వైజాగ్ కాంగ్రెస్ లో సిగపట్లు

Publish Date:Apr 29, 2013

Advertisement

 

ఇంకా ఎన్నికలకి ఏడాది సమయం ఉండగానే, వైజాగ్ లో కాంగ్రెస్ నేతలందరూ ఎవరి ప్రయత్నాలలో వారు బిజీ అయిపోయారు. కొందరు తమకే టికెట్ ఇప్పించవలసిందిగా పార్టీ పెద్దల దగ్గర పైరవీలు చేసుకొంటుంటే, మరికొందరు తమకు పోటీగా ఉన్న వారిని రంగంలోంచి తప్పించేందుకు పావులు కదుపుతున్నారు.

 

ఈ విషయంలో అందరి కంటే ముందుగా రాజ్యసభ సభ్యుడు టీ.సుబ్బిరామి రెడ్డి రంగంలోకి దిగి అటు డిల్లీలోను, ఇటు నగరంలోనూ ప్రయత్నాలు ముమ్మరం చేసారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇటీవల నగరంలో అంబులెన్స్ సర్వీసులను కూడా ప్రారంబించారు.

 

ఇక కాంగ్రెస్ పార్టీలో ముటాలు కట్టుకోవడానికి పెద్ద కారణాలేవీ అక్కరలేదనే సంగతి అందరికీ తెలిసిందే. మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలి, అనకాపల్లి ప్రాంతాలను విశాఖలో విలీనం చేద్దామనే ప్రతిపాదన చేయగా దానిని సుబ్బిరామి రెడ్డి సమర్దించారు. కానీ, పురందేశ్వరి మరియు విశాఖ దక్షిణ శాసన సభ్యుడు మరియు నగరంపార్టీ అధ్యక్షుడు తైనాల విజయకుమార్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సమస్యను పరిష్కరించేదుకు శాసనసభ్యులతో కూడిన ఒక కమిటీని కూడా నియమించడం జరిగింది. ఆ కమిటీ విలీన ప్రతిపాదనను నిర్ద్వందంగా ఖండించడంతో దానిని సమర్దిస్తున్న వారిరువురి అహం దెబ్బతింది.

 

అటువంటి సమయంలో పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ రాష్ట్రంలో జిల్లా, నగర, మండల స్థాయి వరకు పార్టీలో మార్పులు, చేర్పులు చేస్తుండటంతో ఇదే అదునుగా గంటా శ్రీనివాసరావు ‘ఒక వ్యక్తికి ఒక పదవి’ అనే రాహుల్ గాంధీ ప్రతిపాదించిన ఫార్ములాను తెలివిగా ఉపయోగించుకొని, తనను వ్యతిరేకిస్తున్న తైనాలను ఆ పదవిలోంచి తప్పించి తన అనుచరుడు బెహరా భాస్కర్ రావుని నియమించుకొన్నారు. అందుకు సుబ్బిరామిరెడ్డి కూడా ఓ చెయ్యేసి తోడ్పడారని సమాచారం.

 

తద్వారా మంత్రి గంటా తనను వ్యతిరేకించినందుకు తైనాల పదవికి కత్తెరవేసి తన తడాఖా చూపించానని సంతోషిస్తే, తద్వారా పురందేశ్వరికి తన తడాఖా చూపానని సుబ్బిరామిరెడ్డి కూడా సంతోషిస్తున్నారు. పనిలో పనిగా ఆమెను కూడా మెల్లగా పోటీలోంచి తప్పించాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక, గతంలో కార్పొరేటర్ గా ఉన్న తన అనుచరుడు భాస్కర్ రావుని ముందుకు తేవడం ద్వారా రాబోయే ఎన్నికలలో తనను వ్యతిరేకిస్తున్నమరో విశాఖ శాసనసభ్యుడిని కూడా రేసులోంచి తప్పించాలని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

 

ఈ సిగపట్లు ఎన్నికలు దగ్గిరపడుతున్న కొద్దీ ఇంకా పెరుగుతాయే తప్ప తగ్గవు. ఇటువంటి రాజకీయాలను చూస్తుంటే రాహుల్ గాంధీ వల్లె వేస్తున్న నీతి సూత్రాలని కాంగ్రెస్ పార్టీలో అమలు చేయడం ఎన్నటికయినా సాధ్యమేనా అనే ప్రశ్న ప్రజలకి ఉదయించక మానదు.

