తెలంగాణ అప్పులపై చర్చకు సిద్దమని మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బహిరంగ చర్చకు రావాలని ఆహ్వానించారు. "మీరు చెప్పిన అప్పుల లెక్కలే తప్పని తేలితే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా? లేక ప్రజలకు క్షమాపణ చెబుతారా?" అని మంత్రి ప్రశ్నించారు. వాట్సాప్ ద్వారా కూడా అప్పుల వివరాలను వారికి పంపించినట్లు తెలిపారు. "నేను ఎప్పుడూ తోక ముడవలేదు. వెనక్కి తగ్గే స్వభావం నాది కాదు.
ఇష్టారీతిన మాట్లాడితే చూస్తూ ఊరుకోను. ప్రజల ముందు నిజాలు బయటపెట్టడానికి ఎలాంటి చర్చకైనా సిద్ధమే" అని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. నేను చెప్పిన అప్పుల లెక్కలు తప్పని రుజువు చేయండి. నా వాదన తప్పని నిరూపిస్తే ఇప్పటికీ రాజీనామాకు సిద్ధంగా ఉన్నాను" అని జూపల్లి ప్రకటించారు. దీనిపై మాటల యుద్ధం కాకుండా రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలను కోరారు. మంత్రి విసిరిన ఈ సవాల్కు బీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/minister-jupally-krishna-rao-36-224973.html
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ (కన్నేపల్లి) పంప్ హౌస్ వేదికగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా సామాన్య ప్రజల సమస్యలపై నాయకులు స్పందించే తీరు మారుతోంది.
ఆధునిక రాజకీయాల్లో ఎలక్షన్ స్ట్రాటజిస్ట్లు (ఎన్నికల వ్యూహకర్తలు), పొలిటికల్ మేనేజ్మెంట్ కంపెనీల హవా నడుస్తోంది.
సినీ నటుడు ప్రకాష్ రాజ్పై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.
తెలియని వయసులో ప్రేమ.. భర్త వేధింపులు..!
పూణెకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్యతో తీవ్ర విషాదంలో ఉన్న ఆ కుటుంబాన్ని మరో దుఃఖం వెంటాడింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన డీఎస్పీ భీమ్ రెడ్డి వ్యవహారంలో దర్యాప్తు వేగం పెంచిన ఏసీబీకి కీలక ఆధారాలు లభించాయి.