షాదీ ముబారక్ పేరుతో భారీ దోపిడీ.. రూ.21 లక్షలు స్వాహా!

Publish Date:Jun 14, 2026

Advertisement

 

తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక సంక్షేమ పథకం షాదీ ముబారక్ పేరుతో కోట్ల ఆశలు పెట్టుకున్న పేద కుటుంబాల కోసం కేటాయించిన నిధులను కొందరు కేటుగాళ్లు, ప్రభుత్వ అధికారుల కుమ్మక్కుతో కాజేసిన భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. పెళ్లిళ్లు జరగకపోయినా జరిగినట్లు నకిలీ పత్రాలు సృష్టించి, లబ్ధిదారుల పేరుతో సుమారు రూ.21 లక్షల ప్రభుత్వ నిధులను స్వాహా చేసిన అంతరాష్ట్ర ముఠాను అత్తాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ కేసులో బండ్లగూడ తహసీల్ కార్యాలయంలో పనిచేస్తున్న స్పెషల్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ధరావత్ అశోక్ కిరణ్ సహా మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. హసన్‌నగర్‌లోని ఫాతిమా కాలనీలో ఒక ఇంట్లో షాదీ ముబారక్ పథకానికి సంబంధించిన నకిలీ పత్రాలు తయారవుతున్నాయన్న సమాచారం అందడంతో అత్తాపూర్ పోలీసులు దాడులు నిర్వహించారు. 

ప్రధాన నిందితుడు మహమ్మద్ ఎతిమాద్ ఉల్ హక్ ఇంట్లో నిర్వహించిన సోదాల్లో భారీ ఎత్తున నకిలీ దరఖాస్తులు, వివాహ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డులు, కంప్యూటర్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, చెక్కులు లభ్యమయ్యాయి. విచారణలో ఎతిమాద్ ఉల్ హక్ ఆధార్ ఆపరేటర్‌గా పనిచేస్తూ తన కంప్యూటర్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి వధువుల ఫొటోలు, వివాహ ధ్రువీకరణ పత్రాలు, గుర్తింపు కార్డులు సహా పలు కీలక పత్రాలను ఫోర్జరీ చేసినట్లు తేలింది. 

అనంతరం ఆ దరఖాస్తు లను బండ్లగూడ తహసీ ల్దార్ కార్యాలయంలో సమర్పించి ప్రభుత్వ నిధులు విడుదలయ్యేలా పథకం ప్రకారం వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు.ఈ మోసంలో స్పెషల్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ధరావత్ అశోక్ కిరణ్ కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. క్షేత్రస్థాయి ధృవీకరణ లేకుండానే ఫైళ్లను ఆమో దించి నిధులు విడుదలయ్యేలా సహకరించినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు మిగిలిన నింది తులు నకిలీ లబ్ధిదారులను సృష్టించడం, బ్యాంకు ఖాతాలు సమకూర్చడం, వచ్చిన డబ్బును పంచు కోవడం వంటి పనుల్లో భాగస్వాములైనట్లు గుర్తించారు.

ఇప్పటివరకు ఈ ముఠా రూ.21 లక్షల మేర ప్రభుత్వ నిధులను అక్రమంగా పొందినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి ఒక ల్యాప్‌టాప్, ఒక డెస్క్‌టాప్ కంప్యూటర్, ఆరు మొబైల్ ఫోన్లు, నకిలీ దరఖాస్తులు, ఫోర్జరీ చేసిన ఐడీ ప్రూఫ్‌లు, రూ.21 లక్షల విలువైన 21 చెక్కులను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల పేరుతో జరిగే మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా మధ్యవర్తిత్వం చేస్తామని చెప్పి డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. కేసును చాకచక్యంగా ఛేదించిన అత్తాపూర్ పోలీసు బృందాన్ని రాజేంద్రనగర్ జోన్ డీసీపీ ఎస్. శ్రీనివాస్ అభినందించారు.


