ఢిల్లీ అసెంబ్లీకి బుధవారం (ఫిబ్రవరి 5) ఎన్నికలు జరిగాయి. ఓటరు తన తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. అయితే పోలింగ్ ముగిసిన వెంటనే విడుదలైన ఎగ్జిట్ పోల్స్ లో మెజారిటీ పోల్స్ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి ఖాయమనే అంచనా వేశాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ స్పష్టమైన మెజారిటీతో విజయం సాధిస్తుందని పేర్కొన్నాయి. అయితే అన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీ విజయాన్ని ప్రిడిక్ట్ చేస్తే ఒక్క కేకే సర్వే మాత్రం ఢిల్లీ పీఠంపై మళ్లీ ఆప్ జెండాయే ఎగురుతుందని ఢంకా బజాయించి మరీ చెప్పింది.
ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 36.
పీ మార్గ్ ఎగ్జిట్ పోల్ ప్రకారం బీజేపీకి 39 నుంచి 49 సీట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి 21 నుంచి 31 స్థానాలు దక్కు అవకాశం ఉంది. కాంగ్రెస్ 0 నుంచి 1 స్థానంలో గెలిచే అవకాశం ఉంది. అలాగే పీపుల్స్ పల్స్, జేవీసీ పోల్, పీపుల్స్ ఇన్ సైట్, చాణక్యా స్ట్రాటజీస్ సహా పలు సంస్థలు కూడా తమతమ ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ విజయమే ఖరారైందని పేర్కొన్నాయి. అయితే మార్జైజ్ సర్వే మాత్రం ఢిల్లీలో హండ్ ఏర్పడే అవకాశాలున్నాయని అంచనా వేసింది.
ఇవి కాకుండా మైండ్ బ్లింక్, మరో సంస్థ నిర్వహించిన సర్వేలు ఆప్ ఢిల్లీలో మూడో సారి అధికారం చేజిక్కించుకునే అవకాశాలున్నయని అంచనా వేశాయి. అన్ని సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ కూడా అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి దళితుల నుంచి గట్టి మద్దతు లభించిందనే పేర్కొన్నాయి. అలాగే మహిళా ఓటర్లు మొగ్గు కూడా ఒకింత అధికార పార్టీవైపే కనిపించిందని చెప్పారు.
ఇక కచ్చితమైన సర్వేలకు పెట్టింది పేరుగా చెప్పుకునే కేకే సర్వే మాత్రం ఢిల్లీలో ఆప్ ముచ్చటగా మూడో సారి అధికార పగ్గాలు కైవశం చేసుకోవడం ఖాయమని పేర్కొంది. ఆ సర్వే ప్రకారం ఆప్ కచ్చితంగా 39 స్థానాలలో విజయం సాధిస్తుంది. బీజేపీకి 22 స్థానాలలో విజయం దక్కుతుంది. ఇక మిగిలిన తొమ్మిది స్థానాలలో పోరు హోరాహోరీగా ఉంటుంది. వాటిలో కూడా ఓ ఐదు స్థానాలలో మొగ్గు ఆప్ వైపే ఉంది. మిగిలిన నాలుగు స్థానాలలో బీజేపీకి విజయావకాశాలు ఉన్నాయి. అంటే కేకే సర్వే ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీకి 44, బీజేపీకి 26 స్థానాలు దక్కుతాయి. వాస్తవంగా ఢిల్లీ పీఠం ఏ పార్టీకి దక్కుతుందో తెలియాలంటే ఫిబ్రవరి 8 వరకూ వేచి చూడాల్సిందే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/majority-exit-polls-predict-bjp-win-in-delhi-39-192438.html
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా సోమవారం (మార్చి 2) దేవుడికి సమర్పించే పట్టువస్త్రాలను సమర్పించే విషయంలో కొలికపూడి దురుసుగా వ్యవహరించారు.
నెమలి వేణుగోపాలస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్యాణోత్సవానికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులు కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. ఆలయ మర్యాదల ప్రకారం, ప్రోటోకాల్ అనుసరించి అధికారులు స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఎంపీ కేశినేని చిన్ని చేతికి అందించారు.
వాస్తవానికి మల్లు భట్టి విక్రమార్క్ జగన్ ను తన కుమారుడి వివాహానికి జనగ్ ను బెంగళూరు వెళ్లి ఆహ్వానించాల్సి ఉంది. అయితే జగన్ స్వయంగా తాను మంగళవారం తాడేపల్లి వస్తాననీ, అప్పుడు ఆహ్వానిస్తే సరిపోతుందనీ కబురు పంపారు.
ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే మండలి సభ్యత్వానికి వారు చేసిన రాజీనామాలను చైర్మన్ ఇప్పటి వరకూ ఆమోదించలేదు.
