మహానాడు వేదికపై మంత్రి టీజీ భరత్ సూపర్ స్పీచ్

Publish Date:May 27, 2025

Advertisement

 

 

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు  మన దగ్గర ఉంటే మనకు విలువ తెలియడం లేదని  మంత్రి టీజీ భరత్ అన్నారు. బయటి దేశాల్లో ఆయన విలువ చాలా ఎక్కువ. నేను ఈ మధ్య ఇండియా టుడే కాన్క్లేవ్ కి దుబాయ్ కి వెళ్లాను. శోభ బిల్డర్స్ అధినేత చంద్రబాబుకి పరిచయం లేదు, చూసింది కలిసింది లేదు. ఓ సందర్భంలో మాట్లాడుతూ రూ.100 కోట్లు ఏపీకి విరాళంగా ఇవ్వాలనుకుంటున్నా అన్నారు. చంద్రబాబు లాంటి లీడర్ షిప్ నాయకుడు మీకు ఉన్నాడు. ఆ రూ.100 కోట్లు ఏ విధంగా ఉపయోగించుకుంటారో వినియోగించుకోండని తెలిపారు. చంద్రబాబు ఏ విధంగా కష్టపడుతున్నారో మనందరికి తెలియాలి. కష్టపడే లీడర్ మనకు ఉన్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేసేటప్పుడు వారం తర్వాత పాదయాత్ర ఉండదు టీజీ భరత్  అన్నారు. 


కానీ పట్టుదలతో దాదాపు 3 వేల కి.మీ. పైగా లోకేష్ గారు పాదయాత్ర చేశారు. ప్రజల్లో మమేకమై ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. వారి బాధలను చూశారు. వారికన్నీళ్లు చూశారు. అధికారంలోకి వచ్చాక వారికి అండగా ఉన్నారు. నారా లోకేష్ కు ఓ మాట చెప్పమని నా స్నేహితుడు మంత్రి అన్నారు. నువ్వు మగాడ్రా బుజ్జి అని చెప్పమన్నారు. పల్లా శ్రీనివాస్ ఎప్పుడు కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు.   గత ప్రభుత్వ విధానాల వల్ల పారిశ్రామిక వేత్తలు ఎంత బాధపడ్డారో అందరికీ తెలుసు. ఏపీలో పెట్టుబడులు పెట్టకండని ఫారెన్ కంపెనీలు మన ఏపీని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. ఆ విధంగా గత వైసీపీ ప్రభుత్వ పాలన సాగింది. టీడీపీ ప్రభుత్వం వచ్చాక స్వాతంత్ర్యం వచ్చిందని కొందరు పారిశ్రామిక వేత్తలు నాతో చెప్పారని ఆయన పేర్కొన్నారు 

మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కంపెనీలకు చెందిన పారిశ్రామిక వేత్తలు వస్తే మనం ఎయిర్ పోర్ట్ కు వెళ్లి స్వాగతిస్తాం.. కానీ గత వైసీపీ హయాంలో పెట్టుబడిదారులను దారుణంగా అవమానించారు. గత ప్రభుత్వంలో టెక్స్ టైల్స్ పాలసీ ఇచ్చి గైడ్ లైన్స్ ఇవ్వలేదు. గైడ్ లైన్స్ మనం అధికారంలోకి వచ్చాక ఇచ్చాం. గత ప్రభుత్వం అంత ఘోరంగా పారిశ్రామిక వేత్తలను అవమానించారు. ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డుకు వైసీపీ హయాంలో 10 మందికే పరిమితం చేశారు. 2014-19 లో 60 మందితో పనిచేశాం.  నేడు దాదాపు 50 మంది పనిచేస్తున్నారు. మన విధానాలు ప్రమోట్ చేయడంలో ఈ బోర్డు పనిచేస్తుంది. ఇప్పుడు కూడా ఒక బోర్డు జపాన్ లో పర్యటిస్తోంది. మన ప్రభుత్వం వచ్చాక అన్ని పాలసీలు, గైడ్ లైన్స్ తీసుకొచ్చాం. చంద్రబాబు  ఎప్పుడు స్పీడ్ అప్ డూయింగ్ బిజినెన్స్ పై చెబుతారు. 