 

By
en-us Political News

  
క్రికెట్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టించబడింది.
ప్రముఖ సినీ నిర్మాత, రాజకీయ నాయకుడు గొట్టిముక్కల పద్మారావు కన్నుమూశారు.
విశాఖలోని రుషికొండ ప్యాలెస్ ను పీపీ పద్ధతిలో ఆతిథ్య రంగానికి అప్పగించాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక ఇస్తున్నట్టు ముగ్గురు మంత్రుల కమిటీ ప్రకటించింది.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లతో యోగభ్యాసం చేయించిన రామ్ దేవ్ బాబా
ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం, అలాగే పోలీసుల కస్టడీలోనే అతను మరణించాడంటూ వస్తున్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది.
యోగా గురు  బాబా రామ్‌దేవ్‌తో కలిసి ఆయన ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ఇక్కడి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం  జరిగిన ఈ  కార్యక్రమంలో వేలాది మంది   పాల్గొని రికార్డు సృష్టించారు.
ఈ నెల 26వ తేదీ వరకు మధ్యం తర బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు బండి భగీరథ జైలు నుంచి మధ్యంతర బెయిల్‌ పై విడుదలయ్యారు.
. ఆ అంగన్వాడీ కేంద్రంలో పిల్లల కోసం అందుబాటులో ఉన్న వసతులు, గర్భిణులు, బాలింతలకు అందుతున్న పోషకాహార సేవలపై ఆరా తీశారు. కేంద్రంలోని నిల్వల రిజిస్టర్లను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి సిబ్బంది సరికొత్త ఇండక్షన్ స్టవ్‌పై తయారు చేసిన రాగి జావను సీఎంకు అందించగా.. ఆయన చిన్నారుల పక్కనే కూర్చుని దానిని సేవించారు. పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించేలా అంగన్‌వాడీ ఆవరణలో ఒక మొక్కను నాటారు.
2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని అతని వర్క్‌లోడ్‌ను మేనేజ్ చేయడానికే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. ప్రస్తుతం హార్దిక్ బౌలింగ్ చేసేందుకు పూర్తిగా ఫిట్‌గా లేడని సమాచారం. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ సారథ్యంలో అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో కూడా హార్దిక్ ఆడటం లేదు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన పల్నాడు జిల్లా పర్యటనలో ఒక సామాన్య గృహస్థుడిగా మారిపోయారు. స్థానిక రైతు క్షేత్రంలో ప్రకృతి సిద్ధంగా తయారు చేసిన కోల్డ్‌ప్రెస్డ్ వేరుశనగ నూనెను కొనుగోలు చేసే క్రమంలో ఆయన తన సతీమణి భువనేశ్వరికి ఫోన్ చేశారు. చేసి వేరుశనగ నూనె కొనమంటావా అని అడిగారు.
సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. కెప్టెన్ నిగర్ సుల్తానా 36 పరుగులు, శోభన మోస్తరీ22 పరుగులతో రాణించారు. ఇక చివరి ఓవర్లలో షోర్నా అక్తర్ కేవలం 22 బంతుల్లోనే 5 ఫోర్ల సాయంతో అజేయంగా 39 పరుగులు సాధించడంతో బంగ్లా జట్టు ఆ మాత్రం స్కోరైనా చేరగలిగింది. పాకిస్థాన్ బౌలర్లలో ఫాతిమా సనా రెండు వికెట్లు పడగొట్టింది.
ఆ తర్వాత అజ్మతుల్లా ఒమర్జాయ్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లో భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అంపైర్ ఇచ్చిన పెనాల్టీ రన్స్ తో కలిసి టీమ్ ఇండియా తొలి ఓవర్ లో ఏకంగా 23 పరుగులు సాధించింది. దీంతో 2004లో బంగ్లాదేశ్‌పై తొలి ఓవర్లోనే 22 పరుగులు సాధించి నెలకొల్పిన పాత రికార్డు కనుమరుగైపోయింది.
ఇందులో సబ్జెక్టు పరిజ్ఞానంతో పాటు ఆధునిక ప్రపంచానికి అవసరమైన ప్రాథమిక డిజిటల్ నైపుణ్యాలపై కాలేజీలోనే ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత డిగ్రీ చివరి సంవత్సరం అంటే మూడో ఏడాదిలో విద్యార్థులు నేరుగా క్షేత్రస్థాయి పరిశ్రమలతో అనుసంధానమైన ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లోకి అడుగుపెడతారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.