జూబ్లీహిల్స్‌ అగ్నిప్రమాదం....ప్రాణాలతో బయటపడ్డ ఆరుగురు కార్మికులు

Publish Date:Feb 26, 2026

Advertisement

 

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఉన్న ప్రముఖ షాపింగ్ కాంప్లెక్స్‌లో మాన్యవర్, మంగళగౌరీ దుకాణాలు ఉన్న భవనానికి ఎలివేషన్ పనులు జరుగుతున్న సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. పై అంతస్తులో వెల్డింగ్ పనులు చేస్తుండగా నిప్పురవ్వలు ఎలివేషన్ కోసం నిర్మించిన తాత్కాలిక కట్టడంపై పడటంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో భవనంలోని మూడో అంతస్తులో ఇద్దరు మహిళలు, ఐదో అంతస్తులో నలుగురు పురుష కార్మికులు పని చేస్తుండగా పొగతో పాటు మంటలు వేగంగా వ్యాపించడంతో వారు లోపలే చిక్కుకుపోయారు. మంటలు చుట్టుముట్టడంతో మహిళలు అరుపులు, కేకలు వేస్తూ సహాయం కోసం ప్రయత్నించినప్పటికీ మొదట ఎవరూ స్పందించలేదని బాధితులు తెలిపారు.

ఐదో అంతస్తులో ఉన్న ఒక మహిళ భర్త మూడో అంతస్తుకు చేరుకుని అక్కడి అద్దాలను పగలగొట్టాడు. రాజు అనే కార్మికుడు నిచ్చెనలను కిందికి వేసి బయటకు రావడానికి మార్గం కల్పించాడు. అద్దాలను పగలగొట్టి నిచ్చెన సాయంతో ఇద్దరు మహిళలు సురక్షితంగా కిందికి దిగారు. అనంతరం మిగతా నలుగురు కార్మికులు కూడా బయటపడగలిగారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. భవనంలో ఉన్న వారందరినీ సురక్షితంగా బయటకు తీసినట్లు పోలీసులు తెలిపారు. బాధిత కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం, గత వారం రోజులుగా ఈ భవనంలో పనులు చేస్తున్నామని, ప్రమాద సమయంలో తమను పనిలోకి పెట్టుకున్న యజమాని ఫోన్ కూడా ఎత్తలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

By
en-us Political News

  
రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోవడానికి పూర్తిగా మాజీ సీఎం జగన్‌నే కారణమని మంత్రి నిమ్మల విమర్శించారు.
ముంబైలో ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ నివాసం, కార్యాలయాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు.
రెండో సారి అమెరికా ప్రెసిడెంట్‌ అయిన డోనాల్డ్ ట్రంప్ .. అగ్రదేశ అధినేతగా ప్రపంచానికి తానే బాస్ అన్నట్లు వ్యవహరిస్తున్నారు.
ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో పోలీసులు భారీ స్థాయిలో డ్రగ్స్ రాకెట్‌ను బట్టబయలు చేశారు.
పాకిస్థాన్‌లో తీవ్ర ద్రవ్యోల్బణంతో నిత్యావసర వస్తువుల ధరలు తార స్థాయికి చేరాయి.
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఒకే రోజు రెండు సార్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందాన పెళ్లి జరగనుంది
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్ 36లోని మంగళగౌరి షాపింగ్ మాల్‌లో అగ్నిప్రమాదం జరిగింది.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తిరుమల ఘాట్ రోడ్డులో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది.
తెలంగాణలో 45 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు వెంటనే గుర్తొచ్చే పేరు నారా లోకేష్.
జగన్ హయాంలో వెలిగొండ ప్రాజెక్టు పనులను నిర్లక్ష్యంగా వదిలేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.