జగన్ జనంలోకి.. మళ్లీ వాయిదా.. ఎందుకంటే?

Publish Date:Jul 18, 2025

Advertisement

ఆంధ్రప్రదేశ్  మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇప్పటికి తత్వం బోధపడిందా? జనం  మూడ్ అవగతమైందా? అందుకే జనంలోకి రావాలన్న తన కార్యక్రమాన్ని వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారా? అంటే పరిశీలకులు మాత్రమే కాదు.. వైసీపీ నేతలు సైతం ఔననే అంటున్నారు.  రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలతో జనంలోకి వెడితే ఆబోరు దక్కదన్న విషయం అర్ధమవ్వడంతోనే జగన్ తన జిల్లాల పర్యటనలను వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తున్నారని అంటున్నారు.

రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తరువాత జగన్ చాలా వరకూ బెంగళూరు ప్యాలెస్ కే పరిమితమైన సంగతి తెలిసిందే. అడపాదడపా చుట్టపు చూపుగా మాత్రమే రాష్ట్రానికి వచ్చి పరామర్శ యాత్రల పేరుతో పబ్బం గడుపుకుంటున్నారు. ఇప్పటికే జగన్ జనంలోకి వస్తున్నానంటూ ప్రకటించిన రెండు మూడు ముహూర్తాలూ వాయిదా పడ్డాయి. తాజాగా వచ్చే ఏడాది వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి నాటి నుంచీ తాను ఇక జనంలోనే ఉంటానని ప్రకటించేశారు. అయితే ఆ ప్రోగ్రాం కూడా వాయిదాపడిందని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. అయితే ఈ వాయిదా గురించి వైసీపీ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటనా రాకపోయినప్పటికీ.. జగన్ కు సన్నిహితంగా ఉండే నేతలు ఆఫ్ ది రికార్డ్ అంటూ.. జగన్ వచ్చే ఏడాది కూడా జనంలోకి వచ్చే అవకాశాలు లేవని అంటున్నారు. 

అధకార తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై ప్రజలలో ఇసుమంతైనా వ్యతిరేకత కానరావడం లేదనీ, పైపెచ్చు జగన్ పరామర్శ యాత్రలకు జనం నుంచి స్పందన కరవవ్వడం, ఆ యాత్రలకు జనసమీకరణ సైతం కష్టంగా మారడంతో జగన్ తన జనంలోకి కార్యక్రమాన్ని నిరవధికంగా వాయిదా వేసుకున్నారని చెబుతున్నారు. ప్రజలలో ప్రస్తుత ప్రభుత్వంపై వ్యతిరేకత లేని సమయంలో జనంలోకి వచ్చి సర్కార్ పై విమర్శలు చేయడం వల్ల ఈ మాత్రంగా ఉన్న పరపతి కూడా పలుచన అవుతుందన్న ఉద్దేశంతోనే జగన్ జనంలోకి కార్యక్రమాన్ని చేపట్టడం లేదని అంటున్నారు. అయితే ఆయన జనంలోకి కచ్చితంగా వస్తారనీ, అయితే ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరిగిన తరువాత ఆ కార్యక్రమం ఉంటుందనీ చెబుతున్నారు.    

