Publish Date:Jul 18, 2025
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉద్యోగాల కోతకు కారణమౌతుందంటూ ఒక వైపు ఆందోళన వ్యక్తం అవుతుంటే.. మరో వైపు ప్రతిభావంతుల కోసం టెక్ దిగ్జజాలు కాగడా పెట్టి గాలిస్తున్నాయి. అలా ప్రతిభావంతులకు అనూహ్య స్ధాయి వేతనాలతో కొలువులోకి తీసుకుంటున్నాయి. ఒక వైపు మెక్రోసాఫ్ట్ వంటి సంస్థలు ఉద్యోగాల కోతతో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లలో ఆందోళన వ్యక్తం అవుతున్న సమయంలోనే.. ప్రతిభ ఉంటే కొలువులు వెతుక్కుంటూ కాళ్ల దగ్గరకు వస్తున్న సంఘటనలూ చోటు చేసుకుంటున్నాయి. తాజాగా గ్లోబల్ టెక్ దిగ్గజం మెటా ఇద్దరు ఏఐ ఇంజినీర్లను గతంలో ఎన్నడూ లేనంత రికార్డు స్థాయి వేతనాల ఆఫర్ చేసి మరీ కొలువులోకి తీసుకుంది. ట్రాపిట్ బన్సల్ , రూమింగ్ పాంగ్ అనే ఇద్దరు ఏఐ ఇంజనీర్లు మెటాలో రికార్డు స్థాయి వేతనాలతో ఉద్యోగులుగా చేరారు.
ఈ ఇరువురూ కూడా భారత సంతతికి చెందిన టెక్ నిపుణులే కావడం విశేషం. మెటా తన సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ అనే కొత్త విభాగంలో పని చేసేందుకు భారత సంతతికి చెందిన ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకు ఏకంగా 2400 కోట్ల రూపాయలు వెచ్చించి మరీ ఉద్యోగాలిచ్చింది. వీరిలో ట్రాపిట్ బన్సల్కు ఎనిమిది వందల కోట్ల రూపాయల భారీ ఆఫర్ తో మెటాలో చేరారు. అలాగే రూమింగ్ పాంగ్ అనే మరో ఏఐ నిపుణుడిని అయితే రూ.1600 కోట్ల రూపాయల వేతనంతో కొలువులోకి తీసుకుంది. అంటే ఇద్దరు ఐటీ నిపుణులకు ఏకంగా 2400 కోట్ల రూపాయలు వెచ్చించింది.
భారతీయ మూలాలున్న ట్రాపిట్ బన్సల్, ఐఐటీ కాన్పూర్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి . 2022లో ఓపెన్ ఏఐలో చేరారు. రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, రీజనింగ్ మోడల్స్ అభివృద్ధిలో లక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఓపెన్ఏఐలో ‘O1’ అనే రీజనింగ్ మోడల్ డెవలప్మెంట్లో కీలక భాగస్వామిగా ఉన్నారు. ఇక రూమింగ్ పాంగ్ అయితే యాపిల్ కంపెనీ నుంచి వచ్చి మోటాలో చేరారు. యాపిల్ లో అత్యాధునిక ఏఐ సిస్టమ్ల డెవలప్ మెంట్ లో చాలా కీలకంగా వ్యవహరించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/meta-mega-offer-to-two-techies-39-202197.html
ఉత్తరాఖండ్ వరదల్లో 10 మంది జవాన్లు గల్లంతయ్యారు. ఉత్తరకాశీ జిల్లాలో వరద ఉధృతికి ధరాలీలోని హార్సిల్ ఆర్మీ బేస్ క్యాంప్ కొట్టుకుపోయింది.
మంత్రి పదవి విషయంలో మనుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్పై మంత్రి వెంకట్ రెడ్డి స్పందించారు.
సికింద్రాబాద్ సృష్టి షెర్టిలిటీ కేసు ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత కస్టడీ విచారణ ముగిసింది. గాంధీ ఆస్పత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
దేశంలో పేపర్ బ్యాలెట్ విధానాన్ని తిరిగి ప్రవేశ పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోసం మరోసారి ఎమ్మెల్యే పదవి రాజీనామాకు సిద్ధమని షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఏంటీ జగన్ మోహన రెడ్డి ఇప్పటి వరకూ తనపై ఉన్న 31 కేసులలో 3452 సార్లు.. వాయిదాలు తీసుకుని ప్రపంచ రికార్డు సృష్టించారా? ఇందుకోసంగానూ ఆయన 6904 కోట్ల రూపాయల మేర ఖర్చు చేశారా? ఆశ్చర్యం కలిగిస్తున్నా.. ఈ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది. బేసిగ్గా జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తన ఐదేళ్ల పదవీ కాలంలో .. సీఎంగా తన హోదా కారణంగా బిజీబిజీ అంటూ వాయిదాల మీద వాయిదాలు తీసుకున్నసంగతి తెలిసిందే.
బంజారాహిల్స్లోని రోడ్డు నంబర్ 1/12లో రోడ్డు కుంగిపోయింది. అటు వచ్చిన వాటర్ ట్యాంకర్ ఒక్కసారిగా దిగబడిపోయింది. దీంతో వాటర్ ట్యాంకర్ డ్రైవర్తో పాటు క్లీనర్కు తీవ్ర గాయాలయ్యాయి.
మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై దీర్ఘకాలంగా సాగుతున్న క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తమపై ఉన్న క్రిమినల్ కేసును క్వాష్ చేయాలని కోరుతూ మార్గదర్శి ఫైనాన్షియర్స్ దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం అనుమతించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై డిపాజిటర్ల నుంచి ఎటువంటి అభ్యంతరం, ఆరోపణా లేకపోవడంతో కేసు కొనసాగించాల్సిన అవసరం లేదని హైకోర్టు పేర్కొంది.
ఋతుపవన ద్రోణి, బంగాళాఖాతం లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కుమ్మేస్తున్నాయి.
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ పట్టణంలో క్లౌడ్ బరస్ట్ ధాటికి కొండ చరియాలు విరిగిపడ్డాయి. వరద ప్రవాహంతో వందలాది ఇళ్లను ముంచేంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు పూర్తయ్యింది. ఈ విషయాన్ని సీబీఐ దేశ సర్వోన్నత న్యాయస్థానానికి తెలియజేయడంతో.. ఇప్పడు చర్చ ఈ కేసులో కీలక నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డిపైకి మళ్లింది.
తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్ కు పంపించారు.
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్కు సిట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 8న మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.