ఒక కంపెనీ ఏర్పాటు కావడం ఆలస్యం అయితే వడ్డీ ఎక్కువగా పెరిగిపోతుంది. ఉదాహరణకి కర్నూల్ లో ఉన్న జైరాజ్ స్టీల్స్ ప్రాజెక్ట్ ఆలస్యం కావడంతో కొన్ని కోట్లు వడ్డీలే సరిపోతుంది. రూ.9.40 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ ఏడాదిలో మనం సాధించాం. రూ.1000 కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీ ఉంటే త్వరగా అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభింపజేసేలా పాలన సాగిస్తున్నాం. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయబోతున్నాం. ఇప్పటికే 11 ప్రారంభించాం. 39 పార్కులకు ఫౌండేషన్ వేశాం. 20 లక్షల ఉద్యోగాలు సాధించే దిశగా పనిచేస్తున్నాం. కాస్త ఓపికతో ఉండండి. కచ్చితంగా ఈ ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని మంత్రి వెల్లడించారు

By
en-us Political News

  
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలేశుని దర్శనం కోసం పోటెత్తుతున్నారు.
అహ్మదాబాద్ లో విమానం కుప్పకూలి కూలి 274 మంది మరణించిన దుర్ఘటన మరవక ముందే ఉత్తరాఖండ్ లో ఓ హెలికాప్టర్ ప్రమాదంలో ఆరుగురు మరణించిన ఘటన ఆందోళన కలిగిస్తోంది.
సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అన్న మహత్తర ఆశయంతో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల గుండెల్లో గూడు కట్టుకుందనడంలో సందేహం లేదు. తెలుగు ప్రజల అభ్యున్నతి, ఆత్మగౌరవం లక్ష్యంగా పని చేస్తున్న పార్టీ. అటువంటి పార్టీ రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో కొంత వెనుకబడింది.
గుడ్డ కాల్చి ముఖం మీద వేయడం వైసీపీకి అలవాటే. ఆధారాలు లేని ఆరోపణలు చేయడం.. ఆ పార్టీకి ఆవిర్భావం నుంచీ కూడా ఒక ఆనవాయితీగా వస్తున్నది. అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలోనూ అదే చేసింది. న్యాయ సమీక్షకు నిలబడని ఆరోపణలతో తప్పుడు కేసులతో ప్రత్యర్థులను వేధించి, తప్పుడు కేసులు బనాయించి జైళ్లకు పంపిన సంగతి తెలిసిందే.
ఆ సీటులో కూర్చుంటే...ఎంత ఘోర ప్రమాదం సంభవించినా, ఆ సీటులో కూర్చున్న ప్రయాణీకుడు ప్రాణాలతో బయట పడిపోతారు. అహ్మదాబాద్, విమాన ప్రమాదం తర్వాత పిచ్చపిచ్చగా ట్రెండ్ అవుతున్న వింతల్లో ఇదొకటి.
తెలంగాణ గద్దర్ అవార్డు వేడుకల్లో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డును సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు.
కృష్ణా జలాల్లో జల దోపిడి జరిగినట్లుగా గోదావరి జలాలను బనకచర్ల ద్వారా ఆంధ్రప్రదేశ్ దోపిడీ చేస్తుందని.. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మౌనంగా ఉంటున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.
రేపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరగాల్సిన సినీ ప్రముఖుల సమావేశం వాయిదా పడింది. రేపు షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 15న సాయంత్రం 4 గంటలకు ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఈ సమావేశం జరగాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్యావరణ, అడవి శాఖ సలహాదారుడుగా కొమిర జాజి (అంకారావు) అనే వ్యక్తికి కూటమి ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది.
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ అమరావతిలో మీడియాతో హోంశాఖ మంత్రి మాట్లాడుతు రాష్ట్రంలో సీఎం చంద్రబాబు ఉన్నంత వరకూ జగన్ ఆటలు సాగవని ఆమె హెచ్చరించారు.
ఫైనల్స్ అంటే ఒత్తిడికి గురవుతారన్న అపవాదు ఉన్న సఫారీలు దాన్ని అధిగమించి కంగారూలపై ఘన విజయం సాధించారు . దక్షిణాఫ్రికా జట్టు అస్ట్రేలియాపై అద్భత విజయం సాధించి వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌ను కైవసం చేసుకుంది.
భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ప్రకృతి సేద్యం చేస్తూ రాధాకృష్ణ పారాయణం పటిస్తున్న కుర్మా గ్రామంలో ఇటీవలే సంభవించిన అగ్ని ప్రమాద విషయాన్ని తెలుసుకొన్న పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఘటన స్థలాన్ని పరిశీలించారు.
దుబాయ్ మెరీనాలోని ఒక ఎత్తైన నివాస భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. మెరీనా పినాకిల్ టైగర్ టవర్ గా పిలవబడే ఈ భవనం మొదటి అంతస్తులో ఏపీ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి భవనం అంతటికీ వ్యాపించాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.