By
en-us Political News

  
బరువు తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా యూట్యూబ్‌లో చూసి ఆహార నియమాలు పాటించిన పదిహేడేళ్ల యువకుడు శక్తిశ్వరన్ మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన తమిళనాడులోని కొలాచెల్ ప్రాంతంలో చోటు చేసుకుంది.
శాంతి గోదావరి వరద ఉధృతితో మహోగ్రరూపం దాల్చింది. తెలుగు రాష్ట్రాలలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వానల కారణంగా గోదావరికి వరద నీరు పోటెత్తుతోంది.
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పర్యాటక రంగ ప్రగతిని ఇస్తున్న అత్యధిక ప్రాముఖ్యతకు గుర్తింపు దక్కింది. ఏపీ పర్యాటక శాఖకు అత్యంత ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది.
బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిన నేపథ్యంలో కోస్తాంధ్రలో ఆదివారం వరకు భారీ వర్షాల అంచన నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత సూచించారు.
ఐఏఎస్ శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలిందే . గతంలో ఇదే తెలంగాణ హైకోర్టు ఇదే ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి ప్రమేయం లేదని పేర్కొంటూ, ఆ కేసునుంచి తప్పించాలని సీబీఐ, ఈడీలను ఆదేశించింది.
వరుస పరాజయాలు మూటగట్టుకున్న గులాబీ పార్టీలో నెలకొన్న వివాదాలు, ఆధిపత్యపోరు ఆ పార్టీ ఉనికికే ప్రశ్నార్ధకంగా మారుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కారు పార్టీని తిరిగి రేసులోకి తీసుకురావాల్సిన పార్టీ ముఖ్యనేతలు, అందులోనూ కల్వకుంట్ల వారసులు వ్యవహరిస్తున్న తీరు బీఆర్ఎస్ వర్గాకు అసలు మింగుడుపడటం లేదంట.
ఉపరాష్ట్రపతి పదవికి ధన్ ఖడ్ రాజీనామా కు న్యాయమూర్తి వర్మ ఉదంతమే ప్రధాన కారణమని దాదాపుగా నిర్ధారణ అయ్యిందని పరిశీలకులు అంటున్నారు. ప్రతిపక్ష నాయకుల సంతకాలతో వర్మ అభిసంసన తీర్మానం ఆమోదించమే ధన్ ఖడ్ నిష్క్రమణ కు కారణమైంది. అంతకు ముందే బీజేపీ పెద్దలతో ఆయనకున్న విభేదాలకు ఇది క్లైమాక్స్ గా భావించాల్సి ఉంటుందంటున్నారు.
కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోకగజపతిర రాజు శుక్రవారం (జులై 25) గోవాకు బయలుదేరి వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన గోవాకు బయలు దేరారు. గోవా గవర్నర్ గా నియమితులైన ఆయన శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయ విశ్వాసాలతో, ఆయన పరిపాలనా విధానాలతో ఎవరైనా విభేదించవచ్చుకానీ, భాతర రాజకీయాల్లో ఆయన స్థానాన్ని మాత్రం ఎవరూ కాదన లేరు.
తెలంగాణ క్యాబినెట్ సమావేశం వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో శుక్రవారం జరగాల్సిన మంత్రివర్గ సమావేశాన్ని సోమవారానికి వాయిదా వేశారు.
హ‌లో ట్రంప్ ఎక్స్ క్యూజ్ మీ.. మీ దేశంలో మా వాళ్ల ప‌నితీరుకు ఆయా కంపెనీలు ఏం రేంజ్ లో లాభాల బాట‌లో ఉన్నాయో తెలుసా.. తెలియకపోతే ఒక్క‌సారి ఈ వివ‌రాల‌ను చూడండి.
ఏపీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి మరి కొన్ని రోజులు జైలువాసం తప్పేటట్లు కనిపించడం లేదు. తనను ఏ4 నిందితుడిగా చేర్చిన నాటి నుంచి బెయిల్ కోసం గజనీ మహ్మద్‌లా విఫల యత్నాలు చేసుతున్న రాజంపేట ఎంపీ జూనియర్ పెద్దిరెడ్డికి మరోసారి నిరాశే ఎదురైంది.
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు కాకాణి గోవర్ధన్ రెడ్డికి 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధిస్తూ నెల్లూరు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ భూముల కబ్జాకు వెంకటాచలం తహశీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ కాకాణిపై నమోదైన కేసుకు సంబంధించి నెల్లూరు అడిషన్ మేజిస్టేట్ కోర్టు ఈ ఉత్తర్వలు జారీ చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.