM)’, ఈ  మైనారిటీల హక్కులని కాపాడటంలో ముఖ్యపాత్ర పోషిస్తోంది.

2024 థీమ్...

ప్రతి సంవత్సరం ప్రత్యేకమైన థీమ్‌ను ఎంపిక చేస్తారు.  2024 సంవత్సరానికి “వైవిధ్యాన్ని ప్రోత్సహించటం, హక్కులను కాపాడటం” అనే థీమ్ ప్రకటించారు.  మన దేశంలో మత, భాష, సాంస్కృతిక, సామాజిక పరంగా ఉన్న వైవిధ్యాన్ని గుర్తించి  మైనారిటీల హక్కులను కాపాడాల్సిన  అవసరాన్ని ఈ  థీమ్ తెలియజేస్తుంది.

మైనారిటీ హక్కుల దినోత్సవం  ఎందుకు అవసరం..

మైనారిటీలకు సమాన హక్కులు, సామాజిక న్యాయం అందించడంతో పాటు వారి అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది.  రాజ్యాంగపరంగా, చట్టపరంగా మైనారిటీలకి ఉన్న  హక్కుల గురించి అవగాహన కల్పిస్తుంది. సామాజిక, ఆర్థిక, విద్యా లోటుపాట్లను తొలగించటానికి కృషి చేస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 29, ఆర్టికల్ 30 క్రింద మైనారిటీలకు హక్కులు కల్పిస్తుంది. ప్రభుత్వాలు, ఎన్జీవోలు, ప్రజలు అందరూ కలిసి మైనారిటీల సంక్షేమం కోసం  పనిచేయాలని పిలుపునిస్తుంది.

భారతదేశంలో ఎవరు మైనారిటీలు?

భారతదేశంలో మైనారిటీలను మతం, భాష, సంస్కృతిపై ఆధారపడి నిర్వచిస్తారు. జాతీయ మైనారిటీ కమిషన్ ప్రకారం, 6 మత సమూహాలు అధికారికంగా మైనారిటీగా గుర్తించబడ్డాయి. మొదట ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు(జొరాష్ట్రియన్లు) మైనారిటీలుగా గుర్తించబడ్డారు. ఆ తర్వాత 2014లో జైనులను కూడా మైనారిటీలో భాగం చేశారు.  2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలోని మైనారిటీల్లో మొదటి స్థానంలో ముస్లింలు, చివరి స్థానంలో పార్శీలు ఉన్నారు. కేవలం మతం ఆధారంగానే కాకుండా  భాష, జాతి ఆధారంగా  కూడా మైనారిటీ వర్గాలు భారతదేశంలో ఉన్నాయి. మైనారిటీలందరికీ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 29, 30..  సాంస్కృతిక, విద్యా హక్కులను రక్షిస్తాయి.

నేషనల్  మైనారిటీ కమిషన్ పాత్ర....

జాతీయ మైనారిటీ కమిషన్ 1992లో స్థాపించబడింది. ఇది మైనారిటీల హక్కులను రక్షించి, వారి సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తుంది. మైనారిటీల రాజ్యాంగ హక్కుల అమలును పర్యవేక్షించటం, హక్కులకి భంగం కలిగినప్పుడు ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించడం, మైనారిటీల అభివృద్ధికి పాలసీలను సిఫార్సు చేయటం,  వారి  ఆర్థిక, సామాజిక పురోగతిని సమీక్షించటం ఈ కమిషన్ ముఖ్య విధులుగా ఉన్నాయి.
మైనారిటీల హక్కులని కాపాడటానికి,  చాలా రాష్ట్రాల్లో కూడా  స్టేట్ మైనారిటీ కమీషన్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఇవి కూడా మన రాజ్యాంగానికి అనుగుణంగానే  మైనారిటీల హక్కుల్ని కాపాడి, వారి అభివృద్ధికి కృషి చేస్తాయి.

 మైనారిటీ హక్కుల దినోత్సవం ద్వారా ప్రభుత్వం, సమాజం, ప్రజలు  కలిసికట్టుగా మన దేశంలో సమానత్వం, న్యాయం కోసం పని చేయాలి. మన దేశ అభివృద్ధిలో మైనారిటీల పాత్రని కూడా గుర్తించాలి. సమాజంలో ఏ ఒక్కరూ వివక్షకి గురి కావటమో లేక హక్కులకి, అభివృద్ధికి దూరం కాబడటమో అనేది  వారితోపాటూ ఆ సమాజానికే మంచిది కాదు.  కాబట్టి  మైనారిటీల హక్కులను పరిరక్షించే సమాజాన్ని నిర్మించేందుకు అందరం కృషి చేయాల్సిన అవసరం ఉందని గ్రహించి, ఆ దిశగా పని చేయాలి. ఇలా ఉన్నప్పుడు  మన భారతదేశం ఎప్పటికీ భిన్నత్వంలో ఏకత్వానికి  ఉత్తమ ఉదాహరణగా నిలిచిపోతుంది.

                                         *రూపశ్రీ.
 