మంత్రివర్గ విస్తరణ మాత్రమే అంటే కేబినెట్ లోకి ఒకరిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా.. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి రెండేళ్లు కావస్తున్నందున మంత్రివర్గంలో సమూల మార్పులు చేసే దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. తన కేబినెట్ నుంచి కొందరికి ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.
రాజ్యసభ ఎన్నికలకు 9 మంది అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.
స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఆలయ పురోహితులు ఎంపీ చిన్ని దంపతులకు అందజేశారు. అయితే, తనకు కూడా వస్త్రాలు ఇవ్వాలని ఎమ్మెల్యే పట్టుబట్టారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం ఒకరికే ఇస్తారని చెప్పిన ఆలయ అధికారులు, ఆయనకు తలంబ్రాలు అందించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ చేతిలోని పట్టువస్త్రాలను బలవంతంగా లాక్కుని తన తలపై పెట్టుకున్నారు.
జగన్ హయాంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందన్న మంత్రి, రాష్ట్ర వ్యాప్తంగా 198 సాగునీటి ప్రాజెక్టులకు ప్రీ-క్లోజర్ ఇస్తే, వాటిలో 102 ప్రాజెక్టులు రాయలసీమలోనే ఉన్నాయని గుర్తుచేశారు.
వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకుడిగా, బూతుల నానిగా అనితర సాధ్యమైన గుర్తింపు ఉన్న కొడాలి నాని, 2024 ఎన్నికలలో వైసీపీ పరాజయం, గుడివాడ నియోజకవర్గంలో తాను స్వయంగా ఓడిపోవడంతో వెనక్కు తగ్గారు. కేసుల భయంతో మౌనాన్ని ఆశ్రయించారు. అసలు రాజకీయాలలో ఉన్నారా లేరా అన్నంతగా సైలెంట్ అయిపోయారు.
జగన్ రాష్ట్రానికి చుట్టపు చూపుగా మాత్రమే వచ్చి అత్యధికంగా బెంగళూరులోనే మకాం ఉంటుండం ఒక కారణమైతే.. రాష్ట్రానికి, సొంత జిల్లాకు వచ్చినప్పుడు కూడా కార్యకర్తలు, నాయకులకు అప్పాయింట్ మెంట్ దొరకని పరిస్థితి మరో కారణంగా చెబుతుంటారు. ముఖ్యంగా జగన్ అందుబాటులో లేకపోవడం ప్రభావం ఆయన సొంత జిల్లా కడపలో మరీ తీవ్రంగా ఉంది.
కవిత సైతం తన వల్ల పార్టీ ఎలా ఓడిపోయిందని ప్రకటించి చేతులు దులుపుకోవడం కాదు.. అందుకు సంబంధించి వివరణ ఇవ్వాలనీ, లెక్కలు తేల్చాలనీ డిమాండ్ చేయడం ద్వారా మొత్తం బీఆర్ఎస్ నే డిఫెన్స్ లో పడేశారు. దాని నుంచి బయటపడడానికి ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ రంగంలోకి దిగి.. అప్పటి కేటీఆర్, కేసీఆర్ ల ప్రసంగాలు, ప్రకటనలను రీ పోస్టు చేస్తూ హడావుడి చేస్తున్నది.
తుమ్మల నాగేశ్వరరావు తన కుటుంబ సభ్యులతో కలిసి ఐదు రోజుల కిందట దుబాయ్ వెళ్లారు. మంత్రి కుటుంబ సభ్యులలో ఒకరు అనారోగ్యంతో ఉండటంతో మెరుగైన చికిత్స అందించడం కోసం ఆయన దుబాయ్కు వెళ్లినట్లు సమాచారం. చికిత్స అనంతరం తిరిగి రావాలని భావిస్తున్న తరుణంలో పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చి, ఆ ప్రభావంతో దుబాయ్ విమానాశ్రయం మూతపడింది.
అదొక మార్ఫింగ్ వీడియో, ఏఐ జనరేటెడ్ వీడియో అన్నారు. ఇందులో తన పరువు తీసే కుట్ర దాగి ఉందన్న బీఆర్ నాయుడు.. తనతో పాటు టీటీడీ ప్రతిష్ట మంటగలిపే యత్నం ఉందని ఆరోపించారు. అందుకే తాను సైబర్ క్రైమ్ ని ఆశ్రయించానన్నారు.
Publish Date:Feb 28, 2026
ఆ పార్టీ అగ్రనాయకత్వం అప్పట్లో ప్రదర్శించిన ఉదాశీనత.. కవిత అవినీతిని సర్టిఫై చేసినట్లైందని అప్పట్లోనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అదే విషయాన్ని కల్వకుంట్ల కవిత కోర్టు తీర్పు అనంతరం మీడియా సమావేశంలో ఎత్తి చూపారు. పార్టీ కోసం కాకుండా.. పార్టీలో ఉన్న కొందరి స్వార్థం కోసం తనను బలిపశువును చేశారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ ను డిఫెన్స్ లో పడేశాయి.