By
en-us Political News

  
తెలంగాణ మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు ప్రభంజనం సృష్టిస్తోంది.
అసెంబ్లీ సాక్షిగా నేడు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
గత ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత ఆ పార్టీలో నాయకులు, శ్రేణులూ పూర్తిగా డీలా పడ్డాయి. దానికి తోడు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకు వలస వెళ్లిపోయి, ఎలాగో తీరిక చేసుకుని వారానికి ఒక సారి మాత్రం ఆంధ్రప్రదేశ్ వచ్చి.. వెడుతున్నారు. దీంతో ఆయన పూర్తిగా పార్ట్ టైమ్ పొలిటీషియన్ గా మారిపోయినట్లైందని పార్టీ శ్రేణులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ పై విజయం సాధించిన పది మంది ఎమ్మెల్యేలు ఆ తరువాత కాంగ్రెస్ గూటికి చేరారంటూ బీఆర్ఎస్ అరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారించిన స్పీకర్ ఎమ్మెల్యేల వాదనలు విన్నారు.
స‌చివాల‌యంలో కేటీఆర్ కి ఇంత నెట్ వ‌ర్క్ ఉందా? అని విస్తుపోయింది. విచారణకు ఆదేశించి.. లీకు వీరులు ఎవరైనా, ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలూ జారీ చేసింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తినలో బిజీబిజీగా ఉన్నారు. ఓ వైపు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తూనే, మరో వైపు కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశం అవుతూ క్షణం తీరక లేకుండా గడుపుతున్నారు.
ఐడీపీఎల్ భూముల విషయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కవిత ఇటీవల పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ భూముల వ్యవహారం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.
గత జగన్ ప్రభుత్వ హయాంలో అప్పటి విపక్ష నేత చంద్రబాబును స్కిల్ కేసు పేరుతో అక్రమంగా అరెస్టు చేసిన సమయంలో నారా బ్రహ్మణి తొలి సారిగా ప్రజల మధ్యకు వచ్చి అరెస్టునకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ఆ సందర్భంగా ఆమె ప్రసంగాలు ప్రజలను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
జగన్ అధికారంలో ఉన్న సమయంలో తమకు ఎదురే లేదన్నట్లు చెలరేగిపోయిన వైసీపీ నేతలు, అప్పటి తన కర్మఫలాన్ని ఇప్పుడు అనుభవించక తప్పడం లేదు.
సామాజిక తెలంగాణయే తన లక్ష్యమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి స్పష్టం చేశారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందుగానే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని క్లారిటీ ఇచ్చారు.
తాజాగా ఉత్తరాంధ్ర జిల్లాలలో పర్యటిస్తున్న నాగబాబు ఆదివారం శ్రీకాకుళంలో జనసేన నేతలు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా ఎన్నికలలో తన పోటీ గురించి వచ్చిన ప్రస్తావనపై స్పందించిన ఆయన తాను మాత్రం ఎన్నికలలో పోటీ చేసే ప్రశక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు.
తెలుగుదేశం సీనియర్లు, అందులోనూ కమ్మసామాజికవర్గానికి చెందిన దిగ్గజాలను అంబటి పరామర్శించడం వెనుక లెక్కలేంటి? ఊరకరారు మహానుభావులు అన్నట్లు అంబటి రాక వెనుక పొలిటికల్ ఈక్వేషన్లు ఏంటన్నది ఇప్పడు హాట్ టాపిక్‌గా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.