By
en-us Political News

  
సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. నేటి బిజీ బిజీ జీవితాలలో మనస్ఫూర్తిగా,  సంతోషంగా గడిపిన క్షణాలు వెతుక్కోవాల్సి వస్తోంది. అందరూ ఉద్యోగాలు చేస్తారు,  వ్యాపారాలు చేస్తారు, సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు....
ప్రపంచంలో అన్ని రకాల మనుషులు  ఉంటారు.  మనుషులకు ఒక్కొక్కరికి ఒక్కో వ్యక్తిత్వం కూడా ఉంటుంది. ప్రపంచంలోని గొప్ప వ్యక్తులను లేదా మన చుట్టూ ఉండే గొప్ప వ్యక్తులు లేదా శక్తివంతమైన వ్యక్తులను గమనిస్తే...
విజయం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక లక్ష్యంగా ఉంటుంది.  చదువు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ప్రతి విషయంలో ఒక లక్ష్యం పెట్టుకుని,  దాన్ని సాధించి,  విజయ బావుటా ఎగరవేయాలని అనుకుంటారు చాలా మంది...
మంచి, చెడు ప్రతి మనిషిలోనూ తప్పకుండా ఉండే గుణాలు.  మనుషులు కొన్ని విషయాల్లో మంచిగా, మరికొన్ని విషయాల్లో చెడ్డగా ఉంటారు. పూర్తీగా మంచితనం ఉన్న మనుషులు, పూర్తీగా చెడ్డగా ఉన్న మనుషులు ఎక్కడా ఉండరు...
అపరాజిత లేదా శంఖు పుష్పాలు నీలం ,  తెలుపు రంగులో ఉంటాయి.  ఈ పువ్వులు  చాలా అందంగా ఉంటాయి. శంఖు పుష్పం మొక్కను దేవతా మొక్కగా పరిగణిస్తుంటారు.  ఈ పువ్వులు  సంతోషం, శ్రేయస్సు,  సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. వేసవిలో...
వేసవి వచ్చేసింది, తీవ్రమైన ఎండ , మండే ఎండలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి.  ఈ ఎండల ఇబ్బందికి తోడు వేసవిలో కరెంట్ కోత కూడా దారుణంగా ఉంటుంది. దీనివల్ల ఇంట్లో ఉండటం చాలా కష్టమవుతుంది.
గుడ్ ఫ్రైడే క్రైస్తవ మతంలో అత్యంత పవిత్రమైన,  భావోద్వేగభరితమైన రోజు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రైస్తవులు యేసు క్రీస్తు శిలువపై మరణించిన సంఘటనను స్మరించుకుంటారు...
పిల్లలను సరిగ్గా పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. ఒక చిన్న పొరపాటు కూడా పిల్లల జీవితాన్ని నాశనం చేయగలదు. సరైన పెంపకం పిల్లలను విజయ శిఖరాలకు చేరుస్తుంది అనడంలో  ఎలాంటి సందేహం లేదు...
నేటి డిజిటల్ ప్రపంచంలో, పిల్లలకు, ముఖ్యంగా టీనేజర్లకు చదువుకునేటప్పుడు ఏకాగ్రత పెట్టడం చాలా కష్టంగా మారుతోంది. స్మార్ట్‌ఫోన్‌లు, గేమ్‌లు, సోషల్ మీడియా,  మరెన్నో విషయాలు వారి చదువుకు చాలా..
వేసవికాలం అలా రాగానే.. అందరికీ చల్లదనం కావాలని అనిపిస్తుంది.  పడుకోవడానికి గది చల్లగా ఉండాలి.. దుకోసం కూలర్లు, ఏసీలు రెఢీ చేసుకుంటారు. అలాగే చల్లగా నీరు తాగాలని అనిపిస్తుంది.  నేటికాలంలో ప్రతి ఇంట్లో ఫ్రిజ్ లు ఉండటం సహజమే అయినా ఫ్రిజ్ లో ఉంచిన నీరు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతుంటారు...
జైనమత 24వ తీర్థంకరుడు మహావీరుడు ఆధ్యాత్మికత ద్వారా తన జీవితాన్ని మార్చుకున్నాడు. యువరాజు వర్ధమానుడు  తన సాధన,  ఆధ్యాత్మిక మార్గం ద్వారా  మహావీరుడిగా  పరివర్తన చెందాడు.  అయితే ఇలా పరివర్తన చెందడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది..
భార్యాభర్తల బంధం చాలా ప్రత్యేకమైనది. నేటికాలంలో భార్యాభర్తల బంధం పెళుసుగా మారిందని చెప్పవచ్చు.  బార్యాభర్తలు గొడవ పడటం అనేది చాలా కామన్ గా మారింది.  అయితే కొన్నిసార్లు గొడవలు కాస్తా బంధాన్ని విచ్చిన్నం చేసే..
వేసవి వచ్చేసింది.. ఈ మండే ఎండల వల్ల ప్రతిఒక్కరూ చాలా ఇబ్బంది పడతారు, వేసవికాలం చాలా ఆరోగ్యపరంగా చాలా   ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన కాలం...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.