Publish Date:Feb 18, 2026
సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గం కింద ముస్లింలకు అమల్లో ఉన్న 5 శాతం రిజర్వేషన్ను మహారాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం మంగళవారం(ఫిబ్రవరి 17) రాత్రి జీవో జారీ చేసింది. విద్యాసంస్థల్లో అడ్మిషన్లు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల వర్తించే ఈ రిజర్వేషన్ ను రద్దు చేస్తూ ముస్లింలకు ఈ కోటా ఇకపై ఉండదని స్పష్టం చేసింది.
2014లో అప్పటి నేతృత్వంలోని డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వం ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. అప్పట్లో ఈ ఆర్డినెన్స్ రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ప్రతిపక్షాలు ఇది ఎన్నికల ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయమని విమర్శించాయి. 2014 నవంబర్ 14న హైకోర్టు ముస్లింలకు 5శాతం రిజర్వేషన్లపై మధ్యంతర స్టే విధించింది. తరువాత ఈ అంశం సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. కోర్టు తీర్పులు, చట్టపరమైన అడ్డంకుల కారణంగా రిజర్వేషన్ పూర్తిగా అమలులోకి రాలేదు. డిసెంబర్ 23, 2014 నాటికి శాసనసభ ఆ ఆర్డినెన్స్ను చట్టంగా ఆమోదించకపోవడంతో గడువు ముగిసింది.
అయినప్పటికీ అధికారికంగా రద్దు ప్రకటన లేకపోవడంతో ఈ రిజర్వేషన్ అంశం ఎటూ తేలకుండా త్రిశంకు స్వర్గంలో ఉన్నట్లుగా ఉండీ లేనట్లుగా కొనసాగుతోంది. దాదాపు పుష్కర కాలం తరువాత దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం ముస్లింలకు 5శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ జీవో జారీ చేసింది. చట్టపరంగా అమలులో లేని కోటాని రద్దు చేసింది. అలా రద్దు చేస్తూ, ఇది కేవలం చట్టపరమైన స్పష్టత కోసం తీసుకున్న నిర్ణయమేననీ, అమలులో లేని అంశానికి ఫుల్ స్టాప్ పేట్టేశామని పేర్కొంది.
అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని విపక్ష పార్టీలు తప్పుపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అయితే ఇది ముస్లింలకు పెద్ద దెబ్బగా పేర్కొంది. వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన ప్రభుత్వం వాటిని అడ్డుకుంటోందని విమర్శించింది. ఎంఐఎం అయితే దీనికి రంజాన్ తోఫాగా వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. అయితే ప్రభుత్వ తాజా నిర్ణయంతో ముస్లింల రిజర్వేషన్ అంశం మళ్లీ రాజకీయంగా ప్రధాన్యతను సంతరించుకుంది. మహారాష్ట్రలో రానున్న ఎన్నికలలో ఈ అంశం కీలకంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/maharashtra-government-camcil-muslim-reservations-39-214297.html
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ తగిలి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కోలుకుని ఆయన మండలికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాదరంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడలు బండ్లు అవుతాయి. బండ్లే ఓడలవుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవసరం తీరిపోయిన తర్వాత విసిరేసిన తెడ్డే.. చివరికి పడవ బోల్తా పడ్డప్పుడు దిక్కవుతుంది. అన్నదానికి జగన్ అపరిపక్వంతో కూడుకున్న రాజకీయ విధానాలే ఉదాహరణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జరుగుతుందో పవన్ కల్యాణ్ విడమరచి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫకేషన్ జారీ చేయగానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయకుడు, మాజీ హోం మంత్రి మహమూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ తర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవరిని ఎమ్మెల్సీ చేయాలని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం నరేందర్ రెడ్డి.. నేడు ఆయన రాజకీయ సలహాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్దల సభలోకి సగర్వంగా అడుగు పెడుతున్నారు.
సీట్ల సర్దుబాటుపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్తో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఫోనులో మాట్లాడినట్టు తెలిసింది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, డీఎంకేతో కూటిమిలో భాగంగా 30 సీట్లకు తగ్గేది లేదని కాంగ్రెస్ ఇంత వరకూ పట్టుబడుతూ వచ్చింది. దీంతో సీట్ల పంపకాలపై పరిష్కారానికి డీఎంకేతో సంప్రదింపులు జరిపే బాధ్యతను కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి పార్టీ అధిష్ఠానం అప్పగించింది.
హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణతో పాటు కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేసిన విషయాన్నికేంద్ర హోంమంత్రికి వివరించిన సీఎం రేవంత్.. వేగంగా పెరుగుతున్న జనాభా, పట్టణ విస్తరణ, పరిశ్రమల వృద్ధి దృష్ట్యా రాష్ట్రానికి మరిన్ని ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని, తెలంగాణ ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచాలని కోరారు.
సంక్రాంతి సంబరాలు నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా ఈ రెండు వర్గాల మధ్యా పోటీ కొనసాగుతున్నది. సీతం రాజు సుధాకర్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద ముగ్గుల పోటీ నిర్వహిస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కనకమాలక్ష్మి ఆలయం వద్ద ముగ్గుల పోటీ నిర్వహించారు. ఇది ఒక్కటే కాదు, కార్పొరేషన్ పదవుల విషయంలో కూడా తలో దిక్కు అడుగులు వేస్తున్నారు.
కొద్దికాలం కిందట శరద్ పవార్ తాను రాజ్యసభకు పోటీ చేసే ప్రశక్తే లేదని ప్రకటించారు. అయితే ఇటీవల ఆయన అన్న కొడుకు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంతో మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా, ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 37